సాక్షి ప్రతినిధి, కాకినాడ :జిల్లాలో తుని నుంచి ప్రారంభించే ఏ కార్యక్రమమైనా విజయం సాధిస్తుందన్నది పలువురి బలమైన నమ్మకం. మహానేత వైఎస్ 2007 సెప్టెంబరు 14న ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ ఆదర్శ గ్రామా ల పథకానికి తుని మండలం ఎస్.అన్నవరం నుంచే శ్రీకారం చుట్టారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ప్రచారాన్ని కూడా ఆయన తుని నుంచే ప్రారంభించారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ సెంటిమెంట్ను గౌరవిం చాలన్న పార్టీ జిల్లా నేతల అభ్యర్థనను మన్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని తుని నుంచే ప్రారంభిస్తున్నారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లాలో తొమ్మిది రోజులు ప్రచారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ విజయావకాశాలను ఇతోధికం చేసి వెళ్లారు.
ఇప్పుడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని విజయమ్మ సోమవారం చేపడుతున్నారని పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి ఆదివారం తెలిపారు. విజయమ్మ సోమవారం తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారన్నారు. తుని నుంచి ఎ.వి.నగరం మీదుగా పెరుమాళ్లపురం చేరుకునే విజయమ్మ అక్కడ ఉదయం 10 గంటలకు వైఎస్సార్ జనభేరి సభలో ప్రసంగిస్తారన్నారు. అనంతరం ఒంటిమామిడి జంక్షన్, తొండంగి, శృంగవృక్షం, ఎ.కొత్తపల్లి, గోపాలపట్నం, అన్నవరం, కత్తిపూడి మీదుగా సాయంత్రం 4 గంటలకు ప్రత్తిపాడు చేరుకుని అక్కడ సభలో ప్రసంగిస్తారన్నారు. అక్కడి నుంచి జగ్గంపేట నియోజకవర్గం గోకవరం చేరుకుని సాయంత్రం 6 గంటలకు జరిగే సభలో ప్రసంగిస్తారని, దాంతో విజయమ్మ తొలిరోజు ప్రచారం ముగుస్తుందని తెలిపారు.
నేటి నుంచి జిల్లాలో విజయమ్మ ‘వైఎస్సార్ జనభేరి’
Published Mon, Apr 21 2014 8:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement