కలెక్టరేట్, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుండగా, పది గంటల వరకు మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం వరకు మొత్తం ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటృన్నారు.
జిల్లాలో పది నియోజకవర్గాలకు, రెండు పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జిల్లా కేంద్రంలోని గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల (బాలుర, బాలికల)లో జరుగుతుంది. జిల్లా కేంద్రంలో 20 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. ఒక నియోజకవర్గానికి చెందిన ఓట్లను రెండేసి హాళ్లలో లెక్కింపు చేపట్టనున్నారు. నిరంతరం కౌంటింగ్ను పర్యవేక్షించేందుకు ఎనిమిది మంది పరిశీలకులకు అందుబాటులో ఉంచారు. వీరు ఒక రౌండ్ పూర్తయిన వెంటనే మళ్లీ పరిశీలించిన లెక్కింపు జరుపుతారు. వీరితోపాటు కలెక్టర్ అహ్మద్ బాబు, జేసీ లక్ష్మీకాంతంలు ఉంటారు.
లెక్కింపునకు 1,164 మంది అధికారులు
సాధారణ ఓట్ల లెక్కింపు కోసం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 20 హాళ్లలో 240 టేబుళ్ల ద్వారా ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించేందుకు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్కు ఒక ప్రింటింగ్ కమ్ ఆక్సిలరీ డిస్ప్లే యూనిట్ను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్కు మగ్గురు అధికారుల చొప్పున నియమించారు. 288 మంది సూపర్వైజర్లను, 288 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను, 288 మంది కౌంటింగ్ పరిశీలకులను నియమించారు.
వీరు కాకుండా 300 మంది ఇతర కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు లెక్కించనున్నారు. ఓట్లను కౌంటింగ్ చేసిన అధికారులు ప్రతిదీ కౌంటింగ్ ఏజెంట్లకు చూపించాలి. సీల్ ఉందా.. లేదా.. అనే విషయాలు తెలుస్తాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి పోలీసు బందోబస్తు నియమించారు.
ముందస్తు ఫలితాలతో ఉత్కంఠ
సాధారణ ఎన్నికల ఫలితాలకు ముందు స్థానిక, మున్సిపల్ ఫలితాలు వెలువడడంతో అభ్యర్థుల్లో మూడు రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. ముందుగా వచ్చిన ఫలితాలు మరోసారి రిపీటు అవుతాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ముందొచ్చిన ఫలితాలు అభ్యర్థులకు కంటిమీదా కునుకు లేకుండా చేస్తున్నా.. ఆ ఫలితాలు సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపేవిగా లేదనే ధీమాతో అభ్యర్థులు ఉన్నారు. ఇక కౌంటింగ్ కోసం పార్లమెంట్ అభ్యర్థులు ఇప్పటికే 336 మంది కౌంటింగ్ ఏజెంట్లను నియమించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం ఓట్ల లెక్కింపు జిల్లా కేంద్రంలో జరుగగా, పెద్దపల్లి పార్లమెంట్ స్థానం ఓట్ల లెక్కింపు పెద్దపల్లిలో జరుగనుందని కలెక్టర్ అహ్మద్ బాబు బుధవారం నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు
Published Fri, May 16 2014 1:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement