బెల్ట్‌షాపులపై మహిళల సమరం | Sakshi
Sakshi News home page

బెల్ట్‌షాపులపై మహిళల సమరం

Published Sat, Oct 22 2016 2:01 PM

women protest at excise office in krishna district

నందిగామ : కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామంలో బెల్టుషాపుల నిర్వహణపై మహిళలు నిరసన గళం విప్పారు. శనివారం దాదాపు 60 మంది మహిళలు నందిగామలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. గ్రామంలో విచ్చలవిడి మద్యం అమ్మకాల కారణంగా తమ కుటుంబాలు వీధినపడుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు జోక్యం చేసుకుని వాటిని మూసివేయించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement