‘మధుసూదన్ రెడ్డి బెంగళూరులో ఉండొచ్చు’ | Sakshi
Sakshi News home page

‘మధుసూదన్ రెడ్డి బెంగళూరులో ఉండొచ్చు’

Published Tue, Feb 9 2016 10:49 AM

‘మధుసూదన్ రెడ్డి బెంగళూరులో ఉండొచ్చు’ - Sakshi

తిరుపతి లీగల్: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి బెంగుళూరులో ఉండడానికి అనుమతి ఇస్తూ తిరుపతి ఐదవ అదనపు జిల్లా జడ్జి శ్యామ్‌సుందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా మేనేజర్‌పై దాడి చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో బియ్యపు మధుసూదన్ రెడ్డికి గత నెల 27న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

ఆయన నెలరోజుల పాటు నెల్లూరులోనే వుండాలని న్యాయమూర్తి గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తన కుటుంబసభ్యులు బెంగుళూరులో ఉన్నారని, ఆరోగ్యరీత్యా తాను బెంగుళూరు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ బియ్యపు మధుసూదన్‌రెడ్డి తిరుపతి కోర్టులో పిటీషన్ దాఖలు చేసుకున్నారు. ఆ పిటీషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి ఆయన బెంగుళూరు వెళ్లడానికి అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement