అవ్వా.. నా సొంత ఖర్చుతో నీకు ఇల్లు కట్టిస్తా! | Sakshi
Sakshi News home page

అవ్వా.. నా సొంత ఖర్చుతో నీకు ఇల్లు కట్టిస్తా!

Published Fri, Feb 24 2017 12:38 AM

అవ్వా.. నా సొంత ఖర్చుతో నీకు ఇల్లు కట్టిస్తా! - Sakshi

వృద్ధురాలికి మంత్రి కేటీఆర్‌ రూ.26 వేల తక్షణ సాయం

సిరిసిల్ల రూరల్‌: ఓ అవ్వ గోడు విని చలించిపోయిన మంత్రి కె.తారక రామారావు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించేందుకు తంగళ్లప ల్లి మండలం రామచంద్రాపూర్‌ గ్రామానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌కు మేడిపల్లి లీలవ్వ(65) తన గోడును వెల్లబోసుకుంది. తన ఇద్దరు కొడుకులు మరణించారని, ఎవరూ లేక అనాథలా ఉంటున్నానని, కనీసం గూడు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

అవ్వ గోడు విని చలించిన మంత్రి కేటీఆర్‌ వెంటనే తన జేబులో ఉన్న రూ.26 వేలను లీలవ్వకు సాయంగా అందించారు. అవ్వా.. నీకు నా సొంత ఖర్చుతో ఇల్లును నిర్మించి ఇస్తా.. అని హామీ ఇచ్చాడు. ఖర్చు ఎంతైనా పంపిస్తానని, వెంటనే పనులు ప్రారం భించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. వృద్ధురాలి సమస్య విని అప్పటికప్పుడు స్పందించిన మంత్రి కేటీఆర్‌ను గ్రామస్తులు అభినందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement