► తిరుపతి హోటల్ గదిలో ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య
► అబ్బాయిది వరంగల్, అమ్మాయిది ప.గో
► కలిసి బతకడం కష్టమనే నిర్ణయంతో బలవన్మరణం
ఇదో విచిత్ర బంధం. పెద్దలు కలిపిన బంధం కాదు. వారికి వారే పెనవేసుకున్న అనురాగ బంధం. ప్రాంతాలు.. కులాలు వేరైనా మనసులు మాత్రం ఒక్కటయ్యాయి. దీంతో ఒకరినొకరు ప్రాణంగా ఇష్టపడ్డారు. కలిసి జీవించాలని కలలు కన్నారు. కానీ... అప్పటికే వివాహితులైన ఆ ఇద్దరూ సమాజానికి భయపడ్డారు. ఇదేమని ఎవరైనా అడిగితే ఏం బదులు చెప్పాలో తెలియక కలవరపడ్డారు. కలిసి బతకలేమన్న భీతితో చివరకు తనువు చాలించారు. చనిపోయేప్పుడు ఎలా ఉంటుందో తెలియదు గానీ... ప్రాణంగా ప్రేమించిన వాళ్లు పరాయి వాళ్లుగా మారుతుంటే మాత్రం ప్రాణం పోయినట్లుంటుందన్న నిర్ణయానికి వచ్చారు. ఈ నిర్ణయమే వారిని మృత్యువుకు చేరువ చేసింది. వీడలేని బంధం మాదంటూ ఒకేసారి విగతజీవులయ్యారు. ఈ సంఘటన శుక్రవారం తిరుపతిలో వెలుగు చూసింది.
తిరుపతి / తిరుపతి క్రైం : తిరుపతిలో ఓ ప్రేమజంట గురువా రం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం బెజవాడవారి పల్లెకి చెందిన దేవల పాపారావు, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె మౌనికకు మూడునెలల కిందటే దగ్గర బంధువుతో పెళ్లైంది. ఈ పెళ్లికి ముందు మౌనికకు రంజిత్తో పరిచయం ఉంది. వరంగల్ జిల్లా మోదుగులగూడెం మండలం పానరసకి చెందిన తేజావత్ రంజిత్ కుమార్ (31) వరంగల్ ఫారెస్టు డిపార్ట్మెంట్లో కాంట్రాక్టు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల కిందటే వివాహమై ఓ కుమార్తెను కలిగిన రంజిత్ భార్య చనిపోయింది. కాగా అడపాదడపా ఆచం ట నుంచి బంధువులున్న వరంగల్కు రాకపోకలు సాగించే క్రమంలో మౌనికకు రంజిత్తో పరిచయమైంది. ఈ పరిచయం ప్రేమగా మారింది. అయితే అప్పటికే వివాహమై కుమార్తెను కలిగి ఉన్న రంజిత్తో వివాహం కష్టమని నిర్ణయించుకున్న మౌనిక తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేక పెద్దలు చేసిన పెళ్లికి తలొంచింది. అయితే మనసులోని రంజిత్ను మాత్రం మర్చిపోలేకపోయింది. జనవరి 22న ఇంటి నుంచి పారిపోయింది. అదే నెల 29వతేదీ వరకు ఆమె భర్త, తల్లిదండ్రులు గాలించినా కనబడకపోవడంతో వారి ఫిర్యాదు మేరకు ఆచంట పోలీసులు మిస్సింగ్ కేసు నమో దు చేశారు.
అనంతరం వీరిరువురూ ఈనెల 13న తిరుపతికి చేరుకుని ఆర్టీసి బస్టాండు ఎదురుగా ఉన్న ఓ ప్రముఖ హోటల్లో భార్యాభర్తలమని చెప్పి గదిని అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి తిరుమల, తిరుపతిలోని దేవాలయాలను సందర్శించారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం సమయంలో రూమ్ను శుభ్రపరిచేందుకు రూమ్బాయ్ కాలింగ్ బెల్ వేశాడు. ఎంతసేపటికీ డోర్ తీయక పోవడంతో హోటల్ మేనేజర్కు సమాచారం అందించగా అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈస్టు సీఐ రాంకిషోర్, ఎస్ఐ ఘటనా స్థలం చేరుకుని గది డోర్ను పగులకొట్టి లోపలకు వెళ్లి చూడగా వీరిద్దరు ఒకే ఫ్యాన్కు ఒకరు వైరుతో, మరొకరు చున్నీతో ఉరివేసుకున్నారు. సెల్ఫోన్ ఆధారంగా ఇరువురి ఆచూకీ తెలుసుకుని పోలీసులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమను చంపుకోలేక..
Published Sat, Feb 18 2017 2:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement