అగ్నిప్రమాదంలో ట్రాన్స్‌పోర్టు లారీ దగ్ధం | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో ట్రాన్స్‌పోర్టు లారీ దగ్ధం

Published Sun, Jun 26 2016 11:47 AM

Lorry burned out in fire mishap at prakasam

సింగరాయకొండ(ప్రకాశం): హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ట్రాన్స్‌పోర్టు లారీ ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపుడి జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్.ఆర్.ఎం.టీ ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీ హైదరాబాద్ నుంచి చెన్నైకు సరుకులను తరలిస్తుండగా.. శానంపుడి జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి.

ఇది గుర్తించిన డ్రైవర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. సంఘనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న సరుకులు కాలి బూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణలు తెలియరాలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement