సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై విచారణ వాయిదా | Sakshi
Sakshi News home page

సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై విచారణ వాయిదా

Published Thu, Feb 9 2017 5:31 PM

సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై విచారణ వాయిదా - Sakshi

హైదరాబాద్‌:
సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి హైకోర్టులో నిరుద్యోగులు వేసిన పిల్ గురువారం విచారణకు వచ్చింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ప్రకటించిందో తెలపాలని కోరింది.

వారు చేసిన మార్గదర్శకాలను అఫిడవిట్ ద్వారా తెలియజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement