ప్రాణం తీసిన ఈత సరదా | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఈత సరదా

Published Thu, Mar 23 2017 11:34 PM

boy dies of water in entertainment of swimming

పావగడ : పావగడ సమీపాన గల రొప్పం వద్ద ఓ బావిలో సరదాగా ఈతకెళ్లిన ఆదర్శనగర్‌కు చెందిన వెంకటరమణప్ప కుమారుడు మనోజ్‌కుమార్‌(18) గురువారం ప్రాణాలో కోల్పోయినట్లు ఎస్‌ఐ మంజునాథ్‌ తెలిపారు. స్నేహితులతో కలసి ఈత కోసం బావి వద్దకు వెళ్లిన అతను బురదలో కూరుకుపోయి ఊపిరాడక మృతి చెందినట్లు వివరించారు. చేతి కొచ్చిన కొడుకు అకాల మృత్యువాతపడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు దర్యాప్తులో ఉంది. 

Advertisement
Advertisement