భారత్‌–చైనా–యూకే.. భాగస్వామ్యం!! | Sakshi
Sakshi News home page

భారత్‌–చైనా–యూకే.. భాగస్వామ్యం!!

Published Sat, Jun 24 2017 12:55 AM

భారత్‌–చైనా–యూకే.. భాగస్వామ్యం!!

పెట్టుబడులకు కీలకమన్న జీపీ హిందూజా
లండన్‌: ప్రపంచంలో కేవలం భారత్‌లో మాత్రమే పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ ఎంట్రప్రెన్యూర్‌ జీపీ హిందూజా అభిప్రాయపడ్డారు. ఇన్వెస్ట్‌మెంట్లకు సంబంధించి చైనా, ఇండియా, యూకేల మధ్య ఒక త్రైపాక్షిక భాగస్వామ్యం అవసరమని తెలిపారు. ‘చైనీయుల వద్ద డబ్బులున్నాయి. బ్రిటన్‌ వారి వద్ద నైపుణ్యత ఉంది.

భారత్, చైనా, యూకే మధ్య ఒక త్రైపాక్షిక భాగస్వామ్యం అవసరం. దీనిపై ఆయా దేశాల ప్రభుత్వాలు కృషిచేయాలి’ అని హిందూజ గ్రూప్‌ కో–చైర్మన్‌ జీపీ హిందూజా గురువారం రాత్రి చైనా బిలియనీర్లు, బ్రిటిష్‌ ప్రభుత్వపు ప్రతినిధులతో నిర్వహించిన ఒక సమావేశంలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement