సాక్షి, ముంబై: 2022 సంవత్సరానికి నైపుణ్యతల కొరత కారణంగా కనీసం 21 శాతంమందికి ఉద్యోగ ముప్పు తప్పదని ఫిక్కి తాజా నివేదికలో పేర్కొంది. దేశంలో భవిష్య ఉద్యోగాల భద్రత అంశంపై నిర్వహించిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలను వెల్లడించింది. 132 పేజీల రిపోర్టును శుక్రవారం వెల్లడించింది. దేశంలో జనాభాపరమైన మార్పులు, ప్రపంచీకరణ, భారతీయ పరిశ్రమల ఆధునిక సాంకేతికీకరణ లాంటి వివిధ అంశాలపై ఇదిఆధారపడి ఉంటుందని రిపోర్ట్ చేసింది. నైపుణ్య ఆధారితవిద్య అవసరాన్నినొక్కి చెప్పడంతో పాటు ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు ఇతర పరిశ్రమలు ప్రారంభ దశలోనే ఈ మస్య పరిష్కారానికి మార్గాలు అన్వేషించాలని ఫిక్కి సూచించింది.
నివేదిక ప్రకారం 2022 నాటికి ముఖ్యంగా ఐటీ రంగంలో నిపుణులు అత్యధిక ముప్పు ఎదుర్కొంటారని నివేదించింది. ఈనేపథ్యంలో ఇక్కడ నైపుణ్యాల ఆవశ్యకత చాలా ఉందని పేర్కొంది. 2022 నాటికి 20-30శాతం ఐటీ రంగ నిపుణులు తమ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదంలో పడనున్నారని అంచనా వేసింది. అలాగే వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, వైర్లెస్ నెట్వర్క్, నిపుణులు, డేటా ఎనలిస్టులు, యాండ్రాయిడ్ డెవలపర్ తదితర కేటగిరీల్లో భవిష్యత్తు ఉద్యోగాలుంటాయని తెలిపింది. అలాగే వస్త్ర, ఆటోమొబైల్ , రిటైల్ వంటి ఇతర రంగాలు కూడా వేగంగా మారతాయని తెలిపింది.
ప్రపంచంలో ఆన్లైన్ ఉద్యోగాల్లో 24శాతంతో భారీ స్థానాన్ని ఆక్రమించిన భారత్లో ఉద్యోగాల కల్పనలో రాబోయే ఏళ్లలో ఆన్లైన్, ఎక్స్పోనెన్షియల్ టెక్నాలజీ రంంలో అగ్రభాగంలోనూ, టెక్నాలజీ ఎగ్రిగేటర్ మోడల్ ఉబెర్ లాంటివి రెండవ కీలక రంగంగా ఉంటుందని తెలిపింది. అంతేకాదు ప్రభుత్వం, విధాన రూపకర్తలు రెండు-మూడు సంవత్సరాల కాలాన్ని ఉపయోగించుకోవాలని ఈ నివేదిక సిఫార్సు చేసింది. జనరల్, టెక్నికల్, వృత్తిపరమైన విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు తీసుకురావాలని, ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని. పరిశ్రమలు వివిధ స్థాయిలలో ఉద్యోగుల శిక్షణ కార్యక్రమాలతోపాటు డిజిటల్ ఎకానమీ పద్ధతులను అలవర్చుకోవాలని కోరింది.
2022 నాటికి 21శాతం ఉద్యోగ ముప్పు
Published Sat, Sep 16 2017 12:25 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- 'పవర్'లెస్.. భ'జనసేన' మాకొద్దు!!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement