సీఆర్డీఏ కమిషనర్పై వైఎస్సార్సీపీ ధ్వజం
ఏ అధికారంతో రైతులను శాసిస్తున్నారు?
రైతుల ప్రాథమిక హక్కుల్ని ఎలా కాలరాస్తారు?
భూములివ్వనివారిని అణగదొక్కేందుకే శ్రీకాంత్ను చంద్రబాబు తెచ్చారు
సోంపేట, కాకరాపల్లి రైతుల్ని పొట్టన పెట్టుకున్న చరిత్ర ఆయనది
వచ్చే సీజన్ నుంచి పంటలేయవద్దని శాసిస్తే.. చూస్తూ ఊరుకోం
రైతుల పక్షాన పోరాడుతాం.. న్యాయస్థానాలనూ ఆశ్రయిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో వచ్చే సీజన్ నుంచి పంటలు వేసుకోవడానికి అనుమతి లేదన్న ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. పంటలు వేసుకోవద్దని నిషేధం విధించడానికున్న అధికారాలేంటని ప్రశ్నించింది. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం గురువారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే సీజన్ నుంచి పంటలు వేసుకోవడానికి అనుమతి లేదంటూ సీఆర్డీఏ కమిషనర్ చెప్పడంపై తీవ్రంగా మండిపడ్డారు.
‘‘ఏపీ రాజధాని ప్రాంతంలో రైతులను పంట వేసుకోవద్దని చెప్పడానికి సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ ఎవరు? ఏ అధికారంతో రైతులను శాసిస్తున్నారు? దమ్ముంటే రైతులు పంట వేసుకోవద్దని జీవో ఇమ్మనండి. ఆయన ఏమైనా రాష్ట్రపతా? లేక రాజ్యాంగేతర శక్తా? రైతుల ప్రాథమిక హక్కులు ఎలా కాలరాస్తారు?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు భూములివ్వకపోతే, ఉద్యమిస్తే అణగదొక్కడమేగాక.. వారిని శవాలుగా మార్చయినాసరే రాజధాని నిర్మించాలనే సంకల్పంతోనే సీఎం చంద్రబాబునాయుడు సీఆర్డీఏ కమిషనర్గా శ్రీకాంత్ను నియమించారని దుయ్యబట్టారు.
శ్రీకాంత్కు గతంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా ఉన్నపుడు నరహంతకుడుగా మారి సోంపేట, కాకరాపల్లి రైతులను పొట్టన పెట్టుకున్న చరిత్ర ఉందని తమ్మినేని నిప్పులు చెరిగారు. యాజమాన్యాలిచ్చిన లంచాలకు అమ్ముడుబోయి రైతుల్ని కాల్పించింది శ్రీకాంతేనని, ఇప్పటికీ ఆ గ్రామాల్లో ఆనాటి రక్తపు మరకలు ఆరలేదని అన్నారు.
‘‘ఇలాంటి వ్యక్తిని రాజధాని ప్రాంతానికి కమిషనర్గా వేస్తారా? చంద్రబాబూ... అఖిలభారత స్థాయిలోనే నంబర్వన్ అవినీతిపరుడైన అధికారిగా శ్రీకాంత్ గణుతికెక్కిన విషయం మీకు తెలియదా?’’ అని సూటిగా ప్రశ్నించారు. వచ్చే సీజన్ నుంచి పంటలు వేయవద్దని శ్రీకాంత్ శాసిస్తే.. తాము న్యాయస్థానాలకు వెళ్లి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తాత ముత్తాతల నాటినుంచీ పొలాలతో తమ మనోభావాలు పెనవేసుకుని జీవిస్తున్న రైతులనుంచి బలవంత ంగా వాటిని లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. వారిపక్షాన పోరాడుతామన్నారు. తన కుమారుడిని ఇంకా కోటీశ్వరుడిని చేసి.. సీఎంగా చేయాలని తాపత్రయపడుతున్న చంద్రబాబుకు తన సొంత సంస్థ హెరిటేజ్ను ఇవ్వమంటే ఎంత బాధ కలుగుతుందో.. రైతులకూ అంతేకదా అని ఆయన అన్నారు.
ప్రజాపక్షాన పోరాటానికే జగన్ దీక్ష
టీడీపీ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయి పోరాటాలకు సిద్ధమవుతున్న ప్రజల తరఫున ప్రశ్నించేందుకే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో ఈ నెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో రెండు రోజులపాటు నిరాహారదీక్ష చేస్తున్నారని సీతారాం వివరించారు. జగన్ చేయబోయే ఈ దీక్ష ప్రభుత్వంపై ప్రజాగ్రహానికి అద్దం పడుతుందని అంటూ.. ‘తణుకు సభతో టీడీపీ ప్రభుత్వానికి వణుకు పుడుతోంది’ అని అన్నారు. జగన్ దీక్షకు రాష్ట్ర ప్రజలంతా మద్దతునివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పంటలు వద్దనడానికి మీరెవరు?
Published Fri, Jan 30 2015 1:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement