వెల్‌డన్ రవి | Sakshi
Sakshi News home page

వెల్‌డన్ రవి

Published Mon, Feb 2 2015 4:02 AM

వెల్‌డన్ రవి - Sakshi

వంక రవీంద్రను అభినందించిన వైఎస్ జగన్
 తణుకు : వెల్‌డన్ రవి.. రైతు దీక్షను విజయవంతం చేశారంటూ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వంక రవీంద్రనాథ్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. రైతుదీక్ష ముగించుకుని విజయవాడ వెళుతూ జగన్‌మోహన్‌రెడ్డి రవీంద్రనాథ్‌ను పిలిచి ఆలింగనం చేసుకుని అభినందించారు. చక్కగా సమన్వయంతో దీక్షను విజయవంతం చేశారంటూ కితాబునిచ్చారు. వంక రవీంద్ర జగన్ వెంట గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు వెళ్లి ఆత్మీయంగా సాగనంపారు.
 
 అన్నీ తానైన వంక రవీంద్ర
 రుణమాఫీతో మోసపోయిన రైతులు, డ్వాక్రా మహిళలకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో చేపట్టిన రైతు దీక్ష విజయవంతంలో నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వంక రవీంద్రనాథ్ అన్నీ తానై కీలక భూమిక పోషించారు. దీక్ష ప్రారంభం నుంచి ముగిసే వరకు వివిధ ప్రాంతాల నాయకులతో సమన్వయం చేసుకుని చకచకాపనులు చేయిస్తూ ముందుండి నడిపించారు. సమన్వయకర్తలు చీర్ల రాధయ్య, కారుమూరి  నాగేశ్వరరావులతో కలిసి ఏర్పాట్లు సాగించడంతో పాటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సమన్వయకర్తలు, నాయకులను భాగస్వాములను చేస్తూ దీక్ష ఘన విజయం సాధించేందుకు తోడ్పడ్డారు. అన్ని వర్గాల ప్రజలను కలిసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న రైతు దీక్షను ఎందుకు విజయవంతం చేయాలో విశదీకరించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement