కడపలో దొంగలముఠా అరెస్ట్ | Sakshi
Sakshi News home page

కడపలో దొంగలముఠా అరెస్ట్

Published Wed, Oct 7 2015 1:07 PM

robbery gang arrested in kadapa distirict

కడప: దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను వైఎస్ఆర్ జిల్లా కడప సీసీఎస్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు..కడప నగరానికి చెందిన షేక్ మహబూబ్(21) అలియాస్ మాబు, ఆవుల సాయి ప్రతాప్ రెడ్డి(22), షేక్ చాంద్ పాషా(24)లు ఏడాది నుంచి దొంగతనాలకు పాల్పడుతుండటంతో నిఘా పెట్టి వారిని పట్టుకున్నారు.

మంగళవారం సాయంత్రం కడప-రాయచోటి మార్గంలోని ఉట్కూరు రైల్వే గేటు వద్ద ఓ హోటల్‌ లో పట్టుబడ్డారు. వీరు ఏడాది నుంచి 9 చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారని విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ నవీన్ గులాటి తెలిపారు. వీరి నుంచి 571 గ్రాముల బంగారం, 150 గ్రామల వెండి, ఒక ఎల్‌ఈడీ టీవీ, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement