- మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్న కోడలి ఆవేదన
- కన్నబిడ్డ కోసం పలమనేరు పెళ్లి సత్రం వద్ద పడిగాపులు
- విషయం తెలిసి ముందుగానే వెళ్లిపోయిన భర్త
పలమనేరు : రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కుటుంబ సభ్యులు మూడేళ్లుగా తన బిడ్డను చూపకుండా ఇబ్బందులు పెడుతున్నారని రఘునాథరెడ్డి అన్న కోడలు పల్లె భారతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన భర్తతో పాటు ఉంటున్న కుమార్తె పలమనేరులోని ఓ కల్యాణ మండపంలో శుక్రవారం బంధువుల పెళ్లికి హాజరవుతుందని తెలుసుకున్న బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి ఇక్కడికొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న భర్త వెంకటరమణారెడ్డి తన కుమార్తెతో పాటు పలమనేరు నుంచి వెళ్లిపోయారు.
పెళ్లి మండపం వద్ద భర్త, కుమార్తె కోసం బాధితురాలు కొంతసేపు వెతికారు. వెంకటరమణారెడ్డి ఇక్కడికి రాలేదని పెళ్లి వారు చెప్పారు. అనంతరం ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని విలేకరులకు వివరించారు. తనకు 1999లో పల్లె రఘునాథరెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి కుమారుడు వెంకటరమణారెడ్డితో వివాహమైందన్నారు. తన తల్లిదండ్రులు రూ.20 లక్షల నగదు, కిలో బంగారం కట్నంగా ఇచ్చినట్లు తెలిపారు. కొన్నాళ్లకు భర్తతో కలిసి అమెరికాలోని చికాగోకు వెళ్లామన్నారు. తనకు ఉద్యోగం లేకపోవడంతో భర్త వేధించేవాడన్నారు.
2003లో పాప త్రిష పుట్టిందని, 2011లో స్వదేశానికి వచ్చామని తెలిపారు. తనను ఢిల్లీ ఎయిర్పోర్టులోనే వదిలిపెట్టి బిడ్డతో పాటు బెంగళూరుకు వెళ్లిపోయారన్నారు. తనకు జరిగిన అన్యాయంపై పల్లె రఘునాథరెడ్డిని ఆశ్రయించగా న్యాయం చేస్తామని చెప్పి తర్వాత పట్టించుకోలేదన్నారు. ఈ విషయంపై తాము ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. విషయం తెలుసుకున్న రఘునాథరెడ్డి రాజకీయంగా తనకు ఇబ్బందులొస్తాయని చెప్పి రాజీ చేశారన్నారు. ఆ తర్వాత తనను ఎవరూ పట్టించుకోలేదని, బిడ్డను కూడా చూపలేదని వాపోయూరు. తనకు ముఖ్యమంత్రి అయినా న్యాయం చేయాలని ఆమె కోరారు.
నా బిడ్డను చూపడం లేదు
Published Sat, Aug 23 2014 2:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement