-
మాకొద్దీ మాయదారి మద్యం
పలమనేరు/బైరెడ్డిపల్లి (చిత్తూరుజిల్లా) : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం మేకల మాగిరెడ్డిపల్లి గ్రామస్తులు మద్యం తాగకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఎవరు అతిక్రమించినా జరిమానాతో పాటు గ్రామ బహిష్కరణ చేయాలని సర్పంచ్తో కలిసి నిర్ణయం తీసుకున్నారు. మేకల మాగిరెడ్డిపల్లిలో మొత్తం 270 కుటుంబాలు, రెండు వేల దాకా జనాభా ఉన్నారు. దాదాపు అందరికీ కూలీనాలీయే జీవనాధారం. అయితే కొన్నాళ్లుగా కొందరు కర్ణాటక టెట్రాప్యాకెట్లను తెచ్చి గ్రామంలో అమ్ముతున్నారు. దీంతో యువకులు మద్యానికి బానిసలై కుటుంబాలకు భారంగా మారారు. దీన్ని గమనించిన సర్పంచ్ బాలకృష్ణ గ్రామ పెద్దలతో చర్చించి వారం రోజుల కిందట పంచాయితీ పెట్టించారు. తమ గ్రామం బాగుపడాలంటే ఊర్లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. మద్యం తాగినా, కర్ణాటక నుంచి ఎవరైనా మద్యం తెచ్చి అమ్మినా వారికి రూ.20 వేల జరిమానాతో పాటు, గ్రామ బహిష్కరణ చేయాలని తీర్మానించారు. ఫలితంగా గ్రామంలో వారం నుంచి మద్య పానం ఆగిపోయింది. అమ్మకాలు నిలిచిపోయాయి. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం.. మా గ్రామంలో చాలామంది మద్యానికి బానిసలైపోవడంతో కలత చెందాం. దీంతో పాటు కర్ణాటక నుంచి టెట్రా ప్యాకెట్లను తెచ్చి విక్రయించేవాళ్లు ఎక్కువయ్యారు. దీంతో గ్రామంలో యువకులు చెడిపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. – బాలకృష్ణ, సర్పంచ్, ధర్మపురి పంచాయతీ -
ప్రభవించిన పుంగనూరు
పలమనేరు పశు పరిశోధన కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్న పుంగనూరు జాతి ఆవు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు–2022కు ఎంపికైంది. ఈ నెల 23న కిసాన్ దివస్ సందర్భంగా హరియాణాలోని కర్నాల్లోగల జాతీయ జన్యు వనరుల కేంద్రం(యానిమల్ జెనటిక్ రిసోర్స్ సెంటర్)లో ఈ అవార్డును అందించనున్నారు. దీనికి సంబంధించిన సమాచారం రిసోర్స్ సెంటర్ చీఫ్ సైంటిస్ట్ ఏకే మిశ్రా నుంచి ఇప్పటికే అందిందని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ డా.పద్మనాభరెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే అరుదైన రకం పశువులుగా పుంగనూరు పొట్టి పశువులకు పేరుంది. వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో వీటిని మరింత ఉత్పత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్కేవీవై ద్వారా కృషిచేస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ నిధుల ద్వారా పలమనేరు పశు పరిశోధన కేంద్రంలో ఐవీఎఫ్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కృత్రిమ పిండోత్పత్తి ద్వారా పుంగనూరు జాతి పశువులను ఎక్కువగా ఉత్పత్తి చేసే అవకాశం ఏర్పడింది. – పలమనేరు పొట్టి పశువుల పరిశోధన కేంద్రం లక్ష్యం ఇదీ పలమనేరు సమీపంలోని క్యాటిల్ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రంగా ఈ పశు పరిశోధన సంస్థ ప్రారంభమైంది. 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. 20 పొట్టి రకం పశువులతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. 268 పశువులు వరకూ చేరింది. అయితే నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా వీటి సంఖ్యను పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో స్థానిక పరిశోధన కేంద్రంలో ఆర్కేవీవై, ఐకార్ నిధులు రూ.2.85 కోట్లతో పిండమార్పిడి కేంద్రాన్ని(ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ల్యాబ్), ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)ల్యాబ్ను ఏర్పాటు చేశారు. గతంలో పుంగనూరు జాతి ఎద్దు నుంచి సెమన్ను తీసి ఎదకొచ్చిన ఆవుకు ఇచ్చేవారు. దీంతో ఆవుకు ఓ దూడ మాత్రమే పుట్టేది. అయితే ఐవీఎఫ్ ద్వారా ఎద్దు సెమన్ నుంచి ఎక్కువ కణాలను తీసుకుని సరోగసి పద్ధతిలో ఎదకొచ్చిన ఎక్కువ ఆవులకు ఇంప్లాంట్ చేస్తారు. దీంతో ఒకే ఏడాదిలో ఈ జాతి పశువులను ఎక్కువ ఉత్పత్తి చేసేందుకు వీలవుతుంది. ఈ విధానం ద్వారా ఏటా వందల సంఖ్యలో పొట్టి రకం పశువుల ఉత్పత్తి జరగనుంది. వచ్చే ఐదేళ్లలో వీటి సంఖ్యను 500కు పెంచే లక్ష్యంతో పశు పరిశోధన కేంద్రం కృషి చేస్తోంది. అధిక వెన్న, పోషక విలువలు పుంగనూరు ఆవులు మూడడుగుల పొడవు మాత్రమే ఉంటాయి. తోకలు దాదాపుగా నేలను తాకుతుంటాయి. ఇవి సగటున 1 నుంచి 2 లీటర్ల వరకు మాత్రమే పాలిస్తాయి. ఈ పాలలో ఎక్కువ వెన్నతో పాటు.. పోషక విలువులు, రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటాయి. తక్కువ మేతతోనే జీవించగలుగుతాయి. ఇవి మనిషిని అత్యంత ప్రేమగా నమ్మి విశ్వాసంగా ఉంటాయి. తనకు పరిచయం లేని వారిని దరిదాపులకు కూడా రానివ్వవు. ఒక్కో ఆవు ధర రూ.10 లక్షల దాకా ఉంది. -
స్కాట్లాండ్లో పలమనేరు విద్యార్థి మృతి
సాక్షి, చిత్తూరు(పలమనేరు): కీలపట్లకు చెందిన విద్యార్థి స్కాట్లాండ్లో ఈనెల 19న మృతి చెందగా, మృతదేహాన్ని తెప్పించేందుకు బాధిత కుటుంబం అవస్థలు పడుతోంది. గంగవరం మండలం కీలపట్లకు చెందిన గ్రంది సుబ్రమణ్యం బెంగళూరులోని గంగానగర్లో కాపురముంటూ అక్కడే గ్లాస్వర్క్ షాపు నడుపుకుంటున్నాడు. ఇతని కుమారుడు గిరీష్కుమార్ లండన్లోని లీసెస్టర్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతున్నాడు. ఇతనితోపాటు హైదరాబాద్కు చెందిన బాశెట్టి పవన్, చిలకమర్రి సాయివర్మ అక్కడే చదువుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మోడపల్లి సుధాకర్ సైతం లీసెస్టర్లోనే ఉద్యోగం చేస్తున్నాడు. వీరందరూ కలసి పంద్రాగస్టు వేడుకలను లండన్లో చేసుకున్నారు. ఆపై విహారం కోసం ఈనెల 19న స్కాట్లాండ్కు కారులో బయలు దేరారు. వెస్ట్రన్ స్కాట్ల్యాండ్లోని ఏ–8–27 రోడ్డులో వెళుతుండగా వీరి కారు ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో గిరీష్(23) పవన్(22), సుధాకర్(30) మృతిచెందారు. సాయివర్మ అక్కడి గ్లాస్కో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్కాట్ల్యాండ్ పోలీసులు అక్కడి ఇండియన్ డిప్లమాటిక్ ఆఫీసర్కు సమాచారం ఇచ్చారు. ఇక్కడినుంచి భారతవిదేశీ వ్యవహారాల శాఖ స్కాట్ల్యాండ్ అధికారులతో మాట్లాడింది. అయితే మృతదేహాలను ఇండియాకు రప్పించే ప్రయత్నాలు ఆలస్యమవుతున్నట్టు గిరీష్కుమార్ కుటుంబీకులు తెలిపారు. ఇదే విషయమై ఇప్పటికే రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి, బెంగళూరు గంగానగర్ ఎమ్మెల్యే శివకుమార్ భారత విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడినట్టు బాధితులు తెలిపారు. కర్ణాటక మఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మైని సైతం కలిసినట్టు తెలిసింది. మృతుని స్వగ్రామమైన కీలపట్లలో విషాదచాయలు అలుముకున్నాయి. స్వగ్రామంలోని సుబ్రమణ్యం తల్లిదండ్రులు రామచంద్రయ్య, మునెమ్మ మనవడులేదన్న విషయం తెలిసి కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. -
స్మార్ట్ఫోన్తో తెగ ఎంజాయ్ చేస్తున్నారా? అయితే, ఇది మీకోసమే..
8 పలమనేరు పట్టణంలో అద్దెగది తీసుకొని ఇంజనీరింగ్ చదవుతున్న ఓ విద్యార్థిని సెల్ఫోన్ అతిగా వాడొద్దని తల్లిదండ్రులు మందలించారు. దీంతో అప్పటికే సెల్ (smart phone addiction)కు బానిసైన ఆ విద్యార్థి తన గదిలోనే ఆత్మహత్య చేసుకొని ఇటీవలే మృతి చెందాడు. పట్టణంలోని పదోతరగతి చదివే బాలికకు మొబైల్ కొనివ్వలేదని తన చేతిని బ్లేడ్తో కోసుకొని ఆస్పత్రి పాలైంది. ఇలాంటి సంఘటనలు జిల్లాల్లో నిత్యకృత్యంగా మారాయి. ఒకప్పుడు ‘అరచేతిలో ప్రపంచం’ అనే నినాదంతో స్మోర్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు సెల్ చేతిలో జీవితమే బందీగా మారిపోయింది. రోజురోజుకూ పెరుగుతున్న మొబైల్ ఫోన్ల వినియోగం అనర్థాలకు దారితీస్తోంది. ఈ ఫోన్ చిన్న, పెద్ద, ఆడ, మగా తేడా లేకుండా, అందరి జీవితాలను అరచేతిలోకి తీసుకుంది. పదుల సంఖ్యలో కంపెనీలను మార్కెట్ నుంచి తరిమేసింది. మంచి కంటే చెడుకే ఎక్కువగా ఉపయోగపడుతోంది. తక్కువ శాతం మంది మాత్రమే అవసరాలకు వినియోగిస్తున్నారని పలు సర్వేల్లో తేలింది. ఎక్కువ శాతం మంది కాలక్షేపం కోసం ఫోన్ చూస్తుండడం పరిపాటిగా మారింది. అలాంటి వారిని క్రమంగా మొబైల్ బానిసలుగా మార్చేస్తోంది. పలమనేరు (చిత్తూరు): శరీరానికి కాసేపు రక్తం అందకపోయినా, ముక్కుకు శ్వాస ఆడకపోయినా పర్వాలేదుగాని నిమిషం పాటైనా చేతిలో సెల్ లేకుంటే బతకలేమన్నట్టుగా తయారయ్యారు నేటి యువత. డ్రగ్స్కు బానిసైనట్లు స్మార్ట్ఫోన్ బందీఖానాలో జనం బందీలుగా మారారు. ఇప్పుడు పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా స్మార్ట్ఫోన్ల వాడకం ఎక్కువైంది. మొబైల్ లేకుంటే బుర్ర కూడా పనిచేయడం లేదు. మితిమీరిన సెల్ వాడకం మనిషి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నా మార్పు రావడం లేదు. ఇప్పటికే చాలామంది వారికి తెలియకనే మానసిక రోగుల్లా మారారు. ఇంకొందరు అనారోగ్యం పాలవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పదిలక్షల ఫోన్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1990లో కీప్యాడ్ ఫోన్ల వాడకం మొదలైంది. తొలుత తిరుపతి, చిత్తూరు, కుప్పం, మదనపల్లె వంటి పట్టణాల్లో మాత్రమే రిలయన్స్ మొబైల్ టవర్ల ద్వారా నెట్వర్క్ను అందిస్తూ సేవలను మొదలు పెట్టారు. ఆపై పలు సెల్ కంపెనీలు మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 8వేల సెల్ఫోన్ టవర్లున్నాయి. ఉమ్మడి జిల్లా జనాభా 44 లక్షలు కాగా వీరిలో సెల్ఫోన్లు వాడేవారి సంఖ్య ప్రస్తుతం 10 లక్షలకు చేరింది. నాలుగేళ్ల నుంచి సెల్ఫోన్ల వాడకం ఏటా 15 శాతం పెరుగుతున్నట్టు ట్రాయ్ (టెలీఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కలు చెబుతున్నాయి. ఈ ట్రాయ్ గణాంకాలను పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. అన్ని రంగాలపై ప్రభావం విద్యార్థులు సెల్ఫోన్ వాడకంతో విలువైన సమయాన్ని వృథా చేసుకొని చదువుల్లో వెనుకబడడం, ఫెయిల్ కావడం జరుగుతోంది. ఇక ప్రైవేటు సెక్టార్లలో పనిచేసేవారు ఈ మొబైల్ కారణంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేయడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు సెల్తోనే రోజంతా గడిపేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ప్రభుత్వ సేవలు కుంటుపడుతున్నాయి. ముఖ్యంగా ఉత్పాదక రంగంలోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. ప్రధానంగా ఈ మొబైల్ అధికంగా వినియోగించే వారిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్యహెచ్ఓ)తెలిపింది. ఎన్ని రకాల సమస్యలు ఎదురవుతున్నాయో డబ్లు్యహెచ్ఓ సర్వే వివరించింది. రాత్రి పూటే ప్రమాదకరం ప్రధానంగా రాత్రిపూట నిద్రపోకుండా సెల్చూడడం వల్ల కొన్ని రోజుల తర్వాత నిద్రరాని పరిస్థితి ఏర్పడుతుంది. శరీరంలో మెలటోనియన్ నిల్వలు నశించి డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. చీకట్లో సెల్ఫోన్ చూడడంతో దాని నుంచే వచ్చే బ్లూ కిరణాలు రెటీనాను బలహీనం చేసే కార్ట్డాక్ సమస్యలు తప్పవు. రాత్రుల్లో ఫోన్ చూసే పిల్లలకు తలనొప్పి, చూపు మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీంతోపాటు మెడనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సెల్ సమస్యలు: ► నిద్రలేమి, తలనొప్పి ► భుజం, మెడ నొప్పి ► బరువు పెరగడం ► చూపు తగ్గిపోవడం ► జ్ఞాపకశక్తి కోల్పోవడం ► ఏకాగ్రత దెబ్బతినడం ► డిప్రెషన్లోకి వెళ్లడం అనర్థాలపై అవగాహన అవసరం మితిమీరిన సెల్ఫోన్ వాడకంతో కలిగే అనర్థాలపై కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాం. ఈమధ్య కాలంలో యూట్యూబ్లో పలు రకాల చోరీలు, నేరాలను చూసి వాటిని ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. ఇలాంటి వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఏదేనా అవసరం ఉంటే తప్ప ఫోన్ వాడకం తగ్గించాలి. దీంతో ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. – గంగయ్య, డీఎస్పీ, పలమనేరు మానసిక ఇబ్బందులు తప్పవు పాలు తాగే పసిపిల్లల నుంచి సెల్ ఉంటేనే అన్నట్లుగా తయారైంది నేటి సమాజం. పిల్లలు ఏడుస్తుంటే బొమ్మలిచ్చే కాలం పోయింది. చేతికి సెల్ ఇస్తేనే వారు ఏడుపు ఆపుతారు. అధికంగా సెల్ వాడడం వలన మెడనొప్పి, కళ్లు కనిపించకపోవడం, తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. ఇక నిద్రపోకుండా రాత్రుల్లో సెల్ చూసేవారికి పలు రకాల ఆరోగ్య సమస్యలు తప్పవు. మనిషికి కనీసం ఏడు గంటల నిద్ర ఉండాలి. – మమతారాణి, ప్రభుత్వ చిన్నపిల్లల వైద్య నిపుణులు -
పార్లమెంట్ చెంత.. పలమనేరు బొమ్మ!
పలమనేరులో తయారయ్యే మట్టి బొమ్మలు దేశ పార్లమెంట్లో కొలువుదీరనున్నాయి. ఈ మేరకు కేంద్ర హస్తకళాభివృద్ధి సంస్థ నుంచి సమాచారం వచ్చింది. దీంతో పలు డిజైన్లను పరిశీలించి.. వాటిలో 12 డిజైన్లను నూతన పార్లమెంట్ భవనంలో ఉంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఇక్కడి కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పలమనేరు మట్టితో తయారైన వస్తువులు దేశ, విదేశాలకు సైతం చేరుతుండటం విశేషం. – పలమనేరు(చిత్తూరు జిల్లా) అందరూ కళాకారులే.. పలమనేరు పట్టణ సమీపంలోని గంటావూరు టెర్రకోట కాలనీలో వంద కుటుంబాలున్నాయి. వీరందరూ మట్టితో రకరకాల బొమ్మలు, కళా ఖండాలను తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అందువల్లే వీరు తయారు చేస్తున్న బొమ్మలను టెర్రకోట బొమ్మలు అని కూడా అంటారు. 15 ఏళ్ల కిందటి దాకా ఇక్కడ కుండలు మాత్రమే తయారు చేసేవారు. అయితే పెద్దగా వ్యాపారం జరగకపోవడంతో.. కుండల తయారీతో పాటు ఆకర్షణీయమైన బొమ్మలను తయారు చేయడం మొదలెట్టారు. ఈ టెర్రకోట బొమ్మలు ఇప్పుడు ఎంత ప్రసిద్ధి చెందాయంటే.. దేశ విదేశాల్లో వీటికి మంచి గిరాకీ ఉంది. అంతేకాదు పాత పద్ధతులకు స్వస్తిపలికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి యంత్రాల ద్వారా బొమ్మలను తయారుచేస్తున్నారు. మట్టికుండల తయారీకి వినియోగించే కుమ్మరిసారెకు బదులు ఎలక్ట్రికల్ వీల్ మెషీన్ను వాడుతున్నారు. గతంలో బంకమట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేసేవారు.. ఇప్పుడు ప్లగ్మిల్ మిక్చర్ అనే యంత్రం వచ్చి వారి పనిని మరింత సులువుగా మార్చింది. గతంలో మట్టి వస్తువులను బట్టీలో కాల్చేవారు.. ఇప్పుడు కరెంట్తో కాలే కిలన్ వచ్చింది. వీటితో పాటు ప్లగ్ వీల్, బాల్ వీల్, ఫిల్టర్లు, కట్టర్లు ఇలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో బొమ్మల తయారీ సాగుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం టెర్రకోట కళ అంతరించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కళాకారులకు మరింత చేయూతనందించే ఉద్దేశంతో గంటావూరు సమీపంలో రూ.2 కోట్లతో టెర్రకోట హబ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ హబ్లో టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్ సెంటర్ను ఏర్పాటు చేసింది. దీంతో పాటు సీఎఫ్సీ(కామన్ ఫెసిలిటీ సెంటర్) ఉంది. ఏపీఎస్డీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్), టెర్రకోట హస్తకళాకారుల ఎయిడెడ్ సంస్థ, రీచ్ సంస్థల ఆ«ధ్వర్యంలో ఇక్కడ తరచూ శిక్షణ ఇస్తున్నారు. కోల్కతా, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి స్పెషలిస్ట్ ట్రైనర్స్ వచ్చి శిక్షణ ఇస్తుంటారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ఇక్కడే ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే ఇక్కడ తయారవుతున్న డిజైన్లకు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తయారవుతున్న డిజైన్లను జోడించి.. విభిన్న కళాకృతులతో టెర్రకోట కళను అభివృద్ధి చేస్తున్నారు. ఫొటో ఫ్రేమ్లు సైతం మట్టితోనే.. ఇళ్ల ముందు మొక్కలను పెంచే మట్టి కూజాలు, దాబాలపై మొక్కలు పెంచుకునేందుకు వీలుగా వేలాడే మట్టి కూజాల వంటివి తయారు చేస్తున్నారు. ఇక వేసవిలో ఫ్రిజ్లుగా ఉపయోగపడే మట్టి కూజాలకు ట్యాప్లు అమర్చి మరీ రకరకాల పరిమాణాల్లో విభిన్న రూపాల్లో తయారు చేస్తున్నారు. ఏదేని ఫంక్షన్లలో బహుమతులుగా ఇచ్చేందుకు వందలాది మోడళ్లతో పాటు రాజకీయ నాయకుల ముఖ చిత్రాలనూ రూపొందిస్తున్నారు. ఫొటోఫ్రేమ్ల సైతం మట్టితోనే తయారు చేయడం విశేషం. ఆన్లైన్లోనూ అమ్మకాలు వీరు తయారు చేసిన మట్టి బొమ్మలు, వస్తువులు, వివిధ రకాల కళాకృతులతో ఇప్పటికే బెంగళూరుకు చెందిన పలు కంపెనీలు ఆన్లైన్లో వ్యాపారాలు సాగిస్తున్నాయి. ఆన్లైన్లో బుక్ అయిన వెంటనే వాటిని బెంగళూరుకు పంపి అక్కడి నుంచి దేశ విదేశాలకు విక్రయిస్తున్నారు. ఇటీవలే అమెరికాకు చెందిన కొందరు ఇక్కడికి వచ్చి ఇక్కడి వస్తువులను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. పార్లమెంట్ భవనానికి ఆర్డర్ రావడం సంతోషం పలమనేరు మట్టితో తయారైన టెర్రకోట కళాకృతులు భారత పార్లమెంట్లో కొలవుదీరనుండటం మాకెంతో సంతోషంగా ఉంది. పలు డిజైన్లను వారు పరిశీలించి కొన్నింటిని ఎంపిక చేశారు. ప్రస్తుతం వాటిని తయారు చేసే పనుల్లో ఉన్నాం. అమెరికా, ఫ్రాన్స్, చైనాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఆన్లైన్లోనూ కొన్ని ఏజెన్సీల ద్వారా వ్యాపారం చేస్తున్నాం. – రామకృష్ణ, టెర్రకోట హస్తకళాకారుల సంఘ నేత, పలమనేరు టెర్రకోట వస్తువుల తయారీపై శిక్షణ తీసుకున్నా.. మాది గంటావూరు గ్రామం. టెర్రకోట బొమ్మలపై నెల రోజుల శిక్షణ తీసుకున్నా. ట్రైనర్స్ బాగా నేర్పారు. ఇప్పుడు అన్ని బొమ్మల చేయడం నేర్చుకున్నా. ఇంటి వద్దే పీస్ వర్క్ చేసుకుంటున్నా. ఇక్కడ శిక్షణ తీసుకుని ఉపాధి పొందడం చాలా ఆనందంగా ఉంది. ఉన్న చోట ఉపాధి దొరికింది. డీఆర్డీఏ వాళ్లు టెర్రకోట కళకు జీవం పోస్తూ ఎందరికో పని కల్పిస్తున్నారు. – సాకమ్మ, గంటావూరు
Pagination
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
Advertisement