నందిగాం: ఐటీడీఏ ఉద్యోగి ఒకరు ఓ యువతిని మోసం చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకుని మూడు రోజులు కాపురం చేసి పరారయ్యాడు. అంతేకాదు మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధ పడ్డాడు. దీంతో మోసిపోయినట్టు గ్రహించిన యువతి అతగాడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. వివరాల్లోకి వెళితే...నందిగాంలోని ఎస్సీ వీధిలోకి చెందిన మట్ట నాగభూషణం (27) ఐటీడీఏలో టైపిస్టుగా పని చేస్తున్నాడు. మందసలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే సీతంపేట డిప్యుటేషన్పై వెళ్లాడు. అదే వీధిలో నివాసముంటున్న కురమాన కళావతి (25)ని ప్రేమించాడు. ఇద్దరూ ఈ ఏడాది ఫిబ్రవరి 14న విశాఖపట్నంలోని సింహాచలం దేవస్థానంలో పెళ్లి చేసుకున్నారు. తిరిగి శ్రీకాకుళం వచ్చి బలగమెట్టు వద్ద ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు.
ఫిబ్రవరి 17న నందిగాం పోలీసులను ఆశ్రయించి ఇద్దరం మేజర్లం, విశాఖపట్నంలో పెళ్లి చేసుకున్నాం.. పెద్దల నుంచి భయం ఉంది రక్షణ కల్పించాలని కోరారు. అక్కడి నుంచి అదే రోజు శ్రీకాకుళం వెళ్లిపోయారు. మరుసటి రోజు సీతంపేట ఉద్యోగానికి వెళ్లి వస్తానని చెప్పి నాగభూషణం ఇంటి నుంచి బయటకువెళ్లాడు. అప్పటి నుంచి అతగాడు తిరిగి రాలేదు. ఓ రోజు నాగభూషణం ‘మా అమ్మ వల్ల నీ నుంచి విడిపోతున్నాను’ అని కళావతి సెల్ఫోన్కు మెసేజ్ పెట్టాడు. దీంతో కళావతి ఫిబ్రవరి 24న శ్రీకాకుళం మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇంతలో ఈ నెల 27న మరో అమ్మాయితో పెళ్లి చేసుకునేందుకు నాగభూషణం నందిగాం రాగా స్థానికులు పోలీసులు, యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా బాధితురాలు కళావతి శ్రీకాకుళం ఐద్వా సభ్యులను తీసుకుని నాగభూషణం ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను నిలదీసింది.
మహిళా సంఘ సభ్యులు, నాగభూషణం కుటుంబ సభ్యులు గొడవ పడ్డారు. అప్పటికీ ఆ యువకుడి ఆచూకీ చెప్పకపోవడంతో యువతి అతగాడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. ఎస్సై సీహెచ్ ప్రసాద్ వెళ్లి వివాదాన్ని సద్దుమనిగేలా చేశారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నెలరోజులు గడుస్తున్నా పోలీసులు కనీసం స్పందించలేదని, ఒక బాధ్యత గల ఉద్యోగం చేస్తూ ప్రేమ, పెళ్లి పేరిట మోసం చేసిన వాడిని పట్టుకొని కళావతికి న్యాయం చేయలేదని మహిళా సంఘ జిల్లా అధ్యక్షురాలు పి.శ్రీదేవి, కె.నాగమణి, పి.ఉష, గణేష్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లినట్టు చెప్పారు. దీనిపై కేసు నమోదు అయిందని.. విచారణ జరుపుతున్నామని స్థానిక ఎస్సై సీహెచ్ ప్రసాద్ చెప్పారు.
ప్రేమ..పెళ్లి..పరార్..
Published Sun, Mar 29 2015 4:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement