శావల్యాపురం : మండలంలోని రైతులు వరి నారుమళ్లు పోసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న నీటితో సాగర్ జలాశయం కళకళలాడుతోంది. దీంతో రైతులు వరి సాగుపై ఆశలు పెంచుకుంటున్నారు. సాగర్ నుంచి నీటి విడుదల ఖాయమని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నీళ్లు రాగానే నాట్లు వేసేందుకు వీలుగా బోర్లు, బావులు కింద ఉన్న పొలాల్లో నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు.
* శావల్యాపురం, బొందిలిపాలెం, మతుకుమల్లి, గుంటిపాలెం, శానంపూడి, కారుమంచి, చినకంచర్ల, వేల్పూరు, పోట్లూరు గ్రామాల్లో బావుల కింద, చెరువుల కింద ఉన్న పొలాల్లో రైతులు బీపీటీ, ఎన్ఎల్ఆర్ రకాల వరి నారు పోస్తున్నారు.
* జూలై-సెప్టెంబర్ మధ్య ఖరీఫ్ సాగుకు, అక్టోబర్-నవంబర్ మధ్య రబీకి అను కూలంగా ఉంటుంది.
* ఆగస్టు నెల సగం గడిచినా సరైన వర్షాలు లేకపోవడంతో సాగు ఆలస్యమైపోతుం దని రైతులు నారుమళ్లు పోస్తున్నారు.
* మండలంలో మొత్తం ఏడు వేల హెక్టార్ల సాగుభూమి ఉండగా, సుమారు ఐదు వేల హెక్టార్లు మాగాణి పరిధిలో ఉంది. ప్రధానంగా రైతులు మాగాణిపైనే ఆధారపడి సాగు చేస్తుంటారు. ఇప్పటివరకు మండలంలో కేవలం 500 ఎకరాలకు సరిపడ నారు మాత్రమే పోసినట్టు అధికారులు అంచనా వేశారు.
ప్రధానంగా పత్తి సాగు వైపు మొగ్గు ...
* మెట్ట పంటల విషయంలో మండల రైతులు పత్తి, కంది సాగుకు మొగ్గు చూపుతు న్నారు.
* ఎక్కువగా పత్తి సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. నీటి ఎద్దడి తట్టు కోవడం, నీటి అవసరాలు కూడా తక్కువగా ఉండడంతో పత్తి పంటకు ఆదరణ ఉంది.
* ప్రస్తుతం మిర్చికి, కూరగాయల ధరలకు రెక్కలు రావటంతో చిన్న, సన్నకారు రైతులు వంగ, దోస, బెండ సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
* ఇప్పటికే రైతులు సాగు చేసిన మెట్ట పంటలకు ఆదివారం సాయంత్రం కురిసిన వర్షం జీవం పోసింది.
జాగ్రత్తలు పాటించాలి ... నీటి విడుదలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. సాగర్లో నీటిపై ఆశాభావంతో రైతులు నారు పోస్తున్నారు. నీరు అందుబాటులో ఉంటేనే నారుమళ్లు పోయాలి. లేకపోతే ఎండిపోయే ప్రమాదం ఉంది. బీపీటీ వేయాలనుకున్న రైతులు, అగ్గి తెగులు, దోమపోటు దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యం గా బీపీటీ 5204, ఎన్ఎల్ఆర్ 34449, జేజేలు 384 రకాలు మంచి దిగు బడులు ఇస్తాయి.
- హరిప్రసాద్, వ్యవసాయాధికారి
సాగర్పైనే భారం
Published Tue, Aug 19 2014 12:08 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
39 పరుగులకే ఆలౌట్.. టీ20 వరల్డ్కప్లో చెత్త రికార్డు
ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్
తిండి మానేసి ఛాన్సులిమ్మని బతిమాలుకున్నా..: నటుడు
ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేస్తున్న శంకర్...
Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!
ఒకరోజు వర్షాకాలం ఉదయాన్నే.. నదికి వెళ్లిన ముని..
బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
నెహ్రూ తర్వాత మోదీనే అంటూ ఢిల్లీ బయల్దేరిన రజనీకాంత్
‘ఏథర్’లో ఉన్నదంతా అమ్మేసుకున్న సచిన్ బన్సాల్
తప్పక చదవండి
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- 39 పరుగులకే ఆలౌట్.. టీ20 వరల్డ్కప్లో చెత్త రికార్డు
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- తిండి మానేసి ఛాన్సులిమ్మని బతిమాలుకున్నా..: నటుడు
- బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
- ‘ఏథర్’లో ఉన్నదంతా అమ్మేసుకున్న సచిన్ బన్సాల్
- ఘోరం: వివాహిత మిస్సింగ్, మూడురోజల తర్వాత..
- ముగిసిన చేప ప్రసాదం పంపిణీ, మిస్ అయిన వాళ్ల కోసం..
- ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష
Advertisement