► కేంద్ర నిధులతో ఇచ్చిన ఇన్నోవా కార్లపై సీఎం చంద్రబాబు బొమ్మ
► ఆ బొమ్మను తొలగించిన లబ్ధిదారుల నుంచి కార్లు స్వాధీనం
► ఎస్సీ కార్పొరేషన్లో వింతపోకడ
సాక్షి, అమరావతి బ్యూరో: సొమ్మొకరిది, సోకొకరిది అన్న చందంగా టీడీపీ ప్రభుత్వ వ్యవహారం ఉందనే విషయం మరోసారి వెల్లడైంది. దళిత సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో కొన్న వాహనాలపై సీఎం చంద్రబాబు బొమ్మ వేసి పంపిణీ చేస్తున్నారు. దళిత యువకులకు ఉపాధి చూపేందుకు కేంద్ర నిధులతో కార్లు పంపిణీ చేస్తుండగా ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకునేందుకే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంఇచ్చిన నిధులపై వీరి రుబాబు ఏమిటో అర్థం కావడం లేదంటూ పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. చంద్రబాబుపై స్వామి భక్తిని చాటుకునేందుకే జూపూడి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని దళిత యువత మండిపడుతోంది.
వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం ద్వారా ఏటా దళిత సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తుంది. ఆ పథకం ద్వారా గత ఏడాది రూ.120 కోట్లు కేటాయించగా... అందులో కొంత వెచ్చించి రాష్ట్రవ్యాప్తంగా దళిత యువతకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు కార్లను పంపిణీ చేశారు. వాటిపై సీఎం చంద్రబాబు బొమ్మను అంటించడంతో బాడుగకు తీసుకునేందుకు కొందరు ఇష్టపడక లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో వారు సీఎం బొమ్మను తొలగించారు. దీనిని పెద్ద నేరంగా జూపూడి భావిస్తున్నారు. ఇటీవల నెల్లూరులో లబ్ధిదారులతో సమావేశమైన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్రావు ఇన్నోవా కార్లపై ఉన్న చంద్రబాబు ఫొటోను తొలగించిన 8 మంది లబ్ధిదారులపై మండిపడ్డారు. సీఎం చంద్రబాబు బొమ్మ ఉంచుకోవాలని, అది గర్వకారణమని పేర్కొన్నారు. ఆ బొమ్మలేకుండా తిరిగే వాహనాలను స్వాధీనం చేసుకుని వేరొకరికి పంపిణీ చేయాలని నెల్లూరు ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలు వివాదాస్పదంగా మారాయి. స్వామి భక్తిని చాటుకునేందుకు జూపూడి ఇలా వ్యవహరించారని దళిత యువత తప్పుపడుతోంది. కేంద్ర ని«ధులతో పంపిణీ చేసిన వాహనాలపై సీఎం బొమ్మ ఎలా అతికిస్తారని దళితులు ప్రశ్నిస్తున్నారు.
మాజీ ఎంపీ తనయుడికి ఇన్నోవా ..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం తనయుడు రాజేష్కు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా వాహనం పంపిణీ చేశారు. దళితుల్లో పేదలకు కేటాయించాల్సిన వాహనాలను అడ్డదారుల్లో నేతలే దక్కించుకుంటున్నారనేందుకు ఇది నిదర్శనం. పేద దళిత యువకుతకు సవాలక్ష నిబంధనలు వినిపించే అధికారులు మాజీ ఎంపీ తనయుడికి కారు పంపిణీ చేయడం విమర్శలకు తావిస్తోంది. వాహనాలకు ఇచ్చే సబ్సిడీలో కూడా టీడీపీ నేతలు వాటాలు పుచ్చుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
సొమ్మొకరిది.. సోకొకరిది
Published Tue, May 23 2017 11:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement