మూడు రోజులపాటు మేథోమదనం | Sakshi
Sakshi News home page

మూడు రోజులపాటు మేథోమదనం

Published Sat, Jan 31 2015 3:46 PM

Brain storming for three days

విజయవాడ:  మార్చి నెలలో మూడు రోజులపాటు మేథోమదనం చేయాలని ఏపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఆంధ్రరత్న భవన్లో ఈ రోజు ఏపీసీసీ సమావేశం జరిగింది. విభజన చట్టంలో అన్ని అంశాలు అమలు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. సమావేశం అనంతరం ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెడతామని చెప్పారు.

కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉంటే, టీడీపీ చోద్యం చేస్తోందన్నారు. బీజేపీ కుంటిసాకులు చెబుతుంటే, టీడీపీ దానికి వంతపాడుతోందని విమర్శించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement