ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మార్పు

ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మార్పు - Sakshi


హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చింది. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఐదుగంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఇసుక తవ్వకాలు, పింఛన్లు, గనుల లీజు అంశాలపై ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.



కేబినెట్ నిర్ణయాలు

* ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఏర్పాటుకు ఆమోదం

* ఎన్టీఆర్ వైద్య సేవలో వ్యాధుల సంఖ్య 938 నుంచి 1038కు పెంపు

* ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఖర్చు పరిమితి రూ. 2.5 లక్షలకు పెంపు

* గత ప్రభుత్వం జారీ చేసిన జీవోల రద్దు

* మంగంపేటలో 250 హెక్లార్లలో గనుల లీజు రద్దు

* రాజధాని ప్రాంతంలోకి 29 గ్రామాలను తీసుకురావాలని నిర్ణయం

* అనంతపురం జిల్లా సజ్జలదిన్నెలో పవన విద్యుత్ ప్లాంట్ కు 35 ఎకరాల భూమి కేటాయింపు

* వ్యవసాయ రంగానికి ఇక్రిశాట్ ను అనుసంధానం చేయాలని నిర్ణయం

* ప్రతి కళాశాలలోనూ, ప్రతి జిల్లాలో నైపుణ్యాభివృద్ధి యూనిట్ల ఏర్పాటు

* బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్ల చెల్లించాలని నిర్ణయం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top