ఏలూరు, న్యూస్లైన్: జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు రూ.వెయ్యి కోట్ల రుణాలందించాలని లక్ష్యంగా నిర్ణయించామని కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో వివిధ శాఖల పనితీరు, ఎంపీ లాడ్స్ వినియోగంపై అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో వచ్చే మార్చిలోగా రూ.87 కోట్లు, పల్లెల్లో రూ.913 కోట్లు రుణాలను అందించి మహిళల ఆర్థిక పురోభివృద్ధికి బ్యాంకులు దోహదపడాలన్నారు. జిల్లాలో మైనార్టీ కార్పొరేషన్ యూనిట్ల స్థాపనను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన కింద ఇచ్చే లబ్ధిని ఈ నెలాఖరు నాటికి ఇవ్వాలన్నారు. భూగర్భజలశాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు బోర్లు మంజూరు చేయాలని, వ్యవసాయ విద్యుత్ కనె క్షన్లు జారీలో జాప్యం లేకుండా చూడాలని ట్రాన్స్కో ఎస్ఈ సూర్యప్రకాష్ను ఆదేశించారు. ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా, కుటుంబ నియంత్రణ లక్ష్యాలను అధిగమించేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
ఎంపీ లాడ్స్ పనుల్లో జాప్యాన్ని సహించను
పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి నిధులతో చేపట్టే పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం రాత్రి ఎంపీలాడ్స్ పనుల ప్రగతి తీరును ఆయన సమీక్షించారు. అపరిష్కృతంగా ఉన్న పనులను 2014 జనవరి, 31 నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు.
వీఆర్ఏలకు రెండు నెలల అడ్వాన్స్
సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వీఆర్ఏలకు ప్రభుత్వం రెండు నెలలకు రూ.7 వేలు ప్రత్యేక అడ్వాన్స్ ఇవ్వాలని ఆదేశించిందని, తహసిల్దార్లు ఆ మొత్తాలను వారికందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
భవన నిర్మాణ కార్మికులకు కొత్త బీమా పథకం
ఏలూరు (ఫైర్స్టేషన్ సెంటర్ ) : భవన నిర్మాణ కార్మికులుగా నమోదైన వారికి ప్రస్తుతం అమలవుతున్న ఆమ్ ఆద్మీ బీమా యోజన, జనశ్రీ బీమా యోజనతో పాటు మరోక సంక్షేమ పథకం కూడా ప్రభుత్వం అమలు చేస్తుందని కలెక్టర్ సిద్ధార్థజైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పనిచేసే ప్రదేశంలో కాని ఇతర ప్రదేశాలలో గాని, నిర్మాణ సమయంలో గాయపడి ఆ గాయాలతో మరణించిన కార్మికుని కుటుంబానికి రూ.2 లక్షలు ఆర్థిక సహాయం అందుతుందన్నారు. శాశ్వత వికలాంగత్వానికి గురైన కార్మికునికి కూడా రూ. 2 లక్షల వరకు సహాయం అందుతుందని తెలిపారు.
120 గ్రామాల్లో 12 వేల మరుగుదొడ్లు
ఏలూరు : జిల్లాలో పల్లెనిద్ర-ప్రగతిబాట పేరిట 120 గ్రామాల్లో 12 వేల వ్యక్తిగత మరుగుదొడ్లను 2014 సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ లక్ష్యంగా నిర్ణయించారని డ్వామా పీడీ ఎన్. రామచంద్రారెడ్డి తెలిపారు. వీటి నిర్మాణానికి అధికారులు కృషి చేయాలని కోరారన్నారు.
స్వయం సహాయక సంఘాలకు రూ. వెయ్యి కోట్లు
Published Sat, Dec 14 2013 4:56 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
39 పరుగులకే ఆలౌట్.. టీ20 వరల్డ్కప్లో చెత్త రికార్డు
ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్
తిండి మానేసి ఛాన్సులిమ్మని బతిమాలుకున్నా..: నటుడు
ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేస్తున్న శంకర్...
Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!
ఒకరోజు వర్షాకాలం ఉదయాన్నే.. నదికి వెళ్లిన ముని..
బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
నెహ్రూ తర్వాత మోదీనే అంటూ ఢిల్లీ బయల్దేరిన రజనీకాంత్
‘ఏథర్’లో ఉన్నదంతా అమ్మేసుకున్న సచిన్ బన్సాల్
తప్పక చదవండి
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- 39 పరుగులకే ఆలౌట్.. టీ20 వరల్డ్కప్లో చెత్త రికార్డు
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- తిండి మానేసి ఛాన్సులిమ్మని బతిమాలుకున్నా..: నటుడు
- బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
- ‘ఏథర్’లో ఉన్నదంతా అమ్మేసుకున్న సచిన్ బన్సాల్
- ఘోరం: వివాహిత మిస్సింగ్, మూడురోజల తర్వాత..
- ముగిసిన చేప ప్రసాదం పంపిణీ, మిస్ అయిన వాళ్ల కోసం..
- ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష
Advertisement