అడవి నుంచి ఇసుక తరలింపు | Sakshi
Sakshi News home page

అడవి నుంచి ఇసుక తరలింపు

Published Wed, Apr 17 2024 8:15 AM

ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్‌ చేసిన 
ఫారెస్టు అధికారులు    - Sakshi

ధారూరు: అడవిలోంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఫారెస్ట్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఈ ఘటన ధారూరు ఫారెస్ట్‌ రేంజ్‌ రాస్నం సెక్షన్‌ పరిధిలోని సంగాయిపల్లి తండా సమీప అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ మొయినుద్దీన్‌ తెలిపిన ప్రకారం.. ఇసుక తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బీట్‌ ఆఫీసర్‌ ఆనంద్‌, ఫారెస్ట్‌ బేస్‌ క్యాంపు సిబ్బంది పెంటయ్య, ఎల్లప్ప బృందంతో సంగాయపల్లి తండాకు చేరుకున్నామన్నారు. తండాకు చెందిన మిట్టునాయక్‌ ఇసుక తరలిస్తుండగా అదుపులోకి తీసుకుని ధారూరు ఠాణాకు తరలించామన్నారు. తరచూ ఇసుక అక్రమంగా తరలిస్తున్న మిట్టునాయక్‌పై 2019లో అటవీ జంతుల వేటలో, ఈ ఏడాది చెట్లను అక్రమంగా నరికిన కేసులో ప్రధాన నిందితుడని ఇప్పటి వరకు చలాన్లు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఎఫ్‌ఎస్‌ఓ చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది.

ట్రాక్టర్‌ను సీజ్‌ చేసిన ఫారెస్ట్‌ అధికారులు

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement