ఢిల్లీ జ‌ట్టులోకి సౌతాఫ్రికా విధ్వంస‌క‌ర ఆట‌గాడు..ఎవరంటే? | Sakshi
Sakshi News home page

IPL 2024: ఢిల్లీ జ‌ట్టులోకి సౌతాఫ్రికా విధ్వంస‌క‌ర ఆట‌గాడు..ఎవరంటే?

Published Tue, Apr 23 2024 6:11 PM

Rassie van der Dussen Likely Replace Mitchell Marsh in DC squad for IPL 2024 - Sakshi

ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు మిచిల్ మార్ష్ రూపంలో భారీ ఎదురుదెబ్బ త‌గిలిన సంగ‌తి తెలిసిందే. తొడ‌కండరాల గాయం కార‌ణంగా మార్ష్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. ఈ విష‌యాన్ని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ సైతం ధ్రువీక‌రించాడు. ఈ క్ర‌మంలో మార్ష్ స్ధానాన్ని భర్తీ చేసే ప‌నిలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ మెనెజ్‌మెంట్ ప‌డింది.

మార్ష్ ప్లేస్‌లో ద‌క్షిణాఫ్రికా మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ ర‌స్సీ వాండ‌ర్ డ‌స్సెన్ పేరును ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా ఐపీఎల్‌-2024 మినీ ఆక్షన్‌లో రూ.2 కోట్ల కనీస ధరతో వేలంకు వచ్చిన వాండ‌ర్ డ‌స్సెన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ సీజ‌న్ ప్రారంభానికి ముందు జ‌రిగిన  పాకిస్తాన్‌ సూపర్ లీగ్‌లో ఈ ప్రోటీస్‌ స్టార్ ద‌మ్ములేపాడు.

 ఈ లీగ్‌లో కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన డస్సెన్‌.. 364 పరుగులతో సెకెండ్‌ లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా టీ20లో కూడా డస్సెన్‌ అదరగొట్టాడు. ఈ క్రమంలోనే డస్సెన్‌ను ఢిల్లీ సొంతం చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు  పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. వాన్ డెర్ డస్సెన్‌ గతంలో ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement