మదినిండా రామనామం | Sakshi
Sakshi News home page

మదినిండా రామనామం

Published Thu, Apr 18 2024 9:40 AM

కల్యాణతంతు జరిపిస్తున్న అర్చకులు  - Sakshi

బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో సీతారామస్వామి కల్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సీతారామస్వామికి ఉదయం 6 గంటలకు సుప్రభాతసేవ, అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం ఉదయం 10గంటలకు వేదమంత్రాల నడుమ సీతారాములకు కనులపండువగా కల్యాణాన్ని జరిపారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు ఉదయాన్నే బీచుపల్లికి చేరుకొని భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణంలో పాల్గొని తిలకించారు. కల్యాణానికి హాజరైన భక్తుల కోసం రంగాపురానికి చెందిన ఆవుల చిన్నకృష్ణ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ మేనేజర్‌ సురేందర్‌రాజు పేర్కొన్నారు. అదేవిధంగా బీచుపల్లి అభయాంజనేయస్వామి ఆలయంతో పాటుగా మండలంలోని వివిధ గ్రామాల్లో సీతారాముల కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement