Sakshi News home page

తిరుమలలో తెరుచుకున్న శ్రీవారి ఆలయం తలుపులు

Published Sun, Oct 29 2023 8:20 AM

Tirumala Temple Doors Opened - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయం తెరుచుకుంది. గ్రహణం కారణంగా నిన్న రాత్రి ఆలయ ద్వారాలను మూసివేశారు. గ్రహణ కాలంలో కిరణాలు సోకడం కారణంగా చెడు ఫలితాలు ఉంటాయని ఆలయాలు మూసివేస్తారు. ఉదయం 3:15 నిముషాలకు ఆలయ ద్వారాలు తెరిచి పుణ్యాహవచనం చేసి, ఆలయ శుద్ధి నిర్వహించారు. అనంతరం సుప్రభాతం, అర్చన, తోమాల సేవలను నిర్వహించారు.

ఉదయం 5 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం 15 కంపార్టుమెంట్లో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. నిన్న 47 వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకొని, హుండీ ద్వారా 3.03 కోట్లు ఆదాయం వచ్చింది.

Advertisement

What’s your opinion

Advertisement