-
నా అభిమాన తార సమంత.. ఎందుకంటే..
‘కీచక’ సినిమాతో వెండితెరకు పరిచయమైన యామిని భాస్కర్ పదహారణాల తెలుగు అమ్మాయి. ‘నర్తనశాల’ సినిమాలో సత్యభామగా ఆకట్టుకుంది. ‘‘నా తెలుగు మూలాలే నా బలం’’ అంటున్న యామిని తన గురించి తాను చెప్పుకున్న విషయాలు.... నేను లోకల్ .. విజయవాడలో పుట్టిపెరిగాను. సినిమా ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు. కాలేజీకి బంక్ కొట్టి సినిమాకు వెళ్లిన సందర్భాలు ఎప్పుడూ లేవు. సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు మాత్రం సినిమాలంటే ప్యాషనేట్గా ఉన్నాను. దేవదాస్ కనకాలగారి దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకున్నాను. ఎంత ఇష్టమంటే... కథానాయికలలో నా అభిమాన తార సమంత. క్యూట్ అండ్ గ్రేట్ పర్ఫార్మెన్స్. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన కామెడీ డైలాగులు బాగా ఎంజాయ్ చేస్తాను. నవ్వించడమైనా, ఏడ్పించడమైనా, డ్యాన్స్ అయినా ఎంత బాగా చేస్తారో! ఆయన్ని ఆరాధించేంత అభిమానం. నా డ్రీమ్రోల్.. నా డ్రీమ్రోల్స్ చాలా ఉన్నాయి. ‘నరసింహ’ సినిమాలో రమ్యకృష్ణ చేసిన ‘నీలాంబరి’లాంటి బలమైన పాత్ర చేయాలని ఉంది. మరి అలాంటి సినిమా వస్తుందో లేదో తెలియదుగాని చేయాలని మాత్రం ఉంది. ఎప్పుడు ఎలాంటి పాత్ర వస్తుందో తెలియదు. అలాని ‘డెస్టినీ’ గురించి పెద్దగా ఆలోచించను. ‘జస్ట్ హ్యాపన్’ అనే అనుకుంటాను. వరం.. ప్రేమ అన్నిసార్లూ దొరకదు. అది దొరికితే జీవితాంతం ఉంటుంది. అది పేరెంట్స్ నుంచి దొరకవచ్చు, ఫ్రెండ్స్ నుంచి దొరకవచ్చు. దేవుడు ప్రత్యక్షమై ‘వరం కోరుకో’ అని అడిగితే...‘‘ఈ సమాజంలో ఎన్నో అంతరాలు ఉన్నాయి. అలాంటివి లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా అందరూ సుఖశాంతులతో ఉండే సమాజం కావాలి’’ అని అడుగుతాను. చిన్నప్పుడు .. చిన్నప్పుడు మా ఇంట్లో అద్దం మీద మహేష్బాబు ఫొటో ఉండేది. పన్నెండేళ్ల వయసులోనే కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్నాను. నన్ను నటిగా చూడాలనేది మా నాన్న కల. నా ఇష్టమైన వంటకం...అన్నం, పప్పు, ఆవకాయ. ఇష్టమైన ప్రదేశం... స్విట్జర్లాండ్. -
హద్దు దాటలేదు
‘‘నటనలో శిక్షణ తీసుకోలేదు. కానీ సినిమాల పట్ల ఆసక్తితోనే హీరోగా చేశా. రియలిస్టిక్ సినిమాలంటే ఇష్టపడతా’’ అని ప్రియాంత్ అన్నారు. రమణ మొగిలి దర్శకత్వంలో ప్రియాంత్, యామినీ భాస్కర్ జంటగా తెరకెక్కిన ‘కొత్తగా మా ప్రయాణం’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియాంత్ మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు డాక్టర్. నేను సీఎస్ (కంపెనీ సెక్రటరీ) చేశాను. ప్రస్తుతం బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నా. ఇప్పటి సాఫ్ట్వేర్ కల్చర్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. ఉద్యోగరీత్యా సొంత కుటుంబాలకు దూరంగా జీవిస్తున్న నేటి యువత ప్రవర్తన ఎలా ఉంది? అన్నదే కథాంశం. సినిమాలో అనవసరమైన రొమాన్స్ సీన్స్ను పెట్టలేదు. ఎక్కడా హద్దు దాటలేదు. మా సినిమాతో పాటు ‘మిస్టర్. మజ్ను, మణికర్ణిక: ఝాన్సీ రాణి ’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక ఆడియన్గా నేనూ పెద్ద సినిమాలే చూడాలని కోరుకుంటాను. కానీ మా సినిమాలోని డిఫరెంట్ పాయింట్ ప్రేక్షకులకు చేరువయ్యేలా చేస్తుంది. హైదరాబాద్ లైఫ్స్టైల్ ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్తో ప్రసాద్ అనే కొత్త దర్శకుడితో నా నెక్ట్స్ సినిమా ఉంటుంది’’ అన్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రేమకథ
‘ఈ వర్షం సాక్షిగా’ ఫేం రమణ దర్శకత్వం వహించిన చిత్రం ‘కొత్తగా మా ప్రయాణం’. ఈ సినిమాతో ప్రియాంత్ హీరోగా పరిచయం అవుతున్నారు. యామినీ భాస్కర్ కథానాయిక. నిశ్చయ్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ని చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. రమణ మాట్లాడుతూ– ‘‘నెలకు 2లక్షల జీతం తీసుకుంటూ పదిమందికీ సాయపడుతూ ఓపెన్ మైండెడ్గా ఉండే ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రేమకథ ఇది. అందరికీ సాయపడే తత్వం ఉన్నా ప్రేమ, పెళ్లి, కుటుంబం వంటి విలువలపై అతనికి అంతగా నమ్మకం ఉండదు. అలాంటివాడు మన సంప్రదాయం గొప్పతనం తెలుసుకున్న తర్వాత ఎలా మారాడు? అన్నది ఈ చిత్రంలో చూపించాం. ప్రియాంత్కి తొలి సినిమానే అయినా చక్కగా నటించాడు. త్వరలో ఆడియో రిలీజ్ చేయనున్నాం. నిర్మాణానంతర పనులు పూర్తవుతున్నాయి. ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, సాయి కార్తీక్, కెమెరా: అరుణ్ కుమార్. -
సాఫ్ట్వేర్ కుర్రాడి ప్రేమకథ
నెలకు రెండు లక్షల రూపాయలు జీతంగా తీసుకునే ఓ సాఫ్ట్వేర్ కుర్రాడికి ప్రేమ, పెళ్లిపై నమ్మకం ఉండదు. అలాంటివాడు పెళ్లికి ఎలా అంగీకరించాడు? అతనిలో మార్పుకు కారణం ఎవరు? అనే ఆసక్తికర అంశాల ఆధారంగా రూపొందిన చిత్రం ‘కొత్తగా మా ప్రయాణం’. ప్రయాంత్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో యామినీ భాస్కర్ కథానాయికగా నటించారు. నిశ్చయ్ ప్రొడక్షన్స్ పతాకంపై రమణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ను చిత్రబృందం విడుదల చేసింది. ‘‘నలుగురికీ సాయపడుతూ ఓపెన్ మైండెడ్గా ఉండే ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రేమకథ ఇది. తొలి సినిమానే అయినప్పటికీ ప్రయాంత్ బాగా నటించాడు. యామినీ భాస్కర్ అందచందాలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. యూత్ ఆడియన్స్ను టార్గెట్ చేసిన ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు రమణ. భాను, గిరి, సాయి, జీవా, కారుణ్య తదితరులు నటించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. -
సినిమా తీయడం ఈజీ..రిలీజ్ కష్టం
‘‘మా బ్యానర్లో విడుదల చేసిన ‘భలేమంచి చౌకబేరమ్’ చిన్న సినిమా అయినా ప్రేక్షకాదరణ బాగుంది. కథ బాగుండటం వల్లే సినిమాను బాగా ఆదరిస్తున్నారు. రోజు రోజుకూ కలెక్షన్లు పెరుగుతున్నాయి. వసూళ్లు ఇంకా పెరిగి, మా సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నా’’ అని చిత్ర సమర్పకులు కె.కె. రాధామోహన్ అన్నారు. నవీద్, నూకరాజు, యామినీ భాస్కర్ కీలక పాత్రల్లో మురళీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలేమంచి చౌకబేరమ్’. ఆరోళ్ల సతీష్ నిర్మించిన ఈ సినిమా సక్సెస్మీట్ హైదరాబాద్లో నిర్వహించారు. ఈ చిత్రానికి కాన్సెప్ట్ అందించిన డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా తీయడం తేలిక.. కానీ, విడుదల కష్టం. మౌత్ టాక్తో రీచ్ అయ్యేలా చేయడం చాలా కష్టం. శనివారం సాయంత్రానికి మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మా టార్గెట్ని రీచ్ అయ్యాం’’ అన్నారు. ‘‘చిన్న సినిమా పెద్ద విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు మురళీకృష్ణ. ‘‘టిక్కెట్టుకి 100 రూపాయలు పెడితే 1000 రూపాయల వినోదం ఇచ్చే చిత్రం ‘భలేమంచి చౌకబేరమ్’’ అన్నారు నవీద్. ‘‘సినిమా విడుదల రోజు(శుక్రవారం) ఉదయం ఆటకు మా సినిమా ఓపెనింగ్స్ చూసి నిరుత్సాహపడ్డాం. అదేరోజు సాయంత్రానికి థియేటర్లు ఫుల్ అయ్యాయి’’ అన్నారు నూకరాజు. ‘‘టఫ్ సిచ్యువేషన్లో కాన్ఫిడెన్స్తో మా సినిమా విడుదల చేశాం. టాక్ బావుంది’’ అన్నారు సతీష్. యామినీ భాస్కర్, నటులు రాజా రవీంద్ర, ముస్తఫా, ఉద్ధవ్, పూర్ణాచారి పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement