-
ముంబై బీచ్లో చెత్త ఏరిన రాజదంపతులు
ముంబై : స్వీడన్ రాజదంపతులు కింగ్ కార్ల్-16 గుస్టాఫ్, క్వీన్ సిల్వియా ఐదు రోజుల భారత పర్యటనలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. భారత పర్యటనలో రాజదంపతులు ప్రదర్శిస్తున్న నిరాడంబరత పలువురుని ఆకట్టుకుంటుంది. తాజాగా బుధవారం రాజదంపతులు ముంబై వెర్సోవా బీచ్లోని చెత్తను ఏరారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంలో అక్కడి వాలంటీర్లకు సహాయం అందించారు. పర్యావరణ ఉద్యమకారుడు ఆఫ్రోజ్ షాతో కలిసి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, వెర్సోవా బీచ్లోని వ్యర్థాలను తొలగించడానికి ఆఫ్రోజ్ రెండేళ్ల క్రితం ఒంటరిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం ఆయన వెంట 12,000 మది వాలంటీర్లు ఉన్నారు. ఆఫ్రోజ్ కృషికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందనలు తెలిపారు. బీచ్లో చెత్త ఏరుతున్న సమయంలో రాజదంపతులు అక్కడి వాలంటీర్లతో ముచ్చటించారు. అలాగే బుధవారం సాయంత్రం వారు మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీతో సమావేశం కానున్నారు. అనంతరం డెహ్రాడూన్ బయలుదేరి వెళ్తారు. ఉత్తరఖాండ్లోని రామ్ జూలాను సందర్శిస్తారు. అలాగే గురువారం హరిద్వార్లో మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్ను స్వీడన్ రాజదంపతులు ప్రారంభించనున్నారు. -
బాయ్ ఫ్రెండ్ కారణమంటూ మోడల్ ఆత్మహత్య
ముంబై: ఫ్యాషన్ రంగంలో రాణిస్తున్న ముంబై కి చెందిన మోడల్ అర్చనా పాండే అనుమానస్పదకరమైన రీతిలో మరణించారు. ముంబైలోని వెర్సోవాలో అద్దెకు ఉంటున్న ఫ్లాట్ లో ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. అర్చనా ఉంటున్న ఫ్లాట్ నుంచి వాసన వస్తోందంటూ అపార్ట్ మెంట్ లోని ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. అర్పనా పాండే మత దేహం వద్ద సూసైట్ నోట్ పోలీసులకు దొరికింది. తన బాయ్ ఫ్రెండ్ ఓమర్ పఠాన్ తన ఆత్మహత్యకు కారణం సూసైడ్ నోట్ లో అర్చన పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. పఠాన్ పై పోలీసులు కేసు నమోదు చేసి.. అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కొత్తమార్గాల అన్వేషణలో బెస్ట్
సాక్షి, ముంబై: వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మార్గంలో మెట్రో రైల్వేస్టేషన్లను కలుపుతూ సాగే కొత్తమార్గాల కోసం బెస్ట్ అన్వేషణ ప్రారంభించింది. ఇటీవలే ప్రారంభమైన వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మెట్రో సేవలు ప్రారంభం కావడంతో బెస్టుకు చెందిన బస్సులలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఘాట్కోపర్-అంధేరీల మధ్య నడిచే బెస్టు బస్సు సర్వీసులను సగానికి సగం తగ్గించింది. మెట్రో సేవల ప్రారంభానికి ముందు 340 నంబరు బెస్టు బస్సులు 292 ట్రిప్పులు తిరిగేవి. మెట్రో రైల్వే సేవలు ప్రారంభంతో ఈ ట్రిప్పుల సంఖ్యను 150కి తగ్గించారు. ఇలా మెట్రో సేవలు అందుబాటులో ఉన్న మార్గాల్లో బెస్ట్ ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో కొత్తమార్గాలపై కన్నేసిన బెస్ట్ మెట్రో స్టేషన్లను కలుపుకొని వెళ్లే కొత్త మార్గాల్లో బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. తక్కువ దూరమైనప్పటికీ ప్రయాణికుల సంఖ్య ఆశించినస్థాయిలోనే ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మెట్రో స్టేషన్ల నుంచి పారిశ్రామిక ప్రాంతాలకు, కార్యాలయాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు బెస్ట్ బస్సులను నడిపితే ప్రయోజనకరంగా ఉంటుందని నిర్ణయించిన అధికారులు సర్వే పనులు ప్రారంభించారు. సర్వేలకు సంబంధించిన నివేదికలు రాగానే సర్వీసులను ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కలిసొచ్చే అంశమే... మెట్రో చార్జీలు ఎక్కువగా ఉండడం బెస్ట్ సంస్థకు కలిసొచ్చే విషయంగా ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఘాట్కోపర్ నుంచి అంధేరీకి మెట్రో రైలు చార్జీ సుమారు రూ. 30 ఉంటుందని అంచనా. అయితే బెస్టు బస్సు చార్జీ మాత్రం ఘాట్కోపర్ నుంచి అంధేరి వరకు కేవలం రూ. 15 ఉండనుంది. దీంతో రానుపోను చార్జీలు కలిపితే మెట్రో ఒక చార్జీతో సమానం అవుతుండడంతో ప్రయాణికులు బెస్ట్ బస్సులనే ఆశ్రయిస్తారని, ఫలితంగా ప్రయాణికుల సంఖ్య మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. పెరుగుతున్న నష్టం.. మెట్రోసేవలు అందుబాటులోకి రావడంతో బెస్ట్ సంస్థలో ప్రస్తుతానికి ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. ప్రస్తుతం మెట్రో చార్జీలు తక్కువగా ఉండడం, సేవలు కొత్త కూడా కావడంతో ప్రయాణికులంతా మెట్రోల్లోనే ప్రయాణిస్తున్నారు. దీంతో బెస్ట్కు ఇప్పటిదాకా రూ. 18 కోట్లమేర నష్టం వచ్చిందని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. నెలరోజులపాటు మెట్రో చార్జీలు ఇంతే ఉండే అవకాశం ఉండడంతో తమ నష్టాలు మరింతగా పెరిగే అవకాశముందంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement