-
నిద్ర కరువైంది.. మళ్లీ నటిస్తానని అనుకోలేదు: యంగ్ హీరోయిన్
గ్లామరస్ పాత్రలకు యాషికా ఆనంద్ పెట్టింది పేరు. కవలై వేండామ్ చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు, దృవంగళ్ 16, నోటా, జాంబీ తదితర సినిమాల్లో నటించింది. బిగ్బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొని, తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే కొన్నాళ్ల ముందు ఫ్రెండ్స్ తో కలిసి కారులో వెళ్తుండగా యాషికా ఆనంద్ భయంకరమైన కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో తీవ్రగాయాల పాలై ప్రాణాలతో పోరాడింది. మూడు నెలల తర్వాత తిరిగి మామూలు మనిషైంది. ఆ తరువాత మళ్లీ నటించడానికి సిద్ధమైంది. ఇటీవల 'సిల నేరంగళిల్' సినిమాలో నటించిన ఈ భామ ప్రస్తుతం ఇవన్ దాన్ ఉత్తమన్, రాజభీమ, పాంబాట్టం తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. (ఇదీ చదవండి: రూ.50 లక్షలు నష్టపోయా.. ఆస్తులమ్మేశా: బుల్లితెర నటి) కాగా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాషికా ఆనంద్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తాను 17 ఏళ్ల వయసులోనే ఓ తమిళ సినిమా చేసినట్లు చెప్పింది. అలాంటి గ్లామర్ పాత్రల్లో నటిస్తే, నిజ జీవితంలోనూ అలానే ఉంటారని కొందరు అనుకుంటారని, చాలా అవమానకరమెన కామెంట్స్ చేస్తుంటారని చెప్పింది. చాలా నెగిటివ్గానూ మాట్లాడుతుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటివి తనకు బాధ కలిగించినా తనని అసహించుకునే వాళ్లని దూరంగా ఉండి, తనను చూసి ఎంజాయ్ చేయమనే చెబుతానని యాషికా చెప్పుకొచ్చింది. నిజం చెప్పాలంటే కారు ప్రమాదం తరువాత తన జీవితమే మారిపోయింది తెలిపింది. ఆ సమయంలో కంటికి నిద్రే కరువైందని, కన్ను మూస్తే ప్రమాద సంఘటనే గుర్తొచ్చేదని అప్పటిరోజుల్ని జ్ఞాపకం తెచ్చుకుంది. అలాంటి పరిస్థితి నుంచి మళ్లీ నటిస్తానని అనుకోలేదని పేర్కొంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?) -
ఇంకెన్నాళ్లు ఈ దారుణాలు.. ఇంకెంతకాలం భరించాలి: నటి ఆవేదన
నటి సోనా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈమె బహు భాషా నటి. అంతకు మించి ఏదో ఒక ఘటనతో వార్తలో తరచుగా కనిపించే నటి. శృంగార తారగానూ ముద్ర వేసుకున్న సోనాలో నిర్మాత, దర్శకురాలు కూడా ఉన్నారు. తాజాగా తన బయోపిక్ను స్మోక్ అనే పేరుతో స్వీయ దర్శకత్వంలో వెబ్ సిరీస్గా రూపొందిస్తున్నారు. కాగా ఇటీవల పాండిచ్చేరిలో జరిగిన బాలిక అత్యాచారం, హత్యా ఘటనపై స్పందించింది. ఈ రోజు మనం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని.. కానీ ఇటీవల పాండిచ్చేరిలో చిన్నారికి జరిగిన దారుణ ఘటన తీవ్ర వేదనకు గురి చేసిందన్నారు. దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒక అమ్మాయిగా ఎలా ఉండాలో అనేది కూడా తెలియని ఆ బాలికను చిత్ర వధ చేసి ప్రాణాలు తీయడం తీవ్రంగా పరిగణించాలన్నారు. ఇలాంచి క్రూరమైన ఘటనతో మనం మానవ సమాజంలోనే బతుకుతున్నామా? లేక మృగాల మధ్య జీవిస్తున్నామా? అని తెలియడం లేదన్నారు. ఒక నటిగా తానూ ఇలాంటి సంఘటనలను ఎదుర్కొని బయట పడ్డానని చెప్పారు. మృగాల్లాంటి మగాళ్ల మధ్య జీవించడానికి.. రక్షించుకోవడానికి అనునిత్యం పరుగులు తీస్తూనే ఉన్నామన్నారు. ఈ దుస్థితి ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించారు. అభివృద్ధి చెందుతున్న ఈ నాగరిక ప్రపంచంలో మహిళలను అణచివేయడం.. కించపరచడం, తప్పుగా చిత్రీకరించడడం కొనసాగుతూనే ఉందన్నారు. ఇలాంటి పరిస్థితిని ఇంకా ఎంతకాలం మౌనంగా భరించాలి.. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడేవారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని నటి సోనా పేర్కొన్నారు. -
తన పేరుతో మోసం.. బండారం బయటపెట్టిన సీరియల్ నటి
జనాల్ని మోసం చేయడంలో దొంగలు సరికొత్తగా ఆలోచిస్తున్నారు. అయితే మిగతా విషయాలేమో గానీ సెలబ్రిటీలు పేరు చెప్పి డబ్బులు కాజేసే పనులు చేస్తుంటారు. అలా తాజాగా ఓ సీరియల్ నటి పేరు చెప్పి లక్షలు వెనకేసుకునే పనిలో పడ్డారు. కానీ సదరు నటి స్పందించడంతో బండారం అంతా బయటపడింది. (ఇదీ చదవండి: అందుకే ఇంత లావయ్యాను.. చిన్నప్పుడు ఆ భయం ఉండేది: వైవా హర్ష) ఏం జరిగింది? తమిళంలో పలు సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న అల్య మానస.. సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదింంచింది. కొన్నిరోజుల క్రితం 'వణక్కం తమిళగం' అనే షోలో పాల్గొంది. ఆ షోలో ఈమె.. మార్కెటింగ్ స్కీమ్ గురించి చెప్పినట్లు.. దీని ద్వారా లెక్కలేనంతగా డబ్బు సంపాదిస్తున్నానని ఈమె చెప్పినట్లు ఓ వీడియో వైరల్ అయిపోయింది. పలు పత్రికల్లోనూ ఇదే విషయం పబ్లిష్ కాగా.. ఈ విషయం అల్య మానస దృష్టికి వెళ్లింది. 'అల్య మానస బాగా డబ్బు సంపాదిస్తోంది. ఈమెలానే మీరు కూడా కోటీశ్వరులు కావాలనుకుంటే.. దిగువన లింక్ క్లిక్ చేయండి' అని తన పేరు చెప్పి జరుగుత్ను మోసంపై అల్య మానస ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మార్కెటింగ్ స్కీమ్ గురించి షోలో తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని, కారు-ఇల్లు కొన్న విషయం నిజమే కానీ వాటిని ఈఎంఐ పద్ధతి తీసుకున్నానని చెప్పింది. అన్నింటికీ మించి అడ్డదారిలో కోటీశ్వరురాలిని కావాలనే ఆలోచన తనకు లేదని క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: మెగా హీరో మూవీకి చిక్కులు.. షూటింగ్కి ముందే నోటీసులు) -
నటి జీవితం విషాదాంతం: మమకారం మరిచిన కన్న కొడుకే!
అమ్మను మించిన దైవం లేదని అందరమూ నమ్ముతాం. కానీ మద్యం, డబ్బు వ్యామోహం మనిషిని ఎంతకైనా దిగజార్చుతుంది. దీనికి ఉదారహణే తమిళ నటి హత్య. దిగ్భ్రాంతికరమైన ఈ సంఘటన వివరాలను పరిశిలిస్తే.. పోలీసులు అందించిన వివరాల ప్రకారం ‘కడైసి వివాసాయి’ సినిమాతో పాపులర్ తమిళ నటి కాసమ్మాళ్ హత్యకు గురైంది. అదీ కని పెంచిన సొంత కొడుకు నామకోడి ఆమెను కొట్టి దారుణంగా హత్య చేశాడు. నామకోడి 15 ఏళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ, తల్లి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ విబేధాలు, వాగ్వాదం జరుగుతుండేవి. గత ఆదివారం (ఫిబ్రవరి 4) రోజు కూడా మద్యం కోసం డబ్బులివ్వమని తల్లిని డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది అంతే విచణక్ష మరిచిన అతగాడు చెక్కతో తల్లిపై దాడిచేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడులోని మధురైకి సమీపంలోని అనయ్యూర్లోని కాసమ్మాళ్ స్వగృహంలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీనిపై ప్రాథమిక విచారణ తరువాత,కేసు నమోదు చేసిన పోలీసులు నామకోడిని అరెస్ట్ చేశారు. కాసమ్మాళ్, ఆమె భర్త దివంగత బాలసామి దంపతుల నలుగురు పిల్లలలో నామకోడి ఒకరు. కాగా కాసమ్మాళ్ 2022లో విడుదలైన 'కడైసి వివాసాయి' చిత్రంలో విజయ్ సేతుపతి తల్లిగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఎం మణికండాని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నల్లంది, యోగి బాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. -
కమెడియన్ కూతురి నిశ్చితార్థం.. నెల రోజుల్లో పెళ్లి!
తమిళ కమెడియన్ రోబో శంకర్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అతడి కూతురు ఇంద్రజకు డైరెక్టర్ కార్తీక్తో నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 2న చెన్నైలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ శుభకార్యానికి ఇరు కుటుంబాలు సహా అతి దగ్గరి బంధుమిత్రులు హాజరయ్యారు. తన ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇంద్రజ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్గా మారాయి. పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నెల రోజుల్లోనే వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. విజిల్, పాగల్ సినిమాల్లో.. ఇందుకోసం రోబో శంకర్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చెన్నైలో జరగబోయే ఈ వేడుకకుగానూ సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంద్రజ.. విజయ్ హీరోగా నటించిన బిగిల్(తెలుగులో విజిల్ పేరిట రిలీజైంది) మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషించింది. తెలుగులో పాగల్ అనే సినిమా చేసింది. ఇందులో .ఈ సింగిల్ చిన్నోడే..' అనే పాటలో మాత్రమే కనిపిస్తుంది. కార్తీ 'విరుమాన్' మూవీలో హీరోయిన్ అదితి శంకర్ స్నేహితురాలిగా నటించింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేసే ఆలోచనలో ఉంది ఇంద్రజ. ఎవరీ రోబో శంకర్.. ఆమె తండ్రి రోబో శంకర్ విషయానికి వస్తే.. ఇతడు రోబో డ్యాన్స్తో ఫేమస్ అయ్యాడు. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది. తనకు వచ్చిన మిమిక్రీతో సినిమాల్లో అడుగుపెట్టాడు. నెమ్మదిగా ఒక్కో సినిమా చేసుకుంటూ పోయాడు. కెరీర్ ప్రారంభించిన పదేళ్ల తర్వాతే అతడికి మంచి బ్రేక్ వచ్చింది. 'ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార' అనే చిత్రంతో అందరి కళ్లలో పడ్డాడు. అప్పటివరకు ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేసే ఇతడు ఈ చిత్రం సక్సెస్ తర్వాత ఏకంగా 10 సినిమాలు చేసే స్థాయికి ఎదిగిపోయాడు. దాదాపు తమిళ స్టార్ హీరోలందరితోనూ కలిసి పని చేశాడు. View this post on Instagram A post shared by SmartDecors (EVENT PLANNERS) (@smart_decors.in) View this post on Instagram A post shared by @clicks_by_vishnu_kumar_ చదవండి: భర్తతో కలిసి ఉదకశాంతి పూజ చేసిన గీతా మాధురి.. ఆమిర్తో, అతడి మాజీ భార్యతో.. నా రిలేషన్ ఎలా ఉందంటే?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement