-
టీ–వాలెట్తో ఆర్టీసీ టికెట్ బుకింగ్లు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ టికెట్ బుకింగ్లకు సంబంధించి ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఇక నుంచి ‘టీ–వాలెట్’మొబైల్ యాప్ ద్వారా కూడా రిజర్వేషన్లు బుక్ చేసుకొనే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ రిజర్వేషన్లకు టీ–వాలెట్ ద్వారానే చార్జీలు కూడా చెల్లించవచ్చు. దీంతో ప్రయాణికుల ఈ మెయిల్ అడ్రస్కు, మొబైల్ ఫోన్కు టికెట్ బుకింగ్ సంక్షిప్త సందేశం వస్తుంది. ప్రయాణ సమయంలో పేపర్లెస్ టికెట్ను పరిగణనలోకి తీసుకుంటారు. హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే 1,770 బస్సుల్లో ఈ సదుపాయాన్ని మరో రెండు రోజుల్లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ శుక్రవారం బస్భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రతిరోజు ఆర్టీసీ బస్స్టేషన్లలోని కౌంటర్లు, అధీకృత టికెట్ బుకింగ్ ఏజెన్సీలు, టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా 13,000 మంది ప్రయాణికులు రిజర్వేషన్ టికెట్లు తీసుకుంటున్నారు. వీటిలో 6,009 టికెట్లు కేవలం ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకుంటున్నారు. ఈ టికెట్లపైన ఆర్టీసీకి ప్రతిరోజు రూ.61.09 లక్షల ఆదాయం లభిస్తుంది. ఇక నుంచి ఆన్లైన్ బుకింగ్లన్నింటినీ టీ–వాలెట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. త్వరలో బస్పాస్లకు విస్తరణ.. మరోవైపు ఆర్టీసీ అందజేసే వివిధ రకాల బస్పాస్లకు కూడా టీ–వాలెట్ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇప్పటికే అన్ని రకాల పాస్లను ఆన్లైన్ చేశారు. విద్యార్ధులు, ఉద్యోగులు తదితర వర్గాల ప్రయాణికులు ఆన్లైన్ ద్వారా పాస్లు తీసుకొనే సదుపాయం ఉంది. టీ–వాలెట్కు దీన్ని అనుసంధానం చేయడం వల్ల ప్రయాణికులు ఈ మొబైల్ యాప్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు అవకాశం ఉంటుంది. ఏఎస్ఆర్టీయూ నిబంధనల మేరకే బయోడీజిల్ కొనుగోలు.. ఆర్టీసీలో బయోడీజిల్ వినియోగాన్ని పెంచడంపై దృష్టి సారించినట్లు ఆర్టీసీ చైర్మన్ వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు 35 వేల లీటర్లు వినియోగిస్తున్నామని, త్వరలో దీనిని లక్ష లీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 5 లక్షల లీటర్ల సాధారణ డీజిల్కు 20 శాతం చొప్పున లక్ష లీటర్ల బయోడీజిల్ను వినియోగించాల్సి ఉందన్నారు. తద్వారా కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, ప్రజలకు పర్యావరణ ప్రియమైన ప్రయాణ సదుపాయం లభిస్తుందన్నారు. ఇందుకోసం తాము ఏఎస్ఆర్టీయూ నిబంధనల మేరకే బయోడీజిల్ను కొనుగోలు చేస్తున్నామన్నారు. సాధారణ డీజిల్ ధరలపైన రూ.2 తక్కువకు బయోడీజిల్ కొనుగోలు చేయవచ్చునని ఏఎస్ఆర్టీయూ సూచించింది. కానీ తాము రూ.4 తక్కువకు అద్వైత్ అనే సంస్థ నుంచి బయోడీజిల్ కొనుగోలు చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. ఉద్యోగులు, కార్మికుల ఆన్డెప్యుటేషన్ బదిలీలు, అనారోగ్య సెలవుల విధానంలో కూడా పారదర్శకమైన పద్ధతులను పాటిస్తున్నట్లు చెప్పారు. టీ–వాలెట్ ద్వారా బుకింగ్ ఇలా... విద్యుత్ బిల్లులు, నల్లా బిల్లులు, ఇంటిపన్ను తదితర చెల్లింపుల కోసం ప్రభుత్వం ఇప్పటికే టీ–వాలెట్ను ప్రవేశపెట్టింది. ఈ వాలెట్లో కొంత మొత్తాన్ని నిల్వ ఉంచుకొని పేటీఎం తరహాలో వినియోగించుకోవచ్చు. గూగుల్ ప్లేస్లోర్ నుంచి ఈ వాలెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆన్లైన్లో క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగించి ఆర్టీసీ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇక నుంచి ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా, ఏ సమయంలోనే తమ మొబైల్ ఫోన్ నుంచి టికెట్ బుక్ చేసుకోవచ్చు. క్షణాల్లోనే మొబైల్కు సమాచారం వచ్చేస్తుంది. అధీకృత టికెట్ బుకింగ్ ఏజెన్సీల వద్ద కానీ, ఆర్టీసీ బుకింగ్ కౌంటర్ల వద్ద కానీ పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్ల నుంచి ప్రతిరోజు విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, చిత్తూరు, బెంగళూరు, చెన్నై, ముంబై, షిరిడీ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే 1,770 టీఎస్ఆర్టీసీ బస్సుల్లో టీ– వాలెట్ ద్వారా బుకింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. నష్టాలను అధిగమిస్తూనే మెరుగైన సేవలు: సోమారపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ఆర్థికంగా నిలదొక్కుకోవాడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోందని సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. శుక్రవారం బస్భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీఎస్ ఆర్టీసీ ఎప్పటికప్పుడు ప్రైవేట్ వాహనాల పోటీని తట్టుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తోందన్నారు. ప్రజారవాణా వ్యవస్థలో పోటీ నెలకొందని.. ఆటో, మ్యాక్స్, తుఫాన్, సెవెన్ సీటర్స్ వంటి ప్రైవేట్ వాహనాల పోటీని తట్టుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రతిరోజూ సంస్థకు వచ్చే రాబడి రూ.11 కోట్లు కాగా, ఖర్చు రూ.14 కోట్లు అవుతోందని చెప్పారు. సంస్థకు భారం పెరిగినప్పటికీ సిబ్బందికి వర్తించే ప్రయోజనాలను కొంచెం అటు, ఇటుగా వర్తింపజేస్తున్నామన్నారు. కష్ట సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిధులు సమకూర్చుకోవడం జరుగుతోందన్నారు. టీఎస్ ఆర్టీసీ దేశంలోనే జీరో యాక్సిడెంట్ రేటుతో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ చెల్లింపులన్నీ ఆన్ లైన్
► రాష్ట్రాన్ని నగదు రహితంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్ ► త్వరలోనే అందుబాటులోకి టీ వ్యాలెట్ ► డిజిటల్ చెల్లింపులపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణను సంపూర్ణ నగదు రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే కంపెనీలతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేటీఆర్ నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి, జగదీశ్ రెడ్డిలతో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సచివాలయంలో సమావేశమైంది. సిద్దిపేటలో నగదు రహిత చెల్లింపుల కోసం చేపట్టిన కార్యక్రమాలు, బ్యాంకుల సహకారం, ప్రజల్లో వచ్చిన చైతన్యం తదితర అంశాలపై ఉపసంఘం చర్చించింది. ఈ సమావేశంలో మొబైల్ వ్యాలెట్ కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ లావాదేవీలన్నీ ఆన్ లైన్ లేదా డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రజలకు ఉచితంగా అందుబాటులో తెస్తామన్నారు. ప్రభుత్వ సేవలు, చెల్లింపులను సైతం ఆన్ లైన్ చేస్తామన్నారు. వ్యాపారులు, వినియోగదారుల మధ్య అత్యంత తక్కువ మొత్తాల చెల్లింపులు సైతం నగదు రహితంగా జరిగితేనే సంపూర్ణ నగదు రహిత రాష్ట్రం సాధ్యం అవుతుందన్నారు. డిజిటల్ చెల్లింపుల సేవలు అందించే వివిధ సంస్థల మధ్య సమన్వయంతో పరస్పర చెల్లింపులకు అవకాశం ఉండాలన్నారు. ఇందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐని కోరుతామన్నారు. టీ వ్యాలెట్ సేవలను అందించేందుకు ముందుకు వచ్చిన పలు కంపెనీలు ఈ సందర్భంగా తాము రూపొందించిన వ్యాలెట్ల సేవలు, పనిచేసే తీరు విధానాన్ని మంత్రులకు వివరించారు. త్వరలోనే టీ వ్యాలెట్ సేవలు, సౌకర్యాలను ఖరారు చేసి, యాప్ను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. -
తెలంగాణ ప్రజల కోసం 'టీ-వ్యాలెట్'
హైదరాబాద్: త్వరలో అందుబాటులోకి రానున్న 'టీ-వ్యాలెట్'ను తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సకల హంగులతో కూడిన టీ-హబ్ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక రాష్ట్రం సొంతంగా వాలెట్ తయారు చేయడం దేశంలో ఇదే ప్రథమమని పేర్కొన్నారు. టీ వ్యాలెట్లో ప్రజల సౌకర్యం, భద్రత, ప్రైవసీకి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ వారంలోనే టీ-వ్యాలెట్ లోగోను ఆవిష్కరింపజేస్తామన్నారు. టీ-వ్యాలెట్ వినియోగానికి ఆధార్, ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుందని చెప్పారు. స్మార్ట్ ఫోన్, ఫీచర్ ఫోన్, కంప్యూటర్, కాల్సెంటర్ ద్వారా టీ-వాలెట్ సేవలు పొందవచ్చన్నారు. ఫోన్ లేకుండా కూడా టీ-వ్యాలెట్ సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement