-
Olympics: ఒకరు పాతాళానికి.. మరొకరు అత్యున్నత శిఖరానికి
సాక్షి, వెబ్డెస్క్: బ్యాడ్మింటన్ స్టార్.. తెలుగుతేజం పీవీ సింధు.. రెజ్లర్ సుశీల్ కుమార్.. ఇద్దరు పేరున్నవారే. ఈ ఇద్దరు ఒలింపిక్స్లో రెండేసీసార్లు పతకాలు అందుకున్నవారే. ఇద్దరికి తమ క్రీడాంశాల్లో ఘనమైన చరిత్రే ఉంది. కానీ కాలచక్రంలో రెజ్లర్ సుశీల్ కుమార్ పేరు పాతాళానికి పడిపోతే.. పీవీ సింధు పేరు భారత చరిత్రలో అత్యున్నత స్థాయికి చేరుకుంది. 2016 రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన పీవీ సింధు.. ఐదేళ్ల తర్వాత టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలిచి దేశం గర్వపడేలా చేసింది. సరిగ్గా ఇలాంటి ఫీట్నే రెజ్లర్ సుశీల్ కుమార్ నమోదు చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం ఒడిపిపట్టిన సుశీల్ 2012 లండన్ ఒలింపిక్స్లో రజతం సాధించి చరిత్ర సృష్టించాడు. స్వాతంత్యం తర్వాత భారత్ నుంచి వ్యక్తిగత విభాగంలో వరుసగా రెండుసార్లు పతకం సాధించిన వ్యక్తి సుశీల్కుమార్ మాత్రమే. ఇప్పడు ఆ ఘనతను పీవీ సింధు కూడా సాధించింది. ఇక ఈ ఇద్దరి జీవితాలు ఒకసారి పరిశీలించి చూడగా.. సింధు తన ప్రతిభతో మరింత పేరు సంపాదించగా.. 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత సుశీల్ స్వీయ తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్లో సుశీల్ రజతం నెగ్గిన తర్వాత దేశంలో అతను ఎందరికో ఆదర్శమయ్యాడు. భారత రెజ్లింగ్లో ఒక్క వెలుగు వెలిగిన సుశీల్ ఇప్పుడు వివాదాల నీడలో ఉన్నాడు. అతని అహం, మిగతా రెజర్ల పట్ల చిన్నచూపు ఇలా పలు అంశాలు అతన్ని కిందికి తొక్కేశాయి. విచిత్రంగా సింధు టోక్యో ఒలింపిక్స్లో పతకం ముద్దాడిన మరుసటిరోజే సుశీల్కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా చార్జీషీటులోకి ఎక్కాడు. ఇక పీవీ సింధు విషయానికి వస్తే.. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఆమె క్రేజ్ మరింత రెట్టింపైంది. ఎంతలా అంటే భారత్లో క్రికెటర్లకు ఉన్నంత క్రేజ్ సింధు సాధించడం విశేషం. ప్రపంచచాంపియన్షిప్, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు ఇలా ఏ టోర్నీ చూసుకున్నా ఆమె సాధించని పతకాలు లేవు. 2004 నుంచి బ్యాడ్మింటన్లో కఠోర సాధన చేస్తున్న సింధు 2016 రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన తర్వాత ఇంకా సాధించాల్సి ఏముందని అనుకొని ఉంటే ఈరోజు పరిస్థితి వేరేలా ఉండేది. కానీ సింధు అలా అనుకోలేదు. ఈ ఐదేళ్లలో ఆమె మరింత రాటుదేలింది. ఎంతలా అంటే 2019లో ఏకంగా మహిళల బాడ్మింటన్ విభాగంలో ప్రపంచచాంపియన్గా నిలిచింది. ఒలింపిక్స్లో రెండుసార్లు పతకాలు సాధించిన సింధుకూ ఒకటి మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. అదే ఆల్ ఇంగ్లండ్ బ్మాడ్మింటన్ చాంపియన్షిప్ టోర్నీ. ఇటీవలే ముగిసిన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పీవీ సింధు సెమీఫైనల్లో ఓడిపోయింది. ఇక త్వరలో జరగబోయే ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పీవీ సింధు గెలవాలని మనస్పూర్తిగా కోరుకుందాం. ఏదైతేనేం... విశ్వక్రీడల్లో ఈ ఇద్దరు క్రీడాకారులు దేశం కోసం కష్టపడ్డారు.. పతకం కోసం శ్రమించారు.. దేశం కీర్తిని రెపరెపలాడించారు. కానీ ఒకరి తప్పిదం తన క్రీడా జీవితాన్ని నాశనం చేస్తే.. ఒకరి పట్టుదల యావత్ దేశ కీర్తిని మరింత ఇనుమడింప చేసింది.- -
రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో ఛార్జ్ షీట్ దాఖలు
-
తీహర్ జైల్లో రెజ్లర్ సుశీల్కు టీవీ కేటాయింపు
న్యూఢిల్లీ: అన్నీ కలిసొస్తే ఈపాటికి టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్ క్రీడా పోటీల్లో రెజ్లర్ సుశీల్కుమార్ ఉండేవాడు. కానీ ఓ హత్య కేసు విషయంలో అరెస్టయి ప్రస్తుతం తిహార్ జైలులో కాలం వెళ్లదీస్తున్నాడు. రెజ్లింగ్ స్టార్, ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన ఏకైక భారతీయుడైన సుశీల్ కుమార్ తాను ఒలంపిక్స్ క్రీడలు చూడాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఒలంపిక్స్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారుడు చేసిన విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు అతడికి టీవీ కేటాయించారు. మే 23వ తేదీన ఓ వివాదం విషయంలో యువ రెజ్లర్ సాగర్ రాణాను హత్య చేసిన కేసులో సుశీల్ కుమార్ నిందితుడిగా ఉన్నాడు. కొన్నాళ్లు పరారీలో ఉన్న సుశీల్ను అనంతరం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
భూ తగాదాలు... గ్యాంగ్స్టర్లు... ప్రాణభయం
వేదిక రెజ్లింగ్ స్టేడియమే కావచ్చు... కానీ అది రెజ్లర్ల మధ్య గొడవ మాత్రమే కాదు... దాని వెనక బయటకు కనిపించని అనేక చీకటి కథలున్నాయి... దేశంలో ఎవరికీ సాధ్యంకాని రీతిలో రెండు ఒలింపిక్ మెడల్స్ను సాధించిన దిగ్గజం తనది కాని బాటలో వెళ్లి తప్పుడు మనిషిగా తేలిన వైనమిది... ఎన్నో ఏళ్ల పాటు శ్రమించి సాధించిన కీర్తి ప్రతిష్టలను పణంగా పెడుతూ సాధారణ గల్లీ గూండాలతో చేసిన స్నేహం, ఆపై శత్రుత్వం సుశీల్ కుమార్ను పతకాలు సాధించే స్థాయి నుంచి పతనం వైపు నడిపించింది. న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో సుశీల్ కుమార్ అరెస్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించి పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మే 4న ఈ ఘటన జరిగిన రోజున వచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే... ఛత్రశాల్ స్టేడియంలో రెజ్లింగ్ ప్రాక్టీస్ చేసే కొందరి మధ్య వాదోపవాదాల తర్వాత క్షణికావేశంలో జరిగిన ఉదంతంలా కనిపించింది. కానీ ఇప్పుడు దానికి సంబంధించి అనేక విషయాలు బయటపడుతున్నాయి. ఆస్తి, భూ తగాదాలు ప్రాథమిక కారణం కావడంతో పాటు రౌడీల భాగస్వామ్యం కూడా ఇందులో ఉంది. నిజానికి 18 రోజులపాటు సుశీల్ తప్పించుకు తిరిగింది పోలీసుల భయం వల్ల కాదని... గ్యాంగ్స్టర్లు తనను చంపేస్తారనే భయంతోనే అతను ఆ పని చేసినట్లు తెలుస్తోంది. నేపథ్యమిదీ... ఢిల్లీలోని మోడల్ హౌస్ ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన ఒక ఫ్లాట్ వివాదానికి ప్రధాన కారణంగా మారింది. తన భార్య పేరిట ఉన్న ఈ ఫ్లాట్ను సందీప్ అలియాస్ కాలా జఠేడి అనే వ్యక్తి భాగస్వామ్యంతో కలిసి సుశీల్ కొన్నాడు. సుశీల్ స్నేహం చేసిన ఈ కాలా జఠేడి న్యూఢిల్లీలో గ్యాంగ్స్టర్లలో ఒకడు. అతనిపైన పెద్ద సంఖ్యలో పోలీసు కేసులు ఉన్నాయి. ఢిల్లీ పరిసరాల్లో భూ కబ్జాల్లో అతని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. చాలా మంది రెజ్లర్లతో పాటు క్రిమినల్స్ కూడా ఈ ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. ఇందులో కొన్నాళ్లుగా జఠేడి మేనల్లుడి వరుస, అత్యంత ఆత్మీయుడైన రెజ్లర్ సోనూ మహల్, మరో రెజ్లర్ సాగర్ రాణా ఉంటున్నారు. రెజ్లర్ సోనూపై కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. సమభాగస్వామ్యం ఉన్న ఈ ఫ్లాట్ను జఠేడి అమ్మాలని భావించగా, అందుకు సుశీల్ అంగీకరించలేదు. దానిని అమ్మి తన డబ్బులు ఇవ్వాలంటూ సుశీల్పై జఠేడి ఒత్తిడి పెంచగా... ఫ్లాట్లో ఉంటున్న సోనూ, సాగర్ ఖాళీ చేయాలంటూ సుశీల్ మరోవైపు చెబుతూ వచ్చాడు. గుణపాఠం చెప్పాలని... సుశీల్ గత కొంత కాలంగా జఠేడి ప్రత్యర్థి అయిన మరో గ్యాంగ్స్టర్ నీరజ్ బవానా, నవీన్ బాలిలతో స్నేహం పెంచుకోవడం కూడా జఠేడి ఆగ్రహానికి కారణమైంది. ఫ్లాట్ ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్న సుశీల్పై సోనూ తదితరులు బహిరంగంగా దుర్భాషలాడటం మొదలు పెట్టారు. దాంతో వారికి గుణపాఠం చెప్పాలని సుశీల్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మే 4న స్టేడియం ముందు వీరంతా ఎదురెదురుగా తలపడ్డారు. అప్పటికే నీరజ్కు సంబంధించిన గూండాలను సుశీల్ తన కోసం పిలిపించుకున్నాడు. జఠేడి భయంతో సుశీల్ తనను ఏమీ చేయడని సోనూ భావించినా... నీరజ్ గూండాలు వారిని చితకబాదారు. ఆవేశపరుడైన సుశీల్ కూడా తాను ఓ చేయి వేశాడు. పైగా తనేంటో అందరికీ తెలియాలని, వారిలో భయం ఉండాలంటూ ఈ ఘటనను వీడియో షూట్ చేయమని తనవారికి సూచించాడు. తీవ్రంగా గాయపడిన సాగర్ తర్వాతి రోజు ఆసుపత్రిలో మరణించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. వేర్వేరు చోట్ల నుంచి తప్పించుకుంటూ... తన మేనల్లుడు సోనూపై దాడి సహజంగానే జఠేడికి కోపం తెప్పించింది. దాంతో సుశీల్పై ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సిద్ధమయ్యాడు. అనూహ్య ఘటన తర్వాత బెదిరిన సుశీల్ ఆ రోజు నుంచి ఎవరికీ దొరక్కుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తనకు ప్రాణహాని ఉందంటూ ముందస్తు బెయిల్ కోసం చేసిన దరఖాస్తులో కూడా పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి మొదలు పెట్టి యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణాల్లో దాక్కున్నాడు. తనను క్షమించమంటూ చివరకు జఠేడిని ఫోన్లో కోరేందుకు కూడా సుశీల్ ప్రయత్నించినట్లు సమాచారం. పోలీసుల చేతికి చిక్కిన తర్వాత కూడా అతను హత్య కేసుకంటే కూడా తనకు రౌడీల నుంచి రక్షణ కల్పించమంటూ అతను కోరాడని తెలిసింది. సస్పెండ్ చేయనున్న రైల్వేస్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ కుమార్ను ఉద్యోగం నుంచి తొలగించాలని రైల్వే శాఖ భావిస్తోంది. నార్తర్న్ రైల్వేలో సుశీల్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ హోదాలో ఉన్నాడు. అయితే ప్రాథమిక స్థాయిలో క్రీడలను తీర్చిదిద్దే బాధ్యతలతో 2015 నుంచి అతను ఢిల్లీ ప్రభుత్వం వద్ద డిప్యుటేషన్ మీద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ హోదాలో పని చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా కొనసాగింపు కోరినా ఢిల్లీ ప్రభుత్వం అందుకు అనుమతించకపోవడంతో రైల్వేస్కు వెళ్లిపోయాడు. నిబంధనల ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా నేరాల్లో నిందితుడిగా ఉంటే దర్యాప్తు ముగిసేవరకు సస్పెండ్ చేస్తామని, సుశీల్ విషయంలో కూడా అదే జరుగుతుందని రైల్వే అధికారులు చెప్పారు. మరోవైపు సుశీల్పై ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని భారత రెజ్లింగ్ సమాఖ్య ప్రకటించింది. ప్రస్తుతం అతనిపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోందని... చట్ట పరంగా విచారణ తర్వాత ముగిసి తీర్పు వచ్చిన తర్వాతే దానిపై మాట్లాడతామని స్పష్టం చేసింది. -
Wrestler Sushil Kumar: సుశీల్ చిక్కాడు...
న్యూఢిల్లీ: పోలీసులు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసినా... కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించినా... యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో 19 రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఆదివారం ఉదయం ఢిల్లీ శివారులోని ముండ్కా ప్రాంతంలో సుశీల్ కుమార్, అతడి అనుచరుడు అజయ్ కుమార్ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సుశీల్, అజయ్లను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు లోపల సుశీల్ను 30 నిమిషాలపాటు ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు మరిన్ని వివరాల రాబట్టేందుకు 12 రోజులపాటు తమ కస్డడీకి అప్పగించాలని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్యా మల్హోత్రాను కోరగా.... ఆరు రోజులపాటు సుశీల్, అజయ్లను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చారు. ఏం జరిగిందంటే... ఈ నెల నాలుగో తేదీన అర్ధరాత్రి ఛత్రశాల్ స్టేడియంలో జాతీయ గ్రీకో రోమన్ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ రాణా, అతని మిత్రులు సోనూ, అమిత్ కుమార్లతో సుశీల్ కుమార్, అతని అనుచరులు గొడవ పడ్డారు. ఈ గొడవలో సాగర్, సోనూ, అమిత్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 23 ఏళ్ల సాగర్ రాణా మృతి చెందాడు. తమపై సుశీల్, అతని అనుచరులు దాడి చేశారని ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో సోనూ, అమిత్ పేర్కొన్నారు. దాంతో సుశీల్, అతని అనుచరులపై ఢిల్లీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 (హత్య)తోపాటు మరో 10 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాతి రోజు (మే 5) నుంచి సుశీల్ పరారీలో ఉన్నాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సుశీల్ హరియాణా, చండీగఢ్, పంజాబ్, గయా, గురుగ్రామ్ ఇలా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో గడిపినట్లు సమాచారం. ఫోన్ ద్వారా తన ఆచూకీ దొరకకూడదనే ఉద్దేశంతో సుశీల్ 14 వేర్వేరు సిమ్ కార్డులు వాడినట్లు తెలిసింది. సుశీల్ ఆచూకీ తెలిపితే రూ. లక్ష రివార్డు కూడా ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఆఖరికి ఆదివారం ఉదయం ఢిల్లీ శివారులో తన అనుచరుడు అజయ్తో కలిసి స్కూటర్పై వెళ్తుండగా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు సుశీల్ చిక్కాడు. ఖేల్ ఖతమ్! అంతర్జాతీయస్థాయిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించిన 37 ఏళ్ల సుశీల్ కుమార్ పరువు, ప్రతిష్ట తాజా ఉదంతంతో మసకబారిపోయింది. ఈ హత్యతో తనకు సంబంధంలేదని సుశీల్ వివరణ ఇస్తున్నాడు. అయితే అతనికి వ్యతిరేకంగా పోలీసుల వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నట్లు సమాచారం. నార్నర్త్ రైల్వేలో సీనియర్ కమర్షియల్ మేనేజర్ అయిన సుశీల్ ఐదేళ్లుగా ఛత్రశాల్ స్టేడియంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా కొనసాగుతున్నాడు. అయితే సుశీల్ సమక్షంలోనే గొడవ జరగడం... సాక్ష్యాలూ ధ్వంసం కావడం... ఎఫ్ఐఆర్లో అతని పేరు ఉండటం.. తాజాగా అరెస్టు కూడా కావడంతో సుశీల్ ఉద్యోగం ఊడే అవకాశముంది. ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు నెగ్గిన ఏకైక క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన సుశీల్... తాజా సంఘటనతో భవిష్యత్లో భారత్కు ప్రాతినిధ్యం వహించే అవకాశాలకు తెరపడిందనే చెప్పాలి. 2019 ప్రపంచ చాంపియన్షిప్ లో చివరిసారి భారత్కు ప్రాతినిధ్యం వహించిన సుశీల్ 20వ స్థానంలో నిలిచాడు. సుశీల్ ఘనతలు 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్లో రజతం. 2010 ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్లో పసిడి పతకం. 2010 ఢిల్లీ, 2014 గ్లాస్గో, 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకాలు 2006 దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం. ఆసియా చాంపియన్షిప్లో స్వర్ణం (2010), రజతం (2007), రెండు కాంస్యాలు (2003, 2008). కామన్వెల్త్ చాంపియన్షిప్లో (2003, 2005, 2007, 2009, 2017) ఐదు స్వర్ణాలు, ఒక కాంస్యం (2005). 1998, 1999 ప్రపంచ క్యాడెట్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకాలు. అవార్డులు అర్జున అవార్డు: 2005; రాజీవ్గాంధీ ఖేల్రత్న: 2009; పద్మశ్రీ: 2011
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement