-
ఏడాది కాలానికి 3స్టాక్ సిఫార్సులు
షేరు పేరు: ఎస్బీఐ బ్రోకరేజ్ పేరు: హెచ్డీఎఫ్సీ బ్రోకరేజ్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.218 కాల వ్యవధి: ఒక ఏడాది విశ్లేషణ: ప్రస్తుత సంక్షోభ పరిస్థితిల్లో లయబిలిటీ రిస్క్లను ఎదుర్కోనే శక్తి సామర్థా్యలు ఎస్బీఐకు పుష్కలంగా ఉన్నాయి. సంస్థలో ప్రభుత్వం మెజార్టీ వాటాను కలిగి ఉండటం, డిపాజిట్లు క్రమంగా పెరుగుదల ఇందుకు సహకరిస్తున్నాయి. లోక్బుక్ నాణ్యత కారణంగా అసెట్ క్వాలిటీ విషయంలో అనేక ఇతర పెద్ద బ్యాంకుల కంటే మెరుగైన స్థానంలో ఉంది. కాబట్టి షేరును ప్రస్తుత మార్కెట్ ధర(రూ.189.55) వద్ద కొనుగోలు చేయడం ఉత్తమం. అలాగే రూ.152-157 పరిధి వరకు పడిన ప్రతిసారి కొనుగోలు చేయవచ్చు. షేరు పేరు: టెక్ మహీంద్రా బ్రోకరేజ్ పేరు: హెచ్డీఎఫ్సీ బ్రోకరేజ్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్: రూ.601 కాల వ్యవధి: ఒక ఏడాది విశ్లేషణ: కోవిడ్-19 ప్రేరేపిత లాక్డౌన్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ పరిస్థితులు ఐటీ రంగాన్ని పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. దీంతో ప్రముఖ గ్లోబల్ కమ్యూనికేషన్ కంపెనీలు నెట్వర్క్ వ్యవస్థపై ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు. కనెక్టివిటీకి డిమాండ్ పెరగడం కూడా ఈ షేరుకు కలిసొచ్చే అంశంగా ఉంది. కమ్యూనికేషన్ వర్టికల్లో అగ్రస్థానానికి చేరుకునేందుకు టెక్ మహీంద్రాకు పుష్కలంగా అవకాశాలున్నాయి. కాబట్టి ఈ షేరును రూ.500-508 శ్రేణిలో కొనుగోలు చేయడం ఉత్తమం. అలాగే రూ.455-460 శ్రేణి వరకు పతనమైన ప్రతిసారి కొనుగోలు చేయవచ్చు. షేరు పేరు: జేకే సిమెంట్స్ బ్రోకరేజ్ పేరు: మోతీలాల్ ఓస్వాల్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్: రూ.1450.00 కాల వ్యవధి: ఒక ఏడాది విశ్లేషణ: వ్యాపార విస్తరణతో ద్వారా అమ్మకాలు, ఆదాయ వృద్ధి జరగుతుందని అంచనా. ఉత్తర, మధ్య భారత్లో అమ్మకాలు పెరుగుతాయని అంచనా. కొత్తగా కంపెనీ పెట్టే వ్యయంతో ఉత్పాదక సామర్థ్యం పెరగుతుంది. తద్వారా కంపెనీ వార్షిక సగటు ఖర్చు తగ్గుతుంది. కాబట్టి రూ.1450.00 టార్గెట్ ధరతో ప్రస్తుత మార్కెట్ ధర(రూ.1419.95) వద్ద కొనుగోలు చేయడం ఉత్తమం. -
కోవిడ్-19 దెబ్బ- చౌకగా మారిన షేర్లు
ప్రపంచ దేశాలతోపాటు దేశీయంగానూ కరోనా వైరస్ విస్తరించడంతో పలు రంగాలు కుదేలయ్యాయి. కోవిడ్-19ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్డవున్ విధించడంతో ఆర్థిక వ్యవస్థ మందగమన బాటపట్టింది. పలు బిజినెస్లకు డిమాండ్ పడిపోవడంతోపాటు.. ఉత్పత్తి, సరఫరా సమస్యలు తలెత్తాయి. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగాల కోతకు తెరలేచింది. ప్రపంచ దేశాలన్నీ లాక్డవును అనుసరించడంతో దేశాల మధ్య ప్రయాణాలు రద్దయ్యాయి. వెరసి అటు టూరిజం, హోటళ్లు, విమానయానంతోపాటు.. ఇటు మల్టీప్లెక్స్లు, ఫ్యాషన్ రిటైలింగ్ తదితర రంగాలలో కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. దీంతో మార్చిలో ప్రపంచ మార్కెట్ల బాటలో దేశీ మార్కెట్లు సైతం కుప్పకూలినప్పటికీ తదుపరి ఏప్రిల్లో బౌన్స్బ్యాక్ సాధించాయి. అయినప్పటికీ పలు రంగాలకు చెందిన కౌంటర్లు ఇప్పటికీ ఏడాది గరిష్టాలతో పోలిస్తే చౌకగా ట్రేడవుతున్నాయి. మారిన పరిస్థితులలో ఇటీవల ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాలకు డిమాండ్ పెరుగుతూ వచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. రుణ చెల్లింపుల వాయిదాలపై ఆర్బీఐ మారటోరియం విధించినప్పటికీ ఆర్థిక మందగమనం కారణంగా కొంతమేర ఎస్ఎంఈ, కార్పొరేట్ తదితర రుణాల నాణ్యత దెబ్బతినే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితంగా ఎన్బీఎఫ్సీ, బ్యాంకింగ్ రంగ కౌంటర్లు సైతం బలహీనంగా కదులుతున్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. 20-50 శాతం డౌన్ లాక్డవున్ ప్రకటించిన మార్చి 24 నుంచి బీఎస్ఈ-500లోని పలు కంపెనీలు 20-50 శాతం మధ్య పతనమయ్యాయి. జాబితాలో పలు రంగాలు, కంపెనీలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా కొన్ని కౌంటర్లను పరిశీలిస్తే.. చాలెట్ హోటల్స్ 49 శాతం పతనమైంది. ఏడాది కాలంలో 71 శాతం కుప్పకూలింది. కంపెనీ ఆదాయంలో సగ భాగం విదేశీ టూరిస్టుల నుంచే సమకూరుతుందని విశ్లేషకులు తెలియజేశారు. ఇక లెమన్ ట్రీ హోటల్స్ గత రెండు నెలల్లో 33 శాతం క్షీణించగా.. గరిష్టం నుంచి 74 శాతం పడిపోయింది. ఇతర కౌంటర్లలో మల్టీప్లెక్స్ కంపెనీ పీవీఆర్ షేరు 38 శాతం నీరసించగా.. గరిష్టం నుంచి 71 శాతం తిరోగమించింది. మాల్స్పై లాక్డవున్ కొనసాగుతుండటం, ఓటీటీ ప్లాట్ఫామ్ పుంజుకోవడం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫైనాన్స్ వీక్ కోవిడ్-19 ధాటికి ఫైనాన్షియల్ రంగ కౌంటర్లూ బలహీనపడ్డాయి. ఇటీవల కొంతమేర రికవర్ అయినప్పటికీ.. పీఎస్యూ, ప్రయివేట్ బ్యాంక్, ఎన్బీఎఫ్సీ కంఔటర్లు డీలాపడ్డాయి. పీఎన్బీ, ఆర్బీఎల్, డీసీబీ, బీవోబీలతోపాటు.. చోళమండలం ఫైనాన్షియల్, శ్రీరామ్ సిటీ యూనియన్, రెప్కో హోమ్ తదితరాలు గత రెండు నెలల్లో 22-33 శాతం మధ్య క్షీణించాయి. పెట్టుబడుల ఆవశ్యకత, మొండిబకాయిలు పెరగనున్న అంచనాలు ఇందుకు కారణంకాగా.. ఆదిత్య బిర్లా ఫ్యాషన్, ఫ్యూచర్ రిటైల్, షాపర్స్ స్టాప్ సైతం 30-34 శాతం మధ్య వెనకడుగు వేశాయి. -
కొటక్ మహీంద్రా ,ఇన్ఫోసిస్లపై ఫోకస్
క్యూ4 ఫలితాలు: డాబర్, హెరిటేజ్ ఫుడ్స్, ఇండియా గ్రిడ్ ట్రస్ట్, ఆదిత్యా బిర్లా ఫ్యాషన్, కంప్యూకమ్ సాఫ్ట్వేర్, సన్ ఫార్మాసూటికల్స్, క్వెస్ కార్పొరేషన్, జేపీ అసోసియేట్స్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, వైభవ్ గ్లోబల్ కంపెనీలు మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను బుధవారం వెల్లడించనున్నాయి. కొటక్మహీంద్రా బ్యాంక్: రూ.7,500 కోట్ల నిధులు సమీకరించేందుకు కొటక్ మహీంద్రా బ్యాంక్ క్వాలిఫైడ్ ఇన్స్టీట్యూషనల్ ప్లేస్మెంట్ ఆఫర్ను ప్రకటించింది.ఇందులో భాగంగా ఒక్కో షేరు ధరను రూ.1,147.75 గా నిర్ణయించింది. బ్లూడార్ట్: మార్చితో ముగిసిన క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ.30.57 కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది.అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.12.24 కోట్లుగా ఉందని బీఎస్ఈకి ఇచ్చిన సమాచారంలో బ్లూడార్ట్ తెలిపింది. పీఎఫ్సీ: రూ.22,000 కోట్ల విలువైన ప్రాజెక్టుకు సంబంధించి నర్మదా బేసిన్ ప్రాజెక్ట్స్ కంపెనీ లిమిటెడ్తో ఒప్పందం చేసుకున్నట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) తెలిపింది. న్యూజెన్ సాఫ్ట్వేర్: మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 34 శాతం పడిపోయి రూ.41.5 కోట్లుగా నమోదైనట్లు ఈ కంపెనీ వెల్లడించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.62.5 కోట్లుగా ఉంది. దీపక్ నైట్రైట్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 88 శాతం పెరిగి రూ.172.3 కోట్లకు చేరిందని దీపక్ నైట్రేడ్ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.91.46 కోట్లుగా ఉందని బీఎస్ఈకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఇన్ఫోసిస్: డిజిటల్ ప్లాట్ఫాంలలో ఎండ్టుఎండ్ వెల్త్ మేనేజ్మెంట్ సామర్థ్యాలను అందించేందుకు అవాల్క్ కంపెనీతో బాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 96 శాతం క్షీణించి రూ.6.67 కోట్లుగా నమోదైనట్లు ఈ కంపెనీ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.199.91 కోట్లుగా నమోదైంది. టొరంట్ ఫార్మాసూటికల్స్: కన్సాలిడేటెడ్ నికర లాభం క్యూ4లో రూ.314కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది. జయప్రకాశ్ పవర్ వెంచర్స్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ.70.91 కోట్లకు తగ్గినట్లు ఈ కంపెనీ వెల్లడించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో నికర నష్టం 245.30 కోట్లుగా ఉంది. -
స్టాక్స్ వ్యూ
సన్ టీవీ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.608 టార్గెట్ ధర: రూ.835 ఎందుకంటే: ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. చందా ఆదాయం 21 శాతం వృద్ధి చెందింది. కానీ ప్రకటనల ఆదాయం 3 శాతమే పెరిగింది. మొత్తం మీద కంపెనీ ఆదాయం 11 శాతమే వృద్ధి చెంది రూ.740 కోట్లకు పెరిగింది. ఇబిటా 12 శాతం పెరిగి రూ.550 కోట్లకు చేరింది. ఇబిటా వృద్ధి ఆరోగ్యకరంగా ఉండటం, తరుగుదల తక్కువగా ఉండటం, ఇతర ఆదాయం అధికంగా ఉండటంతో నికర లాభం 23 శాతం వృద్ధితో రూ.350 కోట్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో ఆదాయం 28 శాతం, ఇబిటా 36 శాతం, నికర లాభం 42 శాతం చొప్పున పెరిగాయి. మిగిలిన ఆరు నెలల కాలానికి ప్రకటనల ఆదాయం పది శాతానికి పైగా వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. రెండేళ్లలో ఆదాయం 18 శాతం, ప్రకటనల ఆదాయం 12 శాతం, చందా ఆదాయం 19 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. గత ఆరు నెలల కాలంలో ఈ షేర్ 30 శాతం క్షీణించింది.దీంతో కొనుగోళ్లకు ప్రస్తుత ధర ఆకర్షణీయంగా ఉందని భావిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి కల్లా కంపెనీ పెట్టిన పెట్టుబడిపై రాబడి (ఆర్ఓసీఈ) 31 శాతానికి పెరగగలదని అంచనా వేస్తున్నాం. ఓవర్ ద టాప్ (ఓటీటీ) ప్లాట్ఫామ్పై సన్ నెక్స్ట్ట్ను అందుబాటులోకి తేవడం, బెంగాలీ చానల్ను ప్రారంభించనుండటం, సన్ లైఫ్ చానల్ను మళ్లీ తీసుకురావడం... వీటిపై పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ప్రతిఫలాలు ఇవ్వడానికి మరికొంత కాలం పట్టనుండటం... ప్రతికూలాంశాలు. యాక్సిస్ బ్యాంక్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.620 టార్గెట్ ధర: రూ.725 ఎందుకంటే: ప్రైవేట్ రంగంలోని ఈ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు బావున్నాయి. రుణ నాణ్యత మెరుగుపడింది. ఈ క్యూ1లో రూ.4,337 కోట్లుగా ఉన్న తాజా మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.2,777 కోట్లకు తగ్గాయి. గత క్వార్టర్లను పరిగణనలోకి తీసుకుంటే ఇదే అత్యంత కనిష్ట స్థాయి. ఇటీవల రుణాల చెల్లింపుల్లో విఫలమైన ఐఎల్అండ్ఎఫ్ఎస్ కంపెనీకి ఈ బ్యాంక్ ఇచ్చిన రుణాలు రూ.825 కోట్ల మేరకు ఉన్నాయి. రుణాలు 11 శాతం వృద్ధి చెంది రూ.4,56,121కోట్లకు పెరిగాయి. రిటైల్ రుణాలు 20 శాతం వృద్ధి చెందాయి. గత కొన్ని క్వార్టర్లుగా అంతంత మాత్రం వృద్ది సాధించిన కార్పొరేట్ రుణాలు 21 శాతం పెరిగాయి. నిర్వహణ లాభం 8.4 శాతం వృద్ధితో రూ.4,094 కోట్లకు పెరిగింది. నికర లాభం 82 శాతం వృద్ధితో రూ.790 కోట్లకు ఎగసింది. కేటాయింపులు తగ్గాయి. రుణాలు, లాభదాయకత విషయంలో మూడో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఇదే. రెండేళ్లలో రుణాలు 18 శాతం చక్రగతి వృద్ధితో రూ.6,07,702 కోట్లకు పెరగగలవని అంచనా వేస్తున్నాం. మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్లు 48 శాతంగా ఉన్నాయి. 2018–09 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ను 3 శాతానికి పైగానే సాధిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 13 శాతానికి మించి ఉండగలదని, అలాగే రిటర్న్ ఆన్ అసెట్(ఆర్ఓఏ) 1.1 శాతంగా ఉండగలదని భావిస్తున్నాం. గమనిక: ఈ కాలమ్లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
కోటక్ మహీంద్రా బ్యాంక్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: కేఆర్ చోక్సీ ప్రస్తుత ధర: రూ. 1,138 టార్గెట్ ధర: రూ.1,461 ఎందుకంటే: కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. రుణాలు 21 శాతం వృద్ధితో రూ.1,849 కోట్లకు పెరిగాయి. రిటైల్రుణాలు 28 శాతం, కార్పొరేటర్ రుణాలు 17 శాతం పెరగడమే దీనికి ప్రధాన కారణం. నికర వడ్డీ ఆదాయం 16 శాతం (క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 4 శాతం) వృద్ధితో రూ.2,690 కోట్లకు పెరిగింది. నిధుల వ్యయం 16 బేసిస్ పాయింట్లు పెరగడంతో నికర వడ్డీ మార్జిన్ 10 బేసిస్ పాయింట్లు తగ్గి 4.2 శాతానికి చేరింది. ఫీజు ఆదాయం 26 శాతం ఎగసి రూ.1,020 కోట్లకు పెరిగింది. కేటాయింపులు 63 శాతం పెరిగి రూ.350 కోట్లకు చేరాయి. సీక్వెన్షియల్గా చూస్తే కేటాయింపులు 25 శాతం తగ్గాయి. ఇక నికర లాభం 15 శాతం(క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 11 శాతం) వృద్ధితో రూ.1,140 కోట్లకు పెరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 11.6 శాతంగా ఉంది. సీక్వెన్షియల్గా చూస్తే, స్థూల మొండి బకాయిలు 2 బేసిస్ పాయింట్లు తగ్గి 2.15 శాతంగా (రూ.4,030 కోట్లుగా) నికర మొండి బకాయిలు ఫ్లాట్గా 0.86 శాతంగా (రూ.1,500 కోట్లుగా)ఉన్నాయి. రుణ నాణ్యత అత్యుత్తమంగా ఉన్న బ్యాంక్ల్లో ఇది కూడా ఒకటి. గత రెండేళ్లుగా బ్యాంక్ లాభదాయకత పెరుగుతోంది. మరోవైపు ఒత్తిడి రుణాలు తగ్గుతున్నాయి. రుణ వృద్ధి 20 శాతానికి మించి ఉండగలదని బ్యాంక్ అంచనా వేస్తోంది. ఇటీవలనే ఈ బ్యాంక్ వినియోగ వస్తువులు, టూ వీలర్ల కొనుగోళ్లకు రుణాలందించడం ప్రారంభించింది. లిక్విడిటీ సమస్యలతో సతమతమవుతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల పోర్ట్ఫోలియోలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కోటక్ 811 (డిజిటల్ బ్యాంక్ ఖాతా)కు మంచి స్పందన లభిస్తోంది. అనుబంధ సంస్థలు–కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్, కోటక్ సెక్యూరిటీస్, కోటక్ ప్రైమ్(కార్ ఫైనాన్సింగ్), కోటక్ ఏఎమ్సీల పనితీరు కూడా బావుంది. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో రుణాలు 25 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.437 టార్గెట్ ధర: రూ.515 ఎందుకంటే: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారం జోరుగా ఉన్నా, మార్జిన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. స్థూల మొండి బకాయిలు 10 శాతం పెరగడం(సీక్వెన్షియల్గా)నిరాశపరిచింది. సీక్వెన్షియల్గా వ్యక్తిగత రుణాలు 30 శాతం, ప్రాజెక్ట్ రుణాలు మూడు రెట్లు పెరిగాయి. మొత్తం మీద రుణ వృద్ధి 16 శాతంగా ఉంది. ఇది ఇటీవల కాలంలో ఇదే అత్యధిక త్రైమాసిక వృద్ధి. అధిక రాబడులు వచ్చే ఆస్తులు తనఖాగా రుణాలు, ప్రాజెక్ట్ రుణాలు పెరిగినప్పటికీ, నిధుల వ్యయం తగ్గినప్పటికీ, నికర వడ్డీ మార్జిన్ మెప్పించలేకపోయింది. ఈ క్యూ2లో నిధుల వ్యయం 8.3 శాతంగా ఉండటంతో నికర వడ్డీ మార్జిన్ 2.34 శాతంగా నమోదైంది. ఆస్తులు తనఖాగా రుణాలు 41 శాతం, ప్రాజెక్ట్ రుణాలు 83 శాతం పెరగడంతో నిర్వహణ ఆస్తులు 16 శాతం పెరిగాయి. రెండేళ్లలో నిర్వహణ ఆస్తులు 16 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం. కేటాయింపులు సీక్వెన్షియల్గా 36 శాతం వృద్ధితో రూ.221 కోట్లకు పెరిగాయి. దీంతో ప్రొవిజనల్ కవరేజ్ రేషియో 20 శాతం పెరిగి 52 శాతానికి ఎగసింది. బీమా దిగ్గజం ఎల్ఐసీ మాతృసంస్థ కావడం, విస్తృతమైన నెట్వర్క్, మార్జిన్లు కొనసాగించే సత్తా ఉండడం, రుణ నాణ్యత మెరుగుపడే అవకాశాలు.. ఇవన్నీ సానుకూలాంశాలు. లిక్విడిటీ సమస్యలు కారణంగా నిధులు వ్యయం పెరిగే అవకాశాలుండటం, ఫలితంగా మార్జిన్లపై ఒత్తిడి పడనుండటం, స్థూల మొండి బకాయిలు పెరుగుతుండటం ప్రతికూలాంశాలు. గమనిక: ఈ కాలమ్లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement