-
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని రైలు కిందకు తోసేసి..
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. 20 ఏళ్ల కాలేజీ విద్యార్థినిని ఓ ఆకతాయి కదులుతున్న రైలు కిందకు తోసేశాడు. థామస్ మౌంట్ రైల్వే స్టేషన్లో గురవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. అమ్మయి చెన్నై బీచ్కు వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్న సమయంలో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఘటనకు ముందు యువతికి, నిందితుడికి మధ్య వాగ్వాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కోపంతో ఉన్న నిందితుడు రైలు ప్లాట్ఫైంకి రావడం చూసి ఆమెను తోసేశాడని చెప్పారు. నిందితుడ్ని అలందూర్కు చెందిన సతీశ్గా(23) గుర్తించారు పోలీసులు. అతను రిటైర్డ్ ఎస్ఐ కుమారుడని వెల్లడించారు. ఎనిమిదో తరగతిలోనే చదువు ఆపేశాడని, చాలా కాలంగా యువతి వెంట పడుతున్నట్లు తెలిపారు. యువతికి నిశ్చితార్థం.. మృతి చెందిన యువతిని సత్యగా గుర్తించారు పోలీసులు. ఆమె తల్లి హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారని తెలిపారు. సత్యకు గతనెలలోనే నిశ్ఛితార్థం జరిగినట్లు వెల్లడించారు. ఆమె తల్లి సహా కుటుంబసభ్యులంతా పోలీస్ శాఖలోనే ఉద్యోగాలు చేస్తున్నట్లు వివరించారు. చదవండి: టీచర్ బ్రేకప్ చెప్పిందని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి -
జీవిత భాగస్వాములపై నిఘా..! గూగుల్ కీలక నిర్ణయం...!
Google Get Rid Of Stalkerware Ads Promoting Spying On Spouse: ప్రస్తుత టెక్నాలజీతో ప్రతిదీ సాధ్యమే..! టెక్నాలజీను మంచి మార్గంలో వాడుకుంటే ఎన్నో ఉపయోగాలు..! అదే చెడు కోసం వాడితే భారీ ముప్పునే కల్గిస్తుంది. కొంత మంది వీపరిత బుద్దితో సాంకేతికతను దుర్వినియోగం కోసం వాడే వారు ఎంతోమంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీని ఉపయోగించి తమ భాగస్వాములపై నిఘా పెట్టడం కోసం పలువురు స్టాకర్వేర్ యాప్స్ను ఉపయోగిస్తున్నారు. ఇదే కొంత మందికి అదునుగా మారి ఆయా వ్యక్తుల అవసరాలను క్యాష్ చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ జీవిత భాగస్వామిపై నిఘా పెట్టేందుకు స్టాకర్వేర్ యాప్స్ భారీగానే అందుబాటులో ఉన్నాయి. ఈ స్టాకర్వేర్ యాప్స్ ద్వారా జీవిత భాగస్వామి ఫోన్ మెసేజ్లు, కాల్ లాగ్లు, లొకేషన్, ఇతర వ్యక్తిగత కార్యకలాపాలను తెలుసుకుంటున్నారు. ఈ స్టాకర్వేర్ యాప్స్ ఫోన్లో ఉన్నాయనే విషయాన్ని గుర్తుపట్టడం చాలా కష్టం. చదవండి: మొన్న ఫేస్బుక్ డౌన్..! ఇప్పుడు జీ మెయిల్..! స్టాకర్వేర్ యాప్స్పై గూగుల్ కీలక నిర్ణయం..! తాజాగా స్టాకర్వేర్ యాప్స్పై గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. స్టాకర్వేర్ యాప్స్ను ప్రోత్సహించే యాప్స్పై గూగుల్ ఉక్కుపాదం మోపింది. అంతేకాకుండా స్టాకర్వేర్ యాడ్స్ను కూడా గూగుల్ యాడ్స్లో కన్పించకుండా చేసింది. జీవిత భాగస్వాములపై నిఘా పెట్టే యాప్స్ గూగుల్ కఠినవైఖరిని అవలంభిస్తోందని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. కొన్ని యాప్స్ అనేక పద్దతులను ఉపయోగించి స్టాకర్వేర్ యాప్స్ను ప్లేస్టోర్లో చొప్పించే ప్రయత్నాలను చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. స్టాకర్వేర్ యాప్స్పై గూగుల్ ఎప్పటికప్పుడు నిఘా పెడుతుందని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. భారత్లో నిఘా ఎక్కువే...! ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కాస్పర్స్కై నివేదిక ప్రకారం...స్టాకర్వేర్ యాప్స్తో భారత్లో సుమారు 4627 మంది ప్రభావితమైనట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా స్టాకర్వేర్ యాప్స్తో 2019లో 67,500 మంది, 2020లో 53,870 మంది ప్రభావితమయ్యారు. చదవండి: అదృష్టమంటే ఇదేనెమో..! 4 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు సొంతం...! -
రెచ్చిపోయిన ఉన్మాది, మహిళపై కత్తితో దాడి
తిరువనంతపురం: కేరళలో మరో ఉన్మాది రెచ్చిపోయాడు. తనతో పెళ్లికి నిరాకరించిందన్న అక్కసుతో మహిళపై దారుణానికి తెగబడ్డాడు. గతంలో కూడా వేధింపులకు పాల్పడిన నిందితుడు సమయం చూసి ఇంట్లోకి చొరబడి మరీ బాధితురాలిని పొట్టన పెట్టుకున్న ఘటన విషాదాన్ని నింపింది. పెద్దమాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీపూర్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం నాలుగేళ్ల క్రితం తిరువనంతపురానికి చెందిన సూర్యగాయత్రిని పెళ్లి చేసుకుంటానంటూ ఆమె కుటుంబాన్ని సంప్రదించాడు నిందితుడు, పెయాడ్కు చెందిన అరుణ్(29).అయితే ఈ ప్రతిపాదనను వారు తిరస్కరించారు. దీంతో అరుణ్ వేధింపుల పర్వం మొదలైంది. దీనికి తోడు తన స్మార్ట్ఫోన్, బంగారు నగలు దొంగిలించాడంటూ నాలుగేళ్ల క్రితమే సూర్యగాయత్రి తల్లి తిరువనంతపురంలోని ఆర్యనాడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అప్పట్లో కేసు నమోదు చేయని పోలీసులు అరుణ్కు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలివేశారు. ఆ తరువాత కొంత కాలానికి సూర్యగాయత్రి మరొక వ్యక్తిని వివాహం చేసుకోగా, అరుణ్ కూడా వివాహం చేసుకున్నాడు. అయితే భర్తతో విబేధాల కారణంగా సూర్య గాయత్రి ఇటీవల పుట్టింటికి తిరిగి వచ్చింది. దీంతో అరుణ్ మళ్లీ ఆమె వెంటపడటం మొదలు పెట్టాడు. తనతో సంబంధం పెట్టుకోవాలని బెదిరించాడు. దీనికి నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. అదును చూసి ఎటాక్ చేసి కత్తితో ఏకంగా 15 సార్లు పొడిచాడు. వెంటనే స్పందించిన పొరుగువారు అరుణ్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన సూర్యగాయత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది. అరుణ్పై అంతకు ముందే క్రిమినల్ కేసులున్న నేపథ్యంలో అతని పెళ్లి ప్రస్తావనను తిరస్కరించామని గాయత్రి తల్లి వల్సల తెలిపారు. అరుణ్ దాడిలో గాయ పడిన వల్సల ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. అయితే తనను అవమానించినందుకే ప్రతీకారం తీర్చుకున్నానని పోలీసుల విచారణలో నిందితుడు తెలిపాడని చెప్పారు. -
ఇంటర్ యువతిని వెంటాడి, వేధించి గొడ్డలితో నరికేశాడు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలపై వరుస అరాచకాలు, హత్యలు కలకలం రేపుతున్నాయి. తనను పట్టించుకోవడంలేదన్న ఆగ్రహంతో ఇంటర్ చదువుతున్న యువతిని గొడ్డలితో నరికి చంపాడో ప్రబుద్ధుడు. ఆరు నెలలపాటు వెంటాడి, వేధించి మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడిన వైనం బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెడితే..ఢిల్లీలోని మోతీబాగ్ ప్రాంతంలో నివసిస్తున్న యువతిపై, నిందితుడు ప్రవీణ్ వేధింపులకు పాల్పడేవాడు. ఈ విషయాన్ని ఆమె తండ్రితో చెప్పుకుంది. దీంతో తండ్రి ప్రవీణ్ను కొట్టి, తీవ్రంగా మందలించాడు. ఇక అప్పటినుంచి మరింత రెచ్చిపోయాడు. ఎలాగైనా యువతి మట్టుబెట్టాలని పథకం వేశాడు. ఇందులో భాగంగానే గత నెల ఒక గొడ్డలిని కూడా కొనుగోలు చేశాడు. సోమవారం సాయంత్రం షాపునుంచి ఇంటికి వెళుతున్న ఆమెపై కాపుకాసి గొడ్డలితో ఎటాక్ చేశాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ, తీవ్రగాయాలతో కొద్దిసేపటికే మరణించింది. యువతి హత్యానంతరం హర్యానాకు పారిపోయిన ప్రవీణ్ను, సోదరి ఇంట్లో మంగళవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తమకొక ఎలక్ట్రిక్ షాప్, ఫ్రూట్ షాప్ ఉందని, ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు షాపులో తన సోదరి కూర్చునేదని, ఆ సమయంలో ప్రవీణ్ వేధించేవాడనీ మృతురాలి సోదరి వాపోయింది. పగతో దారుణంగా తన సోదరిని పొట్టనపెట్టుకున్నాడని కన్నీరుమున్నీరుగా విలపించింది. అంతేకాదు పుట్టినరోజుకు ముందే చంపేస్తానని ప్రవీణ్ బెదిరించేవాడని చివరికి అన్నంతపనీ చేశాడని రోదించింది. కాగా గత వారం ఒక క్యాబ్ డ్రైవర్, అనుమానంతో ప్రియురాల్ని గొంతుకోసి హత్య చేశాడు. అలాగే మహిళల పేరుతో వంద నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి అశ్లీల సందేశాలు, వీడియోలతో సంచలనం రేపిన జిమ్ ట్రైనర్ను పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
ఆపిల్ సీఈవోకు వేధింపులు, ఫిర్యాదు
శాన్ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం ఆపిల్ సీఈవో టిమ్ కుక్పై భారతీయ సంతతికి చెందిన ఒక వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. పాలో ఆల్టోలోని కుక్ అధికారిక నివాసంలోకి రెండు సార్లు అక్రమంగా చొరబడి అనుచితంగా ప్రవర్తించడంతో పాటు, ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై ఆపిల్ ఫిర్యాదు చేయడంతో కాలిఫోర్నియా కోర్టు అతనిపై తాత్కాలిక నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. సిలికాన్ వ్యాలీలోని కుక్ నివాసం, ఆయన సెక్యూరిటీ గార్డులు ముగ్గురు, ఆపిల్ పార్క్ ప్రధాన కార్యాలయానికిదూరంగా ఉండాలని కూడా ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 3వ తేదీ దాకా ఈ ఉత్తర్వులు అమల్లో వుంటాయని కోర్టు తెలిపింది. ఆపిల్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ విలియం బర్న్స్ ప్రకారం శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన రాకేశ్ శర్మ అలియాస్ "రాకీ" (41) రెండుసార్లు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డాడు. 25 సెప్టెంబర్ 2019న వాయిస్ మెయిల్తో శర్మ వేధింపులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 4 న షాంపైన్ బాటిల్, పువ్వులు తీసుకొని అనుమతిలేకుండా నేరుగా కుక్ ఇంటికి వచ్చాడు. ఒక వారం తరువాత మరో అవాంఛనీయ కాల్ చేసిన బెదిరింపులకు పాల్పడ్డాడు. కొంతకాలం తర్వాత, శర్మ తన ట్విటర్ ఖాతాలో ఆపిల్ ఎగ్జిక్యూటివ్ను ట్యాగ్ చేస్తూ కొన్నిఅభ్యంతరకరమైన వ్యాఖ్యలు, ఫోటోలు షేర్ చేశాడు. అలాగే జనవరి 15 న మరోసారి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతుండగా భద్రతాసిబ్బంది అడ్డుకున్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని హెచ్చరిస్తూ ఆపిల్ న్యాయవాదులు రాకీకి ఒక లేఖ పంపారు. అయినా ఏ మాత్రం బెదరని రాకీ ఈసారి ఆపిల్ టెక్నికల్ టీంకు కాల్ చేశాడు. కంపెనీ తనను చంపడానికి చూస్తోందని ఆరోపించాడు. మళ్లీ ఒక నెల తరువాత తిరిగి వచ్చిన అతగాడు ఏకంగా టిమ్ కుక్ నివాసంలోని గేటులోకి ప్రవేశించి డోర్ బెల్ మోగించాడని కంపెనీ తన ఫైలింగ్లో పేర్కొంది. మరోవైపు కుక్ నివాసం వద్ద పదపదే నిబంధనలను ఉల్లంఘించడం, తుపాకీ గురించి మాట్లాటడం చేశాడని, శారీరకంగా తనకు హాని చేస్తాడని గట్టిగా నమ్ముతున్నానని కుక్ సెక్యూరిటీ బృందంలోని ఒక సభ్యుడు ఆరోపించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement