-
ఆ పాఠశాలకు అందరూ స్కర్టుతోనే రావాలి.. ఎందుకో తెలుసా?
లింగ సమానత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో స్కాట్లాండ్లోని ఓ పాఠశాల వినూత్న ఆలోచన చేసింది. పాఠశాలలోని బాలురు, బాలికలతోపాటు టీచర్లు కూడా స్కర్ట్స్ ధరించి క్లాస్లోకి రావాలని నిర్ణయం తీసుకుంది. నవంబర్ 4న ఎడిన్బర్గ్లోని కాసిల్వ్యూ ప్రైమరీలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మొదటిసారిగా ‘వేర్ ఎ స్కర్ట్ టు స్కూల్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించుకన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కర్ట్ ధరించి పాఠశాలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఓ టీచర్ తన ట్విటర్లో షేర్ చేయడంతో అవి వైరల్గా మారాయి. చదవండి: సమాజ్వాదీ అత్తర్పై మీమ్స్.. ‘వాహ్ భాయ్ వాహ్’ అంటున్న నెటిజన్లు స్కూల్ పిల్లలందరికి సౌకర్యానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చామని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు రాసిన లేఖలో తెలిపారు. స్కర్ట్ లోపల లెగ్గిన్, ప్యాంట్ లాంటివి ధరించవచ్చని పేర్కొన్నారు. అంతేగాక ఒకవేళ స్కర్ట్ కొనలేని వారికి స్కూల్ యాజమాన్యమే పిల్లలకు వాటిని ఆఫర్ చేసిందన్నారు. బట్టలకు లింగ బేధం లేదనే సందేశాన్ని తెలియజేయడానికే తాము ఈ ప్రయత్నం చేసినట్లు తెలిపారు. మనం ఎంచుకున్న విధంగా మన భావాలను వ్యక్తీకరించడానికి మనందరికీ స్వేచ్ఛ ఉందనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఇలా చేశామని పేర్కొన్నారు. చదవండి: తొలిసారి పిజ్జా రుచి చూసిన బామ్మ.. ఆమె చిరునవ్వుకు నెటిజన్ల ఫిదా కాగా ఇలా ధరించడం ఇష్టం లేని వారిని మేం ఏం బలవంతం చేయలేదని అంటున్నారు. ఇష్టం ఉన్న వారే ధరించాలని కోరినట్లు తెలిపారు. విద్యార్థులు తమ అభిప్రాయాన్ని స్వేచ్చగా చెప్పేందుకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే సదరు పాఠశాల తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తుంటే మరికొందరు తప్పబడుతున్నారు.లింగ సమానత్వం అంటే ఒకే విధమైన దుస్తులు ధరించడం లేదా పంచుకోవడం కాదని, అందరికి సమాన అవకాశాలు, బాధ్యతలు, హక్కులు కల్పించడమని చెబుతున్నారు. P6 have been learning about the importance of breaking down gender stereotypes. We have organised a ‘Wear a Skirt to School Day’ to raise awareness of #LaRopaNoTieneGénero campaign. This will be on Thursday 4th November and we’d love everyone to get involved! 👗 @Castleview_PS pic.twitter.com/Bby6JKzUJz — Miss White (@MissWhiteCV) October 27, 2021 -
దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్కి స్కర్టులతోనే వస్తాం!!
ఈ మధ్య స్పెయిన్లో ఓ ఉద్యమం ఊపందుకుంటోంది. ఓ స్కూల్ విద్యార్ధులు, ఉపాధ్యాయులు లింగ సమానత్వం పేరుతో ఓ వినూత్న సందేశాన్ని ప్రచారం చేస్తున్నారు. అది ఓ ఉద్యమంగా అక్కడ కొనసాగుతోంది. Wear a Skirt to School campaign: యూకే మిర్రర్ నివేదిక ప్రకారం.. కొన్ని నెలల ముందు ఎడన్బర్గ్లోని కాసిల్వ్యూ ప్రైమరీ స్కూల్కి చెందిన 15 ఏళ్ల మైకెల్ గొమెజ్ అనే విద్యార్థి స్కర్టు ధరించి పాఠశాలకు వచ్చినందుకు స్కూల్ యాజమాన్యం బయటికి వెళ్లగొట్టింది. దీంతో ధరించే దుస్తులకు లింగ భేదం ఉండదనే స్లోగన్తో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు అందరూ స్కూలుకు స్కర్టులతో రావడం ప్రారంభించారట. ఇదంతా సదరు విద్యార్ధికి మద్ధతు తెల్పాలనే ఉద్దేశ్యంతో ‘వేర్ ఎ స్కర్ట్ టు స్కూల్’ను ఉద్యమంగా చేపట్టారు. మూస పద్ధతులను బద్ధలు కొట్టాలనే నెపంతో ఈ చర్యకు పూనుకున్నట్లు అక్కడి ఉపాధ్యాయులు చెబుతున్నారు. బలవంతంగా స్కర్టులు ధరించమని ఎవ్వరికీ చెప్పం. అది పూర్తిగా విద్యార్ధుల ఇష్టానికే వదిలివేశామని అంటున్నారు. ఐతే ఈ వింత పోకడను కొందరు తల్లిదండ్రులు ప్రశంసిస్తుంటే, మరికొందరేమో బుగ్గలు నొక్కుకుంటున్నారు. చదవండి: 1.5 లీటర్ల కోల్డ్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే.. -
స్కర్ట్స్ వేసుకునేవారు.. గంగాజలాన్ని గౌరవిస్తున్నారు
న్యూఢిల్లీ : ఎన్ని విమర్శలు వచ్చినా మగానుభావులు మాత్రం మారడం లేదు. నిన్ననే కాంగ్రెస్ మిత్రపక్షం నేత ఒకరు స్మృతి ఇరానీ గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసి అగ్గి రాజేశాడు. అది ఇంకా పూర్తిగా ఆరకముందే ఈ రోజు బీజేపీ నాయకులు రెడీ అయిపోయారు. ప్రియాంక గాంధీని ఉద్దేశిస్తూ స్కర్ట్స్ ధరించే వారు ఇప్పుడు చీరలు కట్టుకుని ఆలయాలకు వెళ్తున్నారు. గంగానదికి పూజలు చేస్తున్నారంటూ బీజేపీ నాయకుడు జయకరణ్ గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితమే ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లో ర్యాలీలు, బోటు యాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ పలు ఆలయాలను సందర్శించడమే కాక గంగానదికి పూజలు చేసి హారతి కూడా ఇచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జయకరణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జయకరణ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘అచ్చెదిన్ ఎక్కడ అని ప్రశ్నించే కాంగ్రెస్ నాయకులు దాన్ని చూడటంలేదు. గతంలో స్కర్ట్స్ వేసుకుని ఆలయాలకు వెళ్లి గంగానదిని అగౌరవపర్చిన వారు నేడు చీరలు ధరించి అదే గంగానదికి పూజలు చేసి మర్యాద ఇస్తున్నారు’ అని పేర్కొన్నారు. అయితే జయకరణ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతమైన ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో జయకరణ్ తాను ప్రత్యేకంగా ఏ రాజకీయనాయకుడి పేరుని పేర్కొనలేదని.. జనరల్గా చెప్పానని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో ప్రియాంక గాంధీ, సోనియా గాంధీని విమర్శించే వారి జాబితాలో జయకరణ్ కూడా చేరారు. -
వహ్వాళి
పండగ వేళ అమ్మాయిలునట్టింట తిరగాడుతూ ఉంటే..ఆ ఇంట లక్ష్మీ కళ తొణికిసలాడుతుంది. దీపకాంతులతో పోటీపడుతూ అమ్మాయిలు లంగా ఓణీలతో ముస్తాబు అయితే..స్వయంగా లక్ష్మీదేవియే నట్టింట్లో కోటికాంతులై కొలువుదీరుతుంది. చూపుల తోరణాలన్నీఈ దీపావళి వేళ వహ్వాళి అనకుండా ఉండలేవు. సంప్రదాయ వేడుక అంటే చాలు ఈ తరం అమ్మాయిలతో పాటు యంగ్ అమ్మలు కూడా ముచ్చటపడి ధరించే దుస్తులు లంగా ఓణీలు. వీటిని పండగ వేళ మరికాస్త కళగా ఇలా ధరించవచ్చు. సిల్క్ శాటిన్ ఈ లెహెంగాలన్నీ సిల్క్ శాటిన్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసినవి. రాసిల్క్, వెల్వెట్..తో డిజైన్ చేసిన లెహంగాలు బరువుగా ఉంటాయి. అదే, సిల్క్ శాటిన్ అయితే మంచి ఫాల్ ఉండటంతో పాటు ఫ్యాబ్రిక్ బరువు ఉండదు. ఈ ఫ్యాబ్రిక్ కలర్స్ లుక్ని మరింత బ్రైట్గా మార్చేస్తాయి. ఈ లెహెంగాల మీద జర్దోసీ, సీక్వెన్స్, థ్రెడ్, గోల్డ్ జరీతో పూర్తిగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయడంతో గ్రాండ్గా మెరిసిపోతున్నాయి. నాటి కాలంలో బాగా ఆకట్టుకున్న మోటివ్ డిజైన్స్లో మార్పులు తీసుకొచ్చి ఎంబ్రాయిడరీ చేయడంతో వీటికి మరింత కళ వచ్చింది. నెటెడ్ దుపట్టా జర్దోసీ, గోల్డ్ జరీతో ఎంబ్రాయిడరీ చేసిన నెటెడ్ దుపట్టాలు ఇవన్నీ. లెహెంగా– బ్లౌజ్కు మరింత కాంతిమంతమైన లుక్ రావాలంటే దుపట్టా కలర్కాంబినేషన్ ఎంపికలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పండగ లేదా వేడుక సందర్భాన్ని బట్టి ఇలాంటి రంగుల కాంబినేషన్లో డిజైన్ చేయించుకోవచ్చు. సిల్క్ చందేరీ బ్లౌజ్ బాడీ పార్ట్ మొత్తం చెక్స్ ఉన్న సిల్క్ చందేరీ ఫ్యాబ్రిక్ను తీసుకున్నాం. చేతుల భాగాన్ని పూర్తి ఎంబ్రాయిడరీ చేశాం. రంగుల ముచ్చట సాధారణంగా లంగాఓణీ ధరించేవారు లెహెంగా రంగులోనే జాకెట్టు కూడా ఎంపిక చేసుకుంటారు. కానీ లంగా, ఓణీ, జాకెట్టు.. ఇలా మూడూ మూడు విభిన్నరంగుల కాంబినేషన్లోనూ ధరించవచ్చు. ఫ్యాబ్రిక్స్లోనూ ఆ తేడా చూపించవచ్చు. ఇక్కడ ఇచ్చిన డిజైనర్ లంగా ఓణీలకు సిల్క్ శాటిన్, నెటెడ్, చెక్స్ చందేరీ క్లాత్లను ఉపయోగించాను. మూడు ముచ్చటైన రంగుల కాంబినేషన్తో డిజైన్ చేస్తే వచ్చిన లంగా ఓణీ కళ ఇది. భార్గవి కూనమ్ ఫ్యాషన్ డిజైనర్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
’కురచ దుస్తులు వేసుకోవద్దు’
ఆగ్రా: కురచ దుస్తులు ధరించవద్దని, రాత్రి సమయంలో ఒంటరిగా తిరగొద్దని టూరిస్టులకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ సూచించారు. పర్యాటల భద్రత గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ... ‘విమానాశ్రయంలో దిగగానే పర్యాటకులకు వెల్కం కిట్ అందజేస్తాం. పర్యాటక ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కార్డు కూడా ఇందులో ఉంటుంది. చిన్న పట్టణాల్లో రాత్రి సమయంలో ఒంటరిగా తిరగొద్దు. కురచ దుస్తులు ధరించొద్దు. మీరు వినియోగించే కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఫొటో తీసి మీ స్నేహితులకు పంపాలనే జాగ్రత్తలు ఇందులో రాసివుంటాయ’ని మహేశ్ శర్మ తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. సమాజ్వాది పార్టీ రెండుగా చీలిపోయిందన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి అవినీతిలో కూరుకుపోయారని, ఆమెకు జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement