-
వికేంద్రీకరణే ఉత్తమం
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకరించేలా చూశారని.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తీవ్ర అన్యాయం చేయతలపెట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. రాజధాని పేరుతో గత ప్రభుత్వం ప్రజల్ని దగా చేసిందని ఆరోపించారు. రాజధాని అంశంపై శాసనసభలో మంగళవారం జరిగిన స్వల్ప కాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ.. అఖిలపక్షాలతో కనీసం సంప్రదించకుండా రాజధానిపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విరుచుకుపడ్డారు. గతంలో అభివృద్ధి అంతా హైదరాబాద్లోనే కేంద్రీకరించడంవల్ల రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయామని ఆయన గుర్తుచేశారు. కానీ.. చంద్రబాబు అదేమీ పట్టించుకోకుండా అమరావతిపైనే దృష్టిపెట్టారన్నారు. అంతేకాక.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి గురించి కూడా ఏమాత్రం ఆలోచించలేదన్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇచ్చిన 23 ఉన్నత సంస్థల్లో ఒక్కటైనా సరే శ్రీకాకుళం జిల్లాకు ఎందుకు కేటాయించలేదని చంద్రబాబును ధర్మాన నిలదీశారు. దాదాపు 2 లక్షల మంది శ్రీకాకుళం జిల్లా వాసులు ఇతర ప్రాంతాల్లో వలస కూలీలుగా బతుకులు వెళ్లదీస్తున్న దీనస్థితిని ఆయన ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. శివరామకృష్ణన్ సిఫార్సులు పట్టించుకోలేదు కాగా, సాగు భూములకు భంగం కలిగించవద్దని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, అభివృద్ధిని కేంద్రీకరించవద్దని, ప్రకృతి వైపరీత్యాల ముప్పును పరిగణనలోకి తీసుకోవాలని, నిర్మాణ వ్యయం కనీస స్థాయిలో ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు చేసిందని ధర్మాన గుర్తుచేశారు. కానీ, వాటిలో ఏ ఒక్కటీ కూడా పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు రాజధానిని నిర్ణయించారని తీవ్రంగా మండిపడ్డారు. లోక కల్యాణమా.. లోకేశ్ కల్యాణమా.. సింగపూర్ కంపెనీతో ఏకపక్షంగా ఒప్పందం కుదుర్చుకుని వారికి రూ.16వేల కోట్ల విలువైన 1,600 ఎకరాల భూమి ఇచ్చేందుకు అంగీకరించడం కంటే బరితెగింపు మరొకటి ఉంటుందా అని ధర్మాన ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో నిర్మించిన రాజధానులన్నీ కూడా 115 చదరపు.కి.మీ. నుంచి 425 చ.కి.మీ. పరిధిలోనే ఉంటే.. చంద్రబాబు మాత్రం ఏకంగా 8,603 చ.కి.మీ. మేర భూమిని సమీకరించడం ఏమిటన్నారు. సీఆర్డీఏకు చంద్రబాబు చైర్మన్గా ఉంటూ చేసిన నిర్ణయాలను ఆయన అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదంతా లోక కల్యాణం కోసమా లేక లోకేశ్ కల్యాణం కోసమా అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అమరావతి పేరుతో జరిగిన దోపిడీకి తెరదించి అభివృద్ధిని రాష్ట్రమంతటా వికేంద్రీకరించాలని సీఎం వైఎస్ జగన్ను ధర్మాన కోరారు. కాగా, సీఎంగా వైఎస్ జగన్ తొలిసారి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చి కిడ్నీ వ్యాధులతో అల్లాడుతున్న ఉద్దానం ప్రాంతానికి ఓ భారీ రక్షిత మంచినీటి ప్రాజెక్టు, మత్స్యకారుల కోసం జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమని ధర్మాన కొనియాడారు. ధర్మాన సంధించిన ప్రశ్నలు.. ►వేలకు వేల ఎకరాలు తీసుకుని రైతుల నోట్లో మట్టి కొట్టడం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? ►ఎన్ని సంవత్సరాలకు ప్రణాళిక వేశారు.. 53 వేల ఎకరాల్లో మీరు తాపత్రయపడి ఖర్చుపెట్టింది ఎంత.. ఐదు వేల కోట్లు.. ఏమిటిది? ►ఐదేళ్లలో ఐదు వేల కోట్లే పెట్టారంటే.. మీరు చూపించిన రాజధానిని ఎన్ని సంవత్సరాల్లో కడతారు? ►ఆచరణలో సాధ్యం కాని అంశాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇది కాదని మీరు చెప్పగలారా? ►ఇక్కడ రాజధానికే డబ్బంతా పెట్టేస్తే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఈ విషయం ఆలోచించలేదా? ►అమరావతినే అభివృద్ధి చేసి, దాని ద్వారా ప్రయోజనం పొందాలనేది తప్ప ఏముంది ఇందులో? ►రాజధానిపై తీసుకునే కీలక నిర్ణయాలు రాజ్యాంగ పరిధిలో ఉండాలి. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలని మీకు తెలియదా? ►అమరావతిపై అన్ని ప్రాంతాల్లో అసంతృప్తులు ఉన్నాయి. రాజకీయ పార్టీలు, మేధావుల నుంచి కనీస అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు? ►రాజధానిపై శివరామకృష్ణ కమిటీ నివేదిక వచ్చే వరకు కూడా ఎందుకు ఆగలేకపోయారు? ►రాయలసీమ, ఉత్తరాంధ్రలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు 10 ఎకరాలకు మించి భూమి అందుబాటులో లేదని ఆ కమిటీకి చెప్పి ఎందుకు సహాయ నిరాకరణ చేశారు? ►ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి ఉంటే.. విభజన జరిగినా మనకు ఆవేదన ఉండేది కాదు. కానీ అలా ఎందుకు జరగలేదు? -
రాష్ట్ర సర్కారే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయితే .....
ఏపీ రాజధాని వ్యవహారం ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ గా మారింది. కమిటీలు, నిపుణులు జాన్తా నై... మా ప్రయోజనాలు సిద్ధించే చోటే మా రాజధాని అన్నట్టు తెలుగుదేశం నేతలు వ్యవహరిస్తున్నారు. నేలవిడిచి సాము చేస్తున్నట్టు వేలాది ఎకరాలు కావాలని చెబుతూ భూముల ధరలకు బూమ్ కల్పించే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ, గుంటూరుల మధ్య దూరం ముప్ఫై కిలోమీటర్లు. ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనుకూలమని ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా సెలవిస్తున్నారు. ఇక్కడ 30000 ఎకరాలు కావాలని కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ అదే సమయంలో చుక్కలనంటిన భూముల ధరలను సేకరించడం సులభం కాదనే విషయాన్ని ఆయనే అంగీకరిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలతో అనవసరంగా భూముల ధరలకు రెక్కలు వచ్చి, సామాన్యులు గజం భూమి కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది. నిజానికి ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన భవనాలు నిర్మించడానికి గట్టిగా 200 ఎకరాలు సరిపోతుందని శివరామకృష్ణన్ కమిటీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఎక్కడైతే ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తుందో ఆ ప్రాంతానికి దాదాపు నలభై, యాభై కిలోమీటర్ల విస్తీర్ణంలోని చుట్టుపక్కల ప్రాంతాలు సమీప భవిష్యత్ లో అభివృద్ధి జరగడం ఖాయం. ఆ అభివృద్ధిని చేసేందుకు ప్రభుత్వం పూనుకోనవసరం లేదు. అవసరమైన ప్రణాళికలేంటనే విషయాల పట్ల ప్రభుత్వం చొరవ తీసుకుంటే సరిపోతుంది. ఒక కొత్త మహా నగరాన్ని సృష్టించాలనే ఆలోచన కంటే... ఉన్న భూముల్లో పరిపాలనా వ్యవహారాలకు అవసరమైన నిర్మాణాలు చేసి.. ఆ తర్వాత వచ్చే భారీ ప్రాజెక్టులకు ఎక్కడ భూములు కేటాయించాలనే విషయాలపై దృష్టిపెట్టడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ప్రభుత్వం ఈ విషయాలన్నీ పక్కన పెట్టి కేవలం ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ క్యాపిటలిస్టులా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు నానాటికీ జోరందుకుంటున్నాయి. ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలనో కాపాడేందుకు నడుం కట్టనవసరం లేదని, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటే మంచిదని ప్రజలు అంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- ఈసారి ఓటు మార్పు కోసమే
- మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
- కృష్ణమ్మ తీరం విజయహారం
- వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
- గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
- పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
- Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
- వంట సరిగా చేయలేదని.. భార్యను చంపిన భర్త
Advertisement