-
యాచకుడే దాతగా మారిన వేళ.. రూ.2 లక్షల విరాళం
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): యాచకుడే దాతగా మారాడు...ఆంధ్రా షిరిడీ ముత్యాలంపాడు శ్రీషిరిడీ సాయిబాబా మందిరంలో లోక కల్యాణార్ధం చేపట్టిన కోటి రుద్రాక్ష అభిషేక, అర్చనకు రూ.2లక్షల విరాళమిచ్చాడు. ఆలయంలో 2023 మార్చి 28న తలపెట్టిన ఈ కార్యక్రమానికి యాచకుడు యాదిరెడ్డి గురువారం రూ.2 లక్షల విరాళాన్ని మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డికి అందజేశాడు. యాదిరెడ్డి గతంలో మందిరంలో గోశాల, దత్తాత్రేయస్వామివారికి వెండి ఆభరణాలు, నిత్యాన్నదానం తదితర కార్యక్రమాలకు రూ.9 లక్షలు విరాళంగా ఇచ్చాడు. -
షిర్డీ ఆలయానికి భారీగా ఆదాయం.. మూడు రోజుల్లోనే రూ. 5 కోట్లు
షిర్డీ: ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో ఇటీవల మూడు రోజులపాటు జరిగిన గురుపౌర్ణమి ఉత్సవాల్లో భక్తులు భారీగా విరాళాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు హుండీలో నగదు, బంగారు, వెండి వస్తువులు, కౌంటర్లవద్ద చెక్కులు, వివిధ రకాల చెల్లింపుల ద్వారా బాబా ఆలయ సంస్ధాన్కు ఏకంగా రూ.5.57 కోట్లు విరాళాలు వచ్చాయి. ఏటా షిర్డీ పుణ్యక్షేత్రంలో గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్వల్ల ఆలయం మూసి ఉంచడంతో వివిధ పండుగలకు, ఉత్సవాలకు భక్తులు రాలేకపోయారు. ఈ ఏడాది కరోనా వైరస్ నియంత్రణలోకి రావడంతో ప్రభుత్వం లాక్డౌన్ అంక్షలన్నీ ఎత్తివేసింది. ఆ తరువాత గురుపౌర్ణమి ఉత్సవాలు జరగడంతో భక్తులు పోటీపడుతూ షిర్డీకి చేరుకున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్సహా దేశంలోని వివిధ ప్రాంతాలు, నలుమూలల నుంచి సుమారు మూడు లక్షలకుపైగా భక్తులు వచ్చి బాబా సమాధిని దర్శించుకున్నారు. మూడు రోజులపాటు షిర్డీ పుణ్యక్షేత్రం భక్తులతో పులకించిపోయింది. ఈ సందర్భంగా బాబా సమాధి ఆలయంలో, పరిసరాల్లో ఏర్పాటు చేసిన హుండీలలో భక్తులు భారీగా విరాళాలు సమర్పించుకున్నా రు. గురుపౌర్ణమి ఉత్సవాలు ముగిసిన తరువాత హుండీలలో సమర్పించిన నగదు, బంగారు, వెండి వస్తువుల రూపంలో సమర్పించిన కానుకలు, విరాళాలు సేకరించే కౌంటర్లవద్ద భక్తులు చెల్లింపులను లెక్కించారు. అందులో సుమారు రూ.5.57 కోట్లు విరాళాలు వచ్చినట్లు బాబా సంస్ధాన్ తెలిపింది. ఇందులో హుండీలలో రూ.2,16,84,939 నగదు, విరాళాలు సేకరించే కౌంటర్లవద్ద రూ.1,59, 18,974 నగదు, అదేవిధంగా చెక్, డీ.డీ., మనీ అర్డర్, డెబిట్, క్రెడిట్ కార్డు, ఆన్లైన్ చెల్లింపుల ద్వారా రూ.1,36,38,000 మేర వచ్చాయి. విదేశీ కరెన్సీ రూపంలో రూ.19,80,094 వచ్చాయి. అలాగే రూ.22.14 లక్షల విలువచేసే 479.500 గ్రాముల బంగారం, రూ.3.22 లక్షలు విలువ చేసే 8,067.800 గ్రాముల వెండి వస్తువులున్నాయి. 1.35 లక్షల హెక్టార్లలో పంటనష్టం: ఫడ్నవీస్ నాగ్పూర్/చంద్రాపూర్: వరదల కారణంగా నాగ్పూర్ డివిజన్లో దాదాపు 1,35,000 హె క్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం తెలిపారు. హింగ్ఘాట్, చంద్రాపూర్ జిల్లాల్లో మంగళవారం వర్ష ప్రభావిత గ్రామాలను సందర్శించిన అనంతరం ఫడ్నవీస్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగ్పూర్ డివిజన్లో ముఖ్యంగా చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని చెప్పారు. ప్రాథమిక పరిశీలన ప్రకారం నాగ్పూర్ డివిజన్లో వరదలతో 1,35,000 హెక్టార్ల భూమిలో పంటలు దెబ్బతిన్నాయని, పంట నష్టాలపై సర్వే జరుగుతోందని, వీలైనంత త్వరగా నష్టపరిహారం అందించేందుకు యంత్రాంగం కృషి చేస్తున్నదన్నారు. అలాగే జిల్లాలోని చిమూర్ తహసీల్లోని నవేగావ్ (పేథ్)లో పంట నష్టాన్ని కూడా ఫడ్నవీస్ పరిశీలించారు. -
ఆమె గళమే ఒక అర్చన...
Devotional Singer Kavita Paudwal Birthday Special: మీరు విఘ్నేశ్వరుని భక్తులా? నిన్న మొన్న విడుదలైన అనురాధా పౌడ్వాల్ భజన‘మంగళకర్త సుఖ్ కే దాతా’ వినండి. ఆదిశక్తిని స్తోత్రించాలా?‘అంబే తూహై జగదంబే కాళీ’ వినండి. సాయి బాబా భక్తులైతే అనురాధా పౌడ్వాల్ పాడిన ‘షిర్డీ సాయిబాబా అమృత్వాణి’ ఉంది. అనురాధా పౌడ్వాల్ సినీ గాయనిగా ఎంత ఉల్లాసాన్ని పంచిందో భక్తి గాయనిగా అంత ఆధ్యాత్మికతనూ పంచింది. ఆమె కుమార్తె కవితా పౌడ్వాల్ ఇప్పుడు దేశంలో ప్రఖ్యాత భక్తి గాయని. దేశం అభిమానించే ఈ గొప్పగాయని 68వ పుట్టినరోజు నేడు. తెలుగువారిలో సాయిభక్తులకు అనురాధా పౌడ్వాల్ పాడిన ‘సాయి అమృతవాణి’ సుపరిచితం. తెలుగులో ఆమె పాడిన భక్తి గీతం అది. తెలుగులోనే కాదు టి–సిరీస్ చొరవతో సాయి భక్తి గీతాలను ఆమె అనేక భాషల్లో పాడింది. హిందీలో పాడిన భక్తి సంగీతం ఉత్తరాదిలో ఆమెను ఇంటింటి గాయనిగా చేసింది. ప్రతి ఉదయం ఆమె పాటతో నిద్ర లేచే కోట్లాది కుటుంబాలు ఉన్నాయి. ఆమె ముఖచిత్రం ముద్రించిన సిడిలు, డివిడిలు నేటికీ అమ్ముడుపోతున్నాయి. యూట్యూబ్లో ఆమె భక్తి పాటలకు లక్షలాది హిట్స్ ఉంటాయి. శివుడు, వైష్ణోదేవి, హనుమంతుడు, గణేశుడు, లక్ష్మీదేవి... ప్రతి దేవుడివి, దేవతవి భక్తి గీతాలు అనురాధ పౌడ్వాల్ పాడింది. సినిమా సంగీతంలో కెరీర్ పీక్లో ఉండగా వాటి నుంచి విరమించుకుని తన జీవితాన్ని భక్తి సంగీతానికే అంకితం చేస్తానని ప్రకటించిన గాయని అనురాధా పౌడ్వాల్. జాతకంలో ఉంది అనురాధా పౌడ్వాల్కు పాటలంటే ఆసక్తి ఉన్నా పాడాలని అనుకునేది కాదు. లతా మంగేశ్కర్ పాటలంటే మాత్రం చెవి కోసుకునేది. సరదాకి కాలేజీల్లో, కొన్ని స్టేజ్ షోలలో మైక్ అందుకునేది. అయితే టీనేజ్లో ఉండగా ఆమెకు న్యుమోనియా వచ్చి 40 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఊపిరి తిత్తులు శక్తికోల్పోయి ఆమె గొంతు పూర్తిగా పోయింది. ఆ సమయంలో ఆమెకు ధైర్యం కోసం మేనమామ ఒక టేప్ రికార్డర్, లతా పాటలున్న కేసెట్లు ఇచ్చి వెళ్లాడు. 40 రోజులు ఆ పాటలు వింటూనే జబ్బు నుంచి బయటపడింది. ఆ తర్వాత ఆమె గొంతులో ఒక మెలొడీ వచ్చిందని అనురాధా చెప్పుకుంది. లతాలాగా ప్లేబ్యాక్ సింగర్ కావాలని ఆమెకు ఉండేది. 18 ఏళ్లకు సంగీత సహాయకుడు అరుణ్ పౌడ్వాల్తో పెళ్లవగా అతడు ప్రోత్సహించేవాడు. ఒకసారి అతడు ఆమెను రికార్డింగ్ స్టూడియోకి తీసుకెళితే అక్కడ లతా పాడుతున్న పాటను క్షుణ్ణంగా గమనించిన అనురాధా ఆ తర్వాతి వారం ఆల్ ఇండియా రేడియో యువవాణిలో యథాతథంగా పాడి శ్రోతలను ఆకర్షించింది. మ్యూజిక్ డైరెక్టర్స్ ఆ ప్రోగ్రామ్ విని ఆమె గురించి ఆరా తీశారు. ఎస్.డి.బర్మన్ ఆమెతో ‘అభిమాన్’ సినిమాలో ఒక శ్లోకం కూడా పాడించాడు. అయితే ఆ తర్వాతి ప్రయాణం సులువు కాలేదు. ఆమెకు అవకాశాలు రాలేదు. ఒక జ్యోతిష్యుడి దగ్గరకు వెళితే ‘నువ్వు భవిష్యత్తులో భక్తిగాయనివి అవుతావు’ అని చెప్పాడు. అది విని అనురాధ ఏడ్చింది. ఎందుకంటే ఆమెకు ప్లేబ్యాక్ సింగర్ కావాలని ఉంది. ప్రతి పాటా పెనుగులాట సుభాష్ ఘాయ్ తీసిన ‘హీరో’లో ‘తూ మేరా జానూ హై’ పాట అనురాధా పౌడ్వాల్ పాడింది. ఆ పాట హిట్ అయ్యింది. ఆ తర్వాత ‘ఉత్సవ్’లో పాడింది. కాని ఆమెకు అవకాశాలు రాలేదు. ఆమెతో పాడించుకుంటే మొత్తం పాడించుకోండి... ఒకటి రెండు పాటలు ఆమెకు ఇచ్చి మిగిలినవి మా చేత పాడించుకోవాలనుకుంటే మేము పాడము అని ఆశా, లతా హెచ్చరిస్తే సంగీత దర్శకులు వెనుకంజ వేసేవారని అంటారు. దాంతో అనురాధ కేవలం ట్రాక్ సింగర్గా మిగలాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె విరక్తి చెంది భక్తి సంగీతంలోకి మళ్లుదామని ఎంత ప్రయత్నించినా మ్యూజిక్ కంపెనీలు ఆ సంగీతానికి మార్కెట్ లేదు అని తిరగ్గొట్టాయి. అప్పుడు అనురాధ పౌడ్వాల్ అప్పుడప్పుడే సంగీత రంగంలో ఎదుగుతున్న టి–సిరీస్ దగ్గరకు వెళ్లింది. దాని అధినేత గుల్షన్ కుమార్. అతడు ఆ సమయంలోనే నదీమ్– శ్రావణ్ చేత ఒక 30 పాటలు చేయించి (సమీర్ రాశాడు) వాటిని మూడు సినిమాలకు పంచి మహేశ్ భట్ చేత మూడు సినిమాలు తీయించాడు. అవే ఆషికీ, దిల్ హై కి మాన్తా నహీ, సడక్. ఆ పాటలన్నీ అనురాధా పౌడ్వాల్ చేత పాడించాడు. ఆ మూడు సినిమా లు సూపర్హిట్ అయ్యాయి. అనురాధ స్టార్గా అవతరించింది. మహా ప్రభావం అనురాధ పౌడ్వాల్, కుమార్ షాను, ఉదిత్ నారాయణ్ కలిసి ఆ సమయంలో సూపర్ హిట్స్ పాడారు. అనురాధ పాడిన ‘ధక్ ధక్ కర్నే లగా’ (బేటా) పాట మాధురి దీక్షిత్కు లైఫ్ ఇచ్చింది. ‘నజర్ కే సామ్నే జిగర్ కే పాస్’ (ఆషికీ) ‘ముఝె నీంద్ న ఆయే’ (దిల్), ‘కెహ్ దోకి తుమ్’ (తేజాబ్), ‘బహుత్ ప్యార్ కర్తేహై’ (సాజన్)... అనురాధా పౌడ్వాల్కు స్టార్డమ్ను తెచ్చి పెట్టాయి. గుల్షన్ కుమార్ సినిమాల మ్యూజిక్ రైట్స్ కొంటూ అనురాధా పౌడ్వాల్ చేతే పాడించాలని చెప్పడంతో లతా, ఆశాలు తెల్లముఖం వేయాల్సి వచ్చింది. మరోవైపు గుల్షన్ కుమార్ అనురాధా పౌడ్వాల్ ఫొటోతో భక్తి గీతాల క్యాసెట్లు రిలీజ్ చేసి ఆమెను ఇంటింటికి చేరువ చేశాడు. కాని 1997 లో కేవలం 41 ఏళ్ల వయసులో గుల్షన్ కుమార్ హత్యకు గురవడం అనురాధా పౌడ్వాల్ మానసిక స్థితిని గట్టి దెబ్బ కొట్టింది. అప్పటికే ఆమె కేవలం టి–సిరీస్కే పాడతాను అని ప్రకటించి ఉండటంతో అల్కా యాగ్నిక్ పుంజుకుంది. దాంతో అనురాధ మరోసారి భక్తి వైపు మనసు లగ్నం చేసి ఆ సంగీతానికి అంకితమైంది. మళ్లీ సినిమా సంగీతం వైపు రాలేదు. భర్త, కుమారుడు అకాల మరణం చెందడం అనురాధ జీవితంలో పెను విషాదం. ఆమె కుమార్తె కవిత పౌడ్వాల్ సినీ సంగీతం వైపు రాక తల్లిలాగే భక్తి సంగీతంలో కొనసాగుతూ ఉంది. అనురాధ అరాధనా స్వరం కొనసాగాలని కోరుకుందాం. -
శిరిడి సాయిబాబా ఆలయం మూసివేత
-
పిలిస్తే పలుకుతా..!
దైవం మానుష రూపేణా... అన్నదానికి నిలువెత్తు నిదర్శనం షిరిడీ సాయి జీవితం. బాబా బోధల్లో దానధర్మాలు చేయడం, ఇతరులకు ఆపద సమయంలో సాయం చేయడం ప్రధానమైనవి. ఎప్పుడూ సత్యం మాట్లాడాలి. ధర్మమార్గాన్ని అనుసరించాలి. దొంగతనం, వ్యభిచారం చేయరాదు. మూఢనమ్మకాలను, మూర్ఖపు ఆలోచనలు విడిచిపెట్టాలి. సమాజ శ్రేయస్సుకు తోడ్పడే శుభకార్యాలు ఆచరించాలి. అయితే మంచి చేయకుండా కొందరు అంతరాయాలు కల్పిస్తారు కాబట్టి కార్యం పూర్తయ్యే వరకూ గుప్తంగా ఉంచటం మంచిది. హింసతో చేసినది ఎంతటి మహత్కార్యమైనా అది శుభప్రదం కాదు. కనుక ఏ పనిలోనూ హింసకు తావివ్వరాదు. అహంకారాన్ని పరిత్యజించాలి. అహంకారాన్ని వదలిపెట్టకుండా షిరిడీ వచ్చినా ప్రయోజ నం శూన్యం. మంచిపనులకు ఫలం సుఖం రూపంలోనూ, చెడుపనులకు ఫలం కష్టం రూపంలోనూ అనుభవించవలసి ఉంటుంది. అయితే ఆయన చెప్పేది ఒకటే, జలతారు వస్త్రం ఇవ్వడానికి తాను సిద్ధపడితే గుడ్డపీలికలు కోరుకోవద్దంటాడు. అంటే ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో తనకు తెలుసునని, అల్పమైన కోరికలు కోరకుండా, ఆత్మజ్ఞానం కలగాలని కోరుకున్న వారికి తాను అన్నీ ఒసగుతానంటాడు. మొక్కులు మొక్కి, అది తీరగానే అది చేస్తాం యిది చేస్తాం అని ఆ తర్వాత ముఖం చాటేసేవారిని సాయినాథుడు వదలడు. వారినుంచి తనకు రావలసిన బాకీని బహుచక్కగా వసూలు చేసుకుంటాడు. సమాధి నుంచే తాను భక్తులు కోరిన కోరికలు తీరుస్తానని చెప్పిన సాయిభగవానుడు తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం ఒక్కనాటికి కూడా మరచిపోలేదు. ఆయన మహా సమాధి చెంది వందేళ్లు గడుస్తున్నా, ప్రశాంత చిత్తంతో మొరపెట్టుకుంటే చాలు... భక్తుల మొర ఆలకిస్తాడు. కోరినది ఇస్తాడు. అందుకు ఆయన భక్తులే సాక్షులు. సాయిబాటలో నడవాలంటే ముందుగా సాటి మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకోవాలి. హింసతో కూడుకున్నది ఎంతటి మహత్కార్యమైనా అది శుభప్రదం కాదు. కనుక ఏ పనిలోనూ హింసకు తావివ్వరాదు. అహంకారాన్ని వదలిపెట్టకుండా షిరిడీ వచ్చినా ప్రయోజ నం శూన్యం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement