-
ఐదు నెలల్లోనే అంచనా వేయొద్దు
మందమర్రి : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు మాత్రమే అయిందని, అప్పుడే ప్రభుత్వ పనితీరుపై అంచనా వేయొద్దని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి అన్నారు. ఆదివారం మందమర్రిలో నిర్వహించిన తెలంగాణ వికాస సమితి మొదటి జిల్లా మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 54 శాతం విద్యుత్ తెలంగాణకు ఇవ్వాల్సి ఉండగా చంద్రబాబు అవలంభిస్తున్న నీతిమాలిన రాజకీయాలతో ఈ ప్రాంతానికి కరెంటు తిప్పలు తప్పడం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో పాలన సక్రమంగా లేదని ప్రచారం చేసేందుకు సీమాంధ్ర నాయకులు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల నిత్యానందరెడ్డిపై జరిగిన కాల్పులను సాకుగా చూపుతూ హైదరాబాద్లో ఉండేవారికి రక్షణ లేదంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణాలో వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్యపర్చాల్సిన బాధ్యత తెలంగాణ వికాస సమితిపై ఉందని అన్నారు. చెరువుల ద్వారానే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమని ప్రభుత్వ ఓఎస్డీ దేశ్పతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధించుకున్నా సీమాంధ్ర భావజాలం ఇప్పటికీ కొనసాగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి గని కార్మికుల పోరాట పటిమను ఎన్నటికీ మరిచిపోలేమని చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. సభకు తెలంగాణ వికాస సమితి జిల్లా అధ్యక్షుడు సుందిళ్ల రాజయ్య అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి హెచ్.రవీందర్ పలు తీర్మానాలు ప్రతిపాదించారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ వినయ్బాబు, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సీతారామారావు, సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, కరీంనగర్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ రమేశ్, భిక్ష పతి పాల్గొన్నారు. -
అప్పుడు సీమాంధ్ర నేతలెవ్వరు మాట్లాడలేదే ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక సమైక్య పార్టీ పెట్టడంలో అర్థం లేదని జై ఆంధ్ర ఉద్యమ నేత, మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత 20 రోజుల వరకు సీమాంధ్ర నేతలెవ్వరూ మాట్లాడలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అటు విద్యార్థులు, ఇటు ఎన్జీవోలు సమైక్య ఉద్యమం చేశారని, ఆ తర్వాతే నేతలు రంగంలోకి దిగి ఢిల్లీలో ఉద్యమం మొదలు పెట్టారన్నారు. తెలంగాణ ఉద్యమం ఏర్పడకముందే జై ఆంధ్ర ఉద్యమం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర సమైక్యానికి ప్రతీకగా ఓ పార్టీ పెట్టేందుకు కిరణ్ సంకల్పించారు. ఆ క్రమంలో లోక్సభలో యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి సొంత పార్టీ నుంచి బహిష్కరణకు గురైన పలువురు ఎంపీలు ఆదివారం మాదాపూర్లో కిరణ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితులలో కొత్త పార్టీ రావాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. అలాగే సోమవారం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సిఎం కిరణ్ సమావేశమైయ్యారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజులలో సీఎం కిరణ్ కొత్త పార్టీ పేరు ప్రకటిస్తారని సమాచారం. అదికాక గతేడాది జులై 30న సీడబ్య్లుసీ రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో సీమాంధ్ర నేతలు ఎవ్వరు సీడబ్య్లసి నిర్ణయంపై ప్రతిఘటించలేదు. అయితే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంతంలో విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దాంతో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులలో కదలిక వచ్చిన సంగతి తెలిసిందే. -
సీమాంధ్ర నేతల ఇళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం
హైదరాబాద్: లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో సీమాంధ్ర నేతల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. నెల్లూరులోని కేంద్ర మంత్రి పనబాకలక్ష్మి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఇళ్ల వద్ద భద్రత పెంచారు. సమైక్యవాదులు వీరి ఇళ్లను ముట్టడించే అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. సమైక్యవాదానికి మద్దతివ్వకుండా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పనబాక లక్ష్మి పలుమార్లు స్పష్టం చేయడంతో ఆమె తీరును సమైక్యవాదులు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెల్లూరు, గూడూరు, కావలి, ఆత్మకూరు, నాయుడుపేట డివిజన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.తెలంగాణ బిల్లు మూజువాణి ఓటుతో లోక్ సభలో ఆమోదం పొందింది. -
రాజీనామాపై సీఎం ఊగిసలాట
హైదరాబాద్: రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన దరిమిలా సీఎం కిరణ్ కుమార్ తన రాజకీయ మార్గాన్ని అన్వేషించుకునే పనిలో పడ్డారు. ఈ రోజు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమైన కిరణ్ పలు విషయాలను చర్చించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సమైక్యవాదిగా నిరూపించుకోవాలని ఉబలాటపడుతున్నా, నేతల నుంచి పూర్తి స్థాయి హామీ లభించకపోవడంతో కొంత డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నారు. కొత్త పార్టీ అంశంపై ఎమ్మెల్యేల నుంచి మిశ్రమ స్పందనలే లభించడంతో రాజీనామా చేసేందుకు వెనుకడుగువేస్తున్నారు. తాను చేపట్టబోయే భవిష్య కార్యాచరణపై ఒక్కొక్కరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నా.. ఆ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. రాజీనామాను ఎప్పుడో చేయాల్సిందని కొంతమంది నేతలు చెప్పగా, ఇప్పుడు చేసినా ఏమీ లాభం ఉండదని మరికొందరు సీఎంకు తెలిపారు. కాగా, రాజకీయ నాయకుడిగా మిగలాలంటే..రాజీనామానే సరైన మార్గమని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. -
సీఎంకు సీమాంధ్ర నేతల ఝలక్!
హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన దరిమిలా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేయనున్నారు? బిల్లు భవితవ్యం సోమ, మంగళవారాల్లో తేలిపోయేలా కన్పిస్తుండటంతో వారంతా భావి కార్యాచరణపై దృష్టి సారించారు. రెండు రోజులుగా తనను కలుస్తున్న వారికి కిరణ్ ఇదే మాట చెబుతున్నారు. ‘ఇంకా పదవిలో ఉండాలని నాకు లేదు. రాజీనామా చేయాలనే ఉంది. కానీ అందరం కలిసే నిర్ణయం తీసుకుందాం. సమష్టిగా ముందుకు వెళ్దాం’ అంటున్నారు. ఇప్పటికే పలువురు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కిరణ్ దఫదఫాలుగా మంతనాలు జరిపారు. ఆదివారం కూడా సీఎం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో సీమాంధ్ర నేతలు గైర్హజరయ్యారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి 25 మంది ఎమ్మెల్యేలు, 6గురు మంత్రులు మాత్రమే హాజరైయ్యారు. సీమాంధ్ర ప్రాంత్రంలో కాంగ్రెస్ పక్షాన ఉన్న 83 మందిలో 52 మంది సమావేశానికి హాజరు కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ రోజు జరిగిన సమావేశంలో పాల్గొనని నేతలంతా కిరణ్ కు దూరంగా ఉండేందుకు సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement