-
ఇక ఉంటా.. మీ సైన్స్ ఎక్స్ప్రెస్
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం కారణంగా గతి తప్పుతున్న వాతావరణం.. ఫలితంగా ఏర్పడుతున్న దుష్ర్పభావాలు.. రాబోయే విపత్తులను ఎలా ఎదుర్కోవాలి? ఎలా అరికట్టాలన్న పరిష్కార మార్గాల విశేషాలతో కర్ణాటకలోని గుల్బర్గా నుంచి గార్లదిన్నె మండలంలోని కల్లూరు రైల్వే స్టేషన్కు చేరుకున్న సైన్స్ ఎక్స్ప్రెస్ రైలు.. మూడు రోజుల పాటు విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచింది. 16 బోగీలు కలిగిన ఈ ఏసీ రైలులో 15 బోగీల్లో విజ్ఞాన సమాచారంతో నింపేశారు. ఈ మూడురోజుల్లో జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన 17,897 మంది విద్యార్థులు ఈ రైలును సందర్శించారు. చివరి రోజు రైల్వే శాఖ అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ రాజేంద్రప్రసాద్ కూడా ఈ రైలును పరిశీలించారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఈ విజ్ఞాన భాండాగారం బెంగళూరులోని వైట్ఫీల్డ్కు బయలుదేరి వెళ్లిపోయింది. - గార్లదిన్నె (శింగనమల) -
వచ్చేసింది సైన్స్ ఎక్స్ప్రెస్
విజ్ఞానాన్ని, వినోదాన్ని మేళవిస్తూ కదిలే ‘సైన్స్ ఎక్స్ప్రెస్’ జహీరాబాద్కు చేరుకుంది. పన్నెండు బోగీలతో కూడిన ఈ రైలు విద్యార్థులను విశేషంగా అలరిస్తోంది. జహీరాబాద్: వాతావరణ పరిస్థితుల్లో కలుగుతున్న మార్పుల పర్యావరణానికి ఏ మేరకు ముప్పు వాటిల్లుతోందనే విషయాన్ని సైన్స్ రైలు చాటి చెప్పింది. శనివారం స్థానిక రైల్వే స్టేషన్లో 12 బోగీలతో వచ్చిన సైన్స్ రైలు ఎగ్జిబిషన్ను అధికారులు ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే ఏడీఆర్ఎం పీసీ టంటా, సైన్స్ అండ్ టెక్నాలజీ జీఎం కల్యాణ్చక్రవర్తి సైన్స్ రైలు ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. బోగీల్లో ఫొటో ప్రదర్శన సైన్స్ రైలులో ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రదర్శించేందుకు వీలుగా శాశ్వత ఫొటో ప్రదర్శనతో మొబైల్ రైలును రూపొందించారు. భారీగా తరలి వచ్చిన విద్యార్థులు సైన్స్ రైలు ప్రదర్శన మొదటి రోజు కావడంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్కు తరలి వచ్చారు. సాయంత్రం కొంత రద్దీ తక్కువగా ఉండడంతో విద్యార్థులు ఆసక్తితో వాటిని చూడగలిగారు. పలు అంశాలను తెలుసుకున్నా.. వాతావరణంలో వస్తున్న మార్పులు, భవిష్యత్తుపై ఏ మేరకు ప్రభావం పడుతుందనే విషయాన్ని ప్రదర్శన ద్వారా తెలుసుకున్నా. సైన్స్ ైరె లు మూలంగా అనేక విషయాల గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. -శిరీష, బ్రిలియంట్ స్కూల్ అన్ని విషయాలపై అవగాహన ఏర్పడింది సైన్స్ రైలులో ఏర్పాటు చేసిన ప్రదర్శనలన్నీ బాగున్నాయి. అన్ని విషయాలపై అవగాహన కలిగేందుకు ఉపయోగపడింది. -మహేశ్వరి, బాలికల ఉన్నత పాఠశాల పర్యావరణంతోనే మానవ మనుగడ పర్యావరణ పరిరక్షణతోనే జీవరాసుల మనుగడ ముడిపడి ఉంది. ప్రకృతికి కలుగుతున్న అనర్థాలకు గల కారణాలను ఎగ్జిబిట్ల ద్వారా తెలుసుకున్నా. నీటి సంరక్షణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల ఉపయోగాలు, ప్లాస్టిక్ వాడకంతో కలుగుతున్న అనర్థాల గురించిన ప్రదర్శన బాగుంది. -రేణుక, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఒక్కో బోగీలో ఒక్కో ప్రదర్శన * ఒకటో బోగీలో వాతావరణం, హరిత గృహ ప్రభావం, ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులను పొందుపర్చారు. మార్పులు ఎందుకు చోటుచేసుకుంటున్నాయో వివరించారు. * రెండో బోగీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తీరు, వర్ష రుతువులో వచ్చిన మార్పులు, సముద్రంలో నీటి పెరుగుదల గుర్తించడం వంటివి ప్రదర్శించారు. నీరు, వ్యవసాయం, అడవులు, జీవ వైవిధ్యం, ఆరోగ్యం, ప్రకృతి వైపరీత్యాలపై ప్రదర్శనలు ఉన్నాయి. * 3,4వ బోగీల్లో దైనందిన జీవితంలో మానవుడు అనుసరించాల్సిన విధానాల గురించి వివరించారు. * 5,6 బోగీల్లో దేశం చేపడుతున్న పలు విధానాలు, ఇంకుడుగుంతల నిర్మాణం, టెక్నాలజీని ఉపయోగించి ఉద్గారాలను తగ్గించడం, కార్బన్ను తగ్గించే విధానం తదితర వాటిని ప్రదర్శించారు. * 7వ బోగీలో వాతావరణ మార్పులపై అంతర్జాతీయ ఒప్పందాలు, లక్ష్యాలపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. * 8వ బోగీలో హ్యాండ్ ప్రింట్ గురించి వివరించారు. స్కూల్, రోడ్డు, ఆఫీసులలో ప్రతి వ్యక్తి ఏఏ అంశాలు చేయవచ్చో వివరించారు. * 9,10వ బోగీలో బయో టెక్నాలజీ గురించి ప్రదర్శించారు. జీవ సంపద కోసం బయో టెక్నాలజీ, ప్రకృతి సంరక్షణ, రసాయన ఎకొలజీ, భారత పరిశోధన-బయో టెక్నాలజీ విభాగం అభివృద్ధికి చేపట్టిన అంశాలను వివరించారు. * 11వ బోగీలో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా గుర్తించిన ఆవిష్కరణలు ప్రదర్శనలో ఉంచారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఆవిష్కరణలు, సైన్స ఎడ్యుకేషన్, డీఎస్టీ స్కాలర్షిప్లు, పథకాలు, టెక్నాలజీ కెరీర్ గురించి ప్రదర్శనలు ఉన్నాయి. * 12వ బోగీలో 4వ తరగతి లోపు ఉండే విద్యార్థుల కోసం ఆహ్లాదకరమైన కార్యాలు, విజ్ఞాన శాస్త్రం, లెక్కలు, పర్యావరణానికి సంబంధించిన ఆటలు, పజిల్స్, కిడ్స్ జోన్ ఏర్పాటు చేశారు. -
రాజమండ్రి రైల్వే స్టేషన్లో సైన్స్ ఎక్స్ప్రెస్
సైన్స్ ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం రాజమండ్రి రైల్వే స్టేషన్కు చేరుకుంది. మూడు రోజుల పాటు స్థానిక ప్రజలకు విజ్ఞాన విషయాలను పరిచయం చేయనుంది. 2015 అక్టోబర్లో ఢిల్లీలో ప్రారంభమైన ఈ రైలు దేశవ్యాప్తంగా 64 రైల్వే స్టేషన్లలో ఆగి సందర్శకులకు కనువిందు చేయనుంది. ఇందులో పర్యావరణ పరిరక్షణ, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలకు సంబంధించి చిత్రాలను ప్రదర్శనగా ఉంచారు. -
సైన్స్ ఎక్స్ప్రెస్ యాత్ర షురూ
న్యూఢిల్లీ: సైన్స్ ఎక్స్ప్రెస్ దేశవ్యాప్త యాత్ర ప్రారంభమైంది. స్థానిక సఫ్దర్జంగ్ స్టేషన్లో కేంద్ర మంత్రులు ఈ రైలును పచ్చజెండా ఊపి సోమవారం ప్రారంభించారు. 197రోజులపాటు సాగే యాత్రలో భాగంగా ఈ రైలు 20 రాష్ట్రాల్లో 57 స్టేషన్లలో ఆగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఆరో తేదీన గుజరాత్లోని గాంధీనగర్కు చేరుకున్న తర్వాత ఈ యాత్ర ముగుస్తుంది. కాగా ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ,పర్యావరణ, రైల్వే శాఖ మంత్రులు సంయుక్తంగా పాల్గొన్నారు. జీవవైవిధ్యం, సముద్ర జలచరాలకు సంబంధించిన బొమ్మలు, సమాచారం తదితరాలు ఇందులో అందుబాటులో ఉం టాయి. వాటి ఆవాసం, ఆహారపు అలవాట్లను కూడా అందులో పొందుపరిచారు. ఈ రైలు దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాలమీదుగా తనయాత్రను కొనసాగిస్తుంది. అయితే ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం వెళ్లదు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ ‘మన దేశంలో జీవవైవిధ్యానికి కొదవేలేదు. అయితే ఈ విశ్వంలోని భూమిలో మన వాటా కేవలం 2.5 శాతమే. అయినప్పటికీ జీవవైవిధ్యం వాటా ఎనిమిది శాతంగా ఉంది. దీనిని మనం మన ముందు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని విద్యార్థుల హృదయాలకు హత్తుకుపోయేవిధంగా తెలియజేయగలిగితే వారు ప్రకృతికి హాని కలగనివ్వరు’ అని అన్నారు. ఈ రైలు యాత్ర ఏడాదిపాటు కొనసాగేలా చూడాలని రైల్వే మంత్రికి సూచించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
Advertisement