-
మీ ఫోన్ పోయిందా?.. వెంటనే ఇలా బ్లాక్ చేసుకోండి.. అన్నీ సేఫ్..!
సాక్షి, హైదరాబాద్: మీ ఫోన్ ఈమధ్యే చోరీకి గురైందా? లేక ఎక్కడైనా పోగొట్టుకున్నారా? అందులోని డేటా దుర్వినియోగం కావొచ్చని ఆందోళన చెందుతున్నారా? ఇకపై మీకు ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఆ ముప్పు నుంచి మనల్ని బయటపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ను అందుబాటులోకి తెచి్చంది. దీని సాయంతో పోయిన లేదా చోరీకి గురైన ఫోన్ను ఇతరులు వాడకుండా మీరు బ్లాక్ చేయొచ్చు. ఎలా ఉపయోగించాలంటే.. మనం మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సీఈఐఆర్ పోర్టల్లోకి వెళ్లి దాన్ని బ్లాక్ చేయవచ్చు. అంటే మన ఫోన్ ఇతరుల చేతుల్లోకి వెళ్లినా అది పనిచేయకుండా మనం నియంత్రించవచ్చన్నమాట. దీంతోపాటు పోగొట్టుకున్న ఫోన్కు సంబంధించి పోలీసులకు ఇచి్చన ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫోన్ దొరికాక అన్బ్లాక్ సైతం చేసుకోవచ్చు. అయితే ఈ సేవలు పొందాలంటే ముందుగా కొన్ని వివరాలు తెలియజేయాలి. మీ మొబైల్ నంబర్, ఐఎంఈఐ నంబర్, మొబైల్ కొనుగోలు చేసిన ఇన్వాయిస్తోపాటు మీ సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాపీని సీఈఐఆర్ పోర్టల్లో జత చేయాలి. వివరాలన్నీ అప్లోడ్ చేస్తే సీఈఐఆర్ సెంట్రల్ డేటాబేస్లో అప్పటికే నమోదై ఉన్న సదరు ఫోన్ పనిచేయకుండా బ్లాక్ లిస్ట్లో పెడతారు. మన ఫిర్యాదు స్థితిని తెలుసుకొనే ఆప్షన్ సైతం ఈ పోర్టల్లో ఉంది. మార్చి 15 నుంచి అమల్లోకి.. వాస్తవానికి సీఈఐఆర్ సేవలను కేంద్ర ప్రభుత్వం 2019 చివర్లోనే ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచి్చంది. తొలుత కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి అక్కడ విజయవంతం అయ్యాక దశలవారీగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ వస్తోంది. మార్చి 15 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోనూ సీఈఐఆర్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ వెల్లడించింది. మార్చి 15 తర్వాత పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లకు సంబంధించి ఈ సేవలను వినియోగించుకోవచ్చు. పోలీసు సిబ్బంది ఈ సేవలు వాడాలి: డీజీపీ మొబైల్ఫోన్ చోరీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు చోరీ అయిన సెల్ఫోన్లను గుర్తించేందుకు సీఈఐఆర్ సేవలను వినియోగించుకోవాలని డీజీపీ అంజనీకుమార్ తాజాగా ఆదేశించారు. ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక పోలీసు అధికారిని నోడల్ అధికారిగా నియమిస్తామని... మరో 10 రోజుల్లో ఈ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. చదవండి: బీఆర్ఎస్ ఆఫీసులో రూ.75 కోట్లు ఇచ్చా: సుఖేశ్ చంద్రశేఖర్ -
ఐఫోన్లలోనే కాదు.. స్మార్ట్ ఫోన్లలో సైతం అదిరిపోయే ఫీచర్..
టెలికం రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 1జీ మొదులుకొని 2జీ, 3జీ, 4జీ అంటూ కొత్త కొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తెస్తున్నాయి. వినియోగదారుల జీవన విధానాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. త్వరలో 4జీ కంటే 10రెట్ల వేగంతో పనిచేసే 5జీ అందుబాటులోకి తేనున్నాయి. ఈ తరుణంలో టెలికం రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, లేటెస్ట్ టెక్నాలజీలను వినియోగంలోకి తెచ్చేందుకు అనుసరిస్తున్న ఆధునిక పద్ధతుల్ని..ఆకళింపు చేసుకుంటున్న స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు వాటిని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ మరికొద్ది రోజుల్లో విడుదల చేయనున్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ను యూజర్లకు పరిచయం చేయనుంది. తొలిసారి యాపిల్ ఈ శాటిలైట్ ఫీచర్పై వర్క్ చేస్తుండగా..ఇప్పుడు అదే దారిలో గూగుల్తో పాటు ఇతర సంస్థలు సైతం ఈ సరికొత్త ఫీచర్ను యూజర్లకు అందించనున్నాయి. గూగుల్ సైతం గూగుల్ ఆండ్రాయిడ్ వెర్షన్ డెవెలప్మెంట్ టీంలో కీలకంగా పనిచేస్తున్న Hiroshi Lockheimer యాపిల్ తన ఐఫోన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఎనేబుల్ చేయడంపై స్పందించారు. ఈ ఫీచర్ ఐఫోన్లలోనే కాకుండా.. వచ్చే ఏడాది విడుదల కానున్న ఆండ్రాయిడ్ 14లో ఎనేబుల్ చేసేందుకు గూగుల్, గూగుల్తో ఒప్పందమైన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. అయితే ఈ ఫీచర్ను అందుబాటులోకి వస్తే ఆండ్రాయిడ్ 13 కోసం సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేయడానికి, పాత వెర్షన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ను తెచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలన్ మస్క్ మహిమ ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్మార్ట్ ఫోన్లలో శాటిలైట్ కనెక్టివిటీకి ప్రాధాన్యం పెరిగింది. ఈ ఫీచర్ సాయంతో స్మార్ట్ ఫోన్ యూజర్లు నెట్ వర్క్ లేని ప్రాంతాల్లో సైతం టెక్ట్స్, కాల్స్ చేసుకునే సౌకర్యం ఉంది. శాటిలైట్ కనెక్టివిటీ ఎంపిక చేసిన దేశాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది. శాటిలైట్ నెట్ వర్క్లను ఆపరేట్ చేసేందుకు, వినియోగదారులకు అందుబాటులో తెచ్చేందుకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ ఫీచర్ ఎనేబుల్ అవుతుందా? లేదా అని తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సి ఉంటుందని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 సముద్రంలో పడిన ఐఫోన్, 'బ్రాండ్' బాబుకు దొరికిందోచ్! -
మీ ఫోన్లో యాప్స్ డిలీట్ చేసిన తర్వాత ఈ పని చేస్తున్నారా!
సాధారణంగా మన అవసరాన్ని బట్టి స్మార్ట్ ఫోన్లో యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుంటుంటాం. వాటితో మన అవసరం తీరిపోయిన వెంటనే డిలీట్ చేస్తాం. కానీ యాప్స్ డిలీట్ చేసినా వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు కొన్నిసార్లు ఇరిటేషన్ తెప్పిస్తుంటాయి. అరె! యాప్స్ అన్ ఇన్ స్టాల్ చేసినా నోటిఫికేషన్లు ఎందుకొస్తున్నాయని కంగారు పడిపోతుంటాం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే యూజర్లు యాప్స్ డిలీట్ చేసిన వెంటనే ఇంకో పనిచేయాల్సి ఉంటుంది. అదేంటంటే! స్మార్ట్ ఫోన్కి జీమెయిల్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. మరి యాప్స్ డిలీట్ చేస్తే..ఆ యాప్స్కు అటాచ్ అయిన జీమెయిల్ అకౌంట్ డిస్ కనెక్ట్ అవుతుందని అనుకుంటాం. కానీ అలా జరగదు. దీంతో ఈజీగా జీమెయిల్లో ఉన్న మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా లీక్ అవుతుంది. అందుకే యాప్స్ను అన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మ్యాన్యువల్గా స్మార్ట్ఫోన్లో యాప్స్కు కనెక్ట్ అయిన జీమెయిల్ అకౌంట్ను డిలీట్ చేయాలి. ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్లో యాప్స్కు కనెక్టైన జీమెయిల్ను ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. ►ముందుగా ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్లాలి ►అనంతరం సెట్టింగ్లో ఉన్న గూగుల్ ఆప్షన్పై క్లిక్ చేయాలి ►గూగుల్ ఆప్షన్ క్లిక్ చేస్తే కింద భాగంలో సెట్టింగ్స్ పర్ గూగుల్ యాప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ►క్లిక్ చేస్తే కనెక్టెడ్ యాప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ►ఆ కనెక్టెడ్ యాప్స్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ యాక్టీవ్గా జీ మెయిల్కు ఏ యాప్స్ అటాచై ఉన్నాయో తెలుస్తోంది. వెంటనే ఆ యాప్స్ మీద క్లిక్ చేసి జీమెయిల్ అకౌంట్ను డిస్ కనెక్ట్ చేసుకోవచ్చు. -
ఐపోన్ లవర్స్కు శుభవార్త, అమెజాన్లో ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్లు!!
యాపిల్ ఐపోన్ లవర్స్కు శుభవార్త. అమెజాన్ యాపిల్ ఐఫోన్ 13 కొనుగోలు దారులకు భారీ ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమెజాన్లో ఐఫోన్13 గరిష్ట రిటైల్ ధర రూ.79,900నుండి తగ్గించి రూ.74,900కు విక్రయిస్తోంది. అయితే వినియోగదారులు స్మార్ట్ఫోన్పై రూ.11,000 వరకు డిస్కౌంట్తో పాటు ఇతర ఆఫర్లను పొందవచ్చు. కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్తో ఐఫోన్ 13ను సొంతం చేసుకోవాలనుకుంటే క్యాష్బ్యాక్ రూపంలో రూ.6000 తగ్గింపు పొందవచ్చు. దీంతో ఐఫోన్ ధర రూ.68,900 ఉండనుంది. ఐఫోన్13 256జీబీ వేరియంట్ను రూ.78,900 తగ్గింపు ధరతో కొనుగోలు చేయడానికి కస్టమర్లు క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లను ఉపయోగించవచ్చు. 512జీబీ వేరియంట్ను రూ. 98,900 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ప్రకారం వినియోగదారులు ఐఫోన్13 కొనుగోలు చేసిన 90రోజులలోపు వారి క్రెడిట్ కార్డ్లకు లేదా బ్యాంక్ అకౌంట్లలో రూ.6వేలు జమ అవుతాయి. అంతే కాకుండా స్మార్ట్ఫోన్ కొనుగోలుపై అదనపు తగ్గింపు పొందడానికి కస్టమర్లు ఎక్ఛేంజ్ ఆఫర్ను పొందవచ్చు. అమెజాన్లో ఎక్ఛేంజ్ ఆఫర్ 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ వేరియంట్లతో సహా అన్ని మోడల్స్ కు వర్తిస్తుందని అమెజాన్ తెలిపింది. కస్టమర్లు తమ పాత స్మార్ట్ఫోన్ పై రూ.15,350 వరకు ఎక్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఎక్ఛేంజ్ స్మార్ట్ఫోన్ మోడల్పై ఆధారపడి ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో, ఆపిల్ ఐఫోన్ 13 కూడా రూ.5000 తగ్గింపుతో రూ.74,900కి విక్రయిస్తోంది. వాల్మార్ట్ యాజమాన్యంలో ఇ-కామర్స్ కంపెనీ ఐఫోన్ 13 కొనుగోలుపై 5శాతం క్యాష్బ్యాక్ పొందడానికి కస్టమర్లు యాక్సిస్ ఫ్లిప్కార్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లను ఉపయోగించవచ్చు. -
ఐఫోన్ లవర్స్కు శుభవార్త, బడ్జెట్ ధరలో మరో కొత్త 5జీ ఐఫోన్! ధర ఎంతంటే?
యాపిల్ ఐఫోన్ లవర్స్కు శుభవార్త.ఈ ఏడాది మార్చి నెలలో జరిగే ఈవెంట్లో యాపిల్ సంస్థ తక్కువ ధరలో 5జీ ఐఫోన్ ను విడుదల చేయనుంది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. మార్చి నెలలో జరగనున్న ఈవెంట్లో యాపిల్ సంస్థ బడ్జెట్ ధరలో 5జీ ఐఫోన్ తో పాటు ఐపాడ్, మాక్ కంప్యూటర్ను విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. యాపిల్ గతేడాది సెప్టెంబర్లో ఐఫోన్ 13, అక్టోబర్లో మాక్ బుక్ ప్రో ల్యాప్ ట్యాప్లను విడుదల చేసింది. ఆ తరహాలోనే మరికొద్ది రోజుల్లో జరిగే యాపిల్ ఈవెంట్లో లో బడ్జెట్లో ఐఫోన్, మాక్లను విడుదల చేయనున్నట్లు బ్లూమ్ బెర్గ్ తన నివేదికలో పేర్కొంది. ఐఫోన్ ఎస్ఈ 2022 యాపిల్ సంస్థ తొలిసారి ఐఫోన్ ఎస్ఈ సిరీస్ను 2020లో మార్కెట్లో పరిచయం చేసింది. అయితే తాజాగా యాపిల్ ఎస్ఈ సిరీస్ బడ్జెట్ ధరలో 5జీ ఐఫోన్ ను ఐఫోన్ఎస్ఈ 2022 పేరిట వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఫీచర్లు ఐఫోన్ ఎస్ఈ 2022 కొత్త మోడల్ పాత డిజైన్తో 4.7 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు ,5జీ నెట్ వర్క్కు సపోర్ట్ చేసేలా ప్రాసెసర్ తో విడుదలవుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈఫోన్ ధర విషయానికొస్తే ఐఫోన్ ఎస్ఈ 2022 ధర రూ.30వేలు ఉండగా.. త్వరలో విడుదలయ్యే ఐఫోన్ ఎస్ఈ 2022 ఫోన్ ధర కూడా అదే తరహాలో ఉండనుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement