-
ట్రైన్లో పిడకలతో చలి మంట.. తర్వాత ఏం జరిగిందంటే..
కదులుతున్న రైలులో కొందరు వ్యక్తులు చలి మంట వేశారు. ఆ మంట వద్ద ప్రయాణికులు చలి కాచుకున్నారు. అయితే రైలు నుంచి మంటలు, పొగలు రావడాన్ని గమనించిన గేట్మ్యాన్ వెంటనే రైల్వే అధికారులను అలెర్ట్ చేశాడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరిని ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 3న అస్సాం నుంచి ఢిల్లీ వెళ్తున్న సంపర్క్ క్రాంతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జనరల్ బోగిలో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు రాత్రి వేళ చలిని తట్టుకోలేక మంటను రాజేశారు. బోగిలోని ప్రయాణికులు ఆ మంట వద్ద చలి కాచుకున్నారు. రైలు బర్హాన్ స్టేషన్ సమీపంలో రైల్వే క్రాసింగ్లో గేట్మ్యాన్ రైలు కోచ్ నుండి మంట, పొగ వెలువడటం గమనించాడు. వెంటనే బర్హాన్ రైల్వే స్టేషన్లోని తన ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. అనంతరం ఆర్పీఎఫ్ పోలీసులు తదుపరి స్టేషన్ చమ్రౌలాలో రైలును ఆపి తనిఖీలు చేశారు. జనరల్ బోగిలో కొంతమంది వ్యక్తులుపిడకలతో చలి మంట వేసినట్లు గుర్తించారు. మంటలు భోగి మొత్తం వ్యాపించకముందే వాటిని ఆర్పివేశారు. రైలు అలీఘర్ జంక్షన్ చేరిన తరువాత జనరల్ బోగిలోని 16 మంది ప్రయాణికులను ఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే రైలులో చలి మంట వేసింది తామేనని ఫరీదాబాద్కు చెందిన చందన్(23), దేవేంద్ర(25) ఒప్పుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మిగతా 14 మంది ప్రయాణికులను హెచ్చరించి వదిలేశారు. చదవండి: టికెట్లకు రూ.4లక్షలు.. ఎయిర్ ఇండియా సర్వీసుకు షాకైన కుటుంబం -
రైలులో మద్యం మత్తులో...
ఝాన్సీ: ఇటీవల విమానంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన సంఘటన గురించి విన్నాం. అలాంటి ఘటనపై ఉత్తరప్రదేశ్లో రైలులో జరిగింది. 19 ఏళ్ల రితేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఏసీ కంపార్ట్ట్మెంట్లో ప్రయాణిస్తూ కింది బెర్తుపై నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై మద్యం మత్తులో మూత్ర విసర్జన చేశాడు. అతడిని అరెస్టు చేశామని ఆరీ్పఎఫ్ పోలీసులు శుక్రవారం తెలిపారు. అయితే, అతడు ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని తేలినట్లు చెప్పారు. మూత్ర విసర్జన ఘటన జరగ్గానే దంపతులు రైలులో ఉన్న టీటీఈకి ఫిర్యాదు చేశారు టీటీఈ ఝాన్సీ రైల్వే స్టేషన్కు సమాచారం చేరవేశాడు. రైలు ఝాన్సీ స్టేషన్కు చేరుకోగా పోలీసులు రితేశ్ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు. రైల్వే చట్టం ప్రకారం జరిమానా చెల్లించిన రితేశ్ను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. -
భ్రాంతిగా మారిన తెలంగాణ సంపర్క్ క్రాంతి
సాక్షి, హైదరాబాద్: ఏడేళ్లు దాటినా కొత్త రైళ్లు పట్టాలెక్కడంలేదు. హైదరాబాద్ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీకి ఇప్పటికీ ఒకే ఒక్క రైలు అందుబాటులో ఉంది, అన్ని రాష్ట్రాల రాజధానుల నుంచి న్యూఢిల్లీకి సంపర్క్ క్రాంతి రైళ్లు నడుస్తున్నాయి. తెలంగాణ నుంచి మాత్రం తెలంగాణ ఎక్స్ప్రెస్ ఒక్కటే అంబాటులో ఉంది. దీంతో ప్రయాణికులు ఈ ఒక్క రైల్లో బెర్తు కోసం నెలల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రతి సంవత్సరం చర్విత చర్వణంగా బడ్జెట్లు వస్తూనే ఉన్నాయి. కొత్త రైళ్లు మాత్రం రావడం లేదు. తాజాగా కేంద్రం మరో మరో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈసారైనా చారిత్రక హైదరాబాద్ నుంచి తెలంగాణ సంపర్క్ క్రాంతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఏదీ సంపర్క్ క్రాంతి... ► ఏపీ, తమిళనాడు, కర్ణాకటక, కేరళ తదితర అన్ని రాష్ట్రాల నుంచి సంపర్క్ క్రాంతి రైళ్లు నడుస్తున్నాయి. ఏపీ సంపర్క్క్రాంతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12708/12707) తిరుపతి నుంచి నిజాముద్దీన్ స్టేషన్కు రాకపోకలు సాగిస్తోంది. ఇది కాచిగూడ మీదుగా అందుబాటులో ఉన్నప్పటికీ బెర్తులు లభించడం కష్టమే. ► మరోవైపు అన్ని రాష్ట్రాలకు చెందిన రాజధానులు లేదా పుణ్యక్షేత్రాల నుంచి సంపర్క్క్రాంతి రైళ్లు నడిపినప్పుడు తెలంగాణ నుంచి కూడా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ► ప్రస్తుతం తెలంగాణ ఎక్స్ప్రెస్ నాంపల్లి నుంచి కాజీపేట్, బల్లార్ష మీదుగా నడుస్తోంది. తెలంగాణ సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ను సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, బల్లార్షల మీదుగా డెహ్రాడూన్ మార్గంలో నడిపితే ఇప్పటి వరకు న్యూఢిల్లీకి నేరుగా రైలు సదుపాయం లేని కొత్త ప్రాంతాలకు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. (క్లిక్: తెలంగాణలో పెరుగుతున్న భూముల ధరలు.. ఖజానాకు ‘భూమ్’) కొత్త రైళ్లేవీ? ► మరోవైపు హైదరాబాద్ నుంచి వందేభారత్ రైలును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం గతంలో ప్రకటించింది. దేశవ్యాప్తంగా వంద వందేభారత్ కోసం ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం న్యూఢిల్లీ– వారణాసి, న్యూఢిల్లీ నుంచి శ్రీమాతా వైష్ణోదేవి ఆలయానికి మాత్రమే ఈ రైళ్లు గతేడాది నుంచి నడుస్తున్నాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచే వందేభారత్ను సికింద్రాబాద్ నుంచి న్యూఢిలీకి నడపాలనే ప్రతిపాదన ఇప్పటికీ అమలుకు నోచుకోవడంలేదు. ► మరోవైపు హైదరాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా మరో వందేభారత్ రైలును ముంబై వరకు నడిపాలనే ప్రతిపాదన సైతం ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ► మొత్తం 18 బోగీలు ఉండే ఈ ట్రైన్లో జీపీఎస్ అధునాతన సదుపాయాలు ఉంటాయి. ► సికింద్రాబాద్ నుంచి పుణేకు నడిచే శతాబ్ది ఎక్స్ప్రెస్ను రెండేళ్ల క్రితం నిలిపివేశారు. ఎంతో డిమాండ్ ఉన్న ఈ ట్రైన్ నిలిపివేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పుణే– సికింద్రాబాద్ మార్గంలో లైన్ల సామర్థ్యాన్ని పెంచి సత్వరమే శతాబ్ది రైలును పునరుద్ధరించాల్సి అవసరం ఉంది. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఈ ఏడేళ్లలో కొత్త రైళ్లు అందుబాటులోకి రాలేదు. పైగా ఉన్నవాటిని రద్దు చేస్తున్నారు. ఇది న్యాయం కాదు. చాలా వరకు రైల్వే ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి. – ఫణి, సాఫ్ట్వేర్ వందేభారత్ నడపాలి దక్షిణాదిలో ఇప్పటి వరకు వందే భారత్ రైలును ప్రవేశపెట్టలేదు. హైదరాబాద్ నుంచి ముంబైకి లేదా హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ, బెంగళూరు నగరాలకు వందేభారత్ను నడపాలి. దీనివల్ల ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. – సునీల్, వికారాబాద్ -
నేటి నుంచే రైల్వే బుకింగ్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి దురంతో, సంపర్క్ క్రాంతి, జన శతాబ్ది, పూర్వా ఎక్స్ప్రెస్ వంటి ప్రముఖ రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయని రైల్వేశాఖ బుధవారం ప్రకటించింది. గతంలో చెప్పినట్లుగా ఈ రైళ్లలో నాన్–ఎసీ తరగతి మాత్రమే కాకుండా ఏసీ తరగతి కూడా ఉంటుందని పేర్కొంది. ముందస్తు టికెట్ బుకింగ్లు ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతాయని వెల్లడించింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న 200 రైళ్ల జాబితాను రైల్వేశాఖ విడుదల చేసింది. జనరల్ కోచ్ల్లోనూ రిజర్వుడ్ సీట్లు ఉంటాయని తెలిపింది. టికెట్ రుసుములు సాధారణంగానే ఉంటాయని స్పష్టం చేసింది. గరిష్టంగా 30 రోజుల ముందు ప్రయాణానికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది. తెలంగాణ, ఏపీలకు సంబంధించిన రైళ్లివే.. హైదరాబాద్–ముంబై: సీఎస్టీ హుస్సేన్సాగర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్–హౌరా: ఫలక్నుమా ఎక్స్ప్రెస్ హైదరాబాద్– న్యూఢిల్లీ: తెలంగాణ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ – దానాపూర్: దానాపూర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్– గుంటూరు: గోల్కొండ ఎక్స్ప్రెస్ నిజామాబాద్– తిరుపతి: రాయలసీమ ఎక్స్ప్రెస్ హైదరాబాద్– విశాఖపట్నం: గోదావరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్– నిజాముద్దీన్: దురంతో ఎక్స్ప్రెస్ వేరే ప్రాంతాల్లో మొదలై తెలంగాణ మీదుగా నడిచే రైళ్లు.. విశాఖపట్నం–న్యూఢిల్లీ: ఏపీ ఎక్స్ప్రెస్ హౌరా–యశ్వంతపూర్: దురంతో ఎక్స్ప్రెస్ ఎర్నాకులం– నిజాముద్దీన్: దురంతో ఎక్స్ప్రెస్ దానాపూర్–కేఎస్ఆర్ బెంగుళూరు: సంగమిత్ర ఎక్స్ప్రెస్ రైల్వే స్టేషన్లలో ఆహారశాలలకు అనుమతి: రైల్వే స్టేషన్లలో కేటరింగ్ సేవలు ప్రారంభించేందుకు, ఆహారశాలలు తెరిచేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆహారాన్ని పార్సిళ్ల రూపంలో ఇవ్వాలని, ప్రయాణికులు ఆహారశాలల్లోనే కూర్చొని తినేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. -
ఆ 8 మందికి కరోనా పాజిటివ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/హైదరాబాద్: ఇండోనేసియా నుంచి కరీంనగర్ వచ్చిన 10 మంది బృందం ప్రయాణించిన రైలు బోగీలో 82 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 8 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. వారు ప్రయాణించిన రైలుతో పాటు, ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరిని కలిశారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా వారి వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు రైల్వే అధికారులు అందించారు. ఢిల్లీ నుంచి ప్రయాణించిన 12708 నంబర్ ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఎస్ 9 బోగీలో వారు ప్రయాణించినట్లు రైల్వే శాఖ అధికారులు గుర్తించారు. టికెట్లు రిజర్వ్ చేసుకునే సమయంలో అందించిన ఫోన్ నంబర్లను కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అందజేశారు. ఆ వివరాల ఆధారంగా ప్రయాణికులను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత రైలు తిరుపతి వరకు వెళ్లింది. అంటే ఆ బోగీలో తెలంగాణతో పాటు ఏపీకి చెందిన వారు కూడా ఉన్నారు. వారి రాకతో కలకలం.. ఇండొనేషియా నుంచి 10 మంది విమానంలో తొలుత ఢిల్లీ వచ్చారు. అక్కడ ఉత్తరప్రదేశ్కు చెందిన మరో వ్యక్తితో కలసి ఈనెల 13న ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించారు. ఈనెల 14న రామగుండంలో దిగారు. అక్కడి నుంచి కరీంనగర్ వచ్చారు. ఆ రోజు రాత్రి ప్రార్థనా మందిరంలో బసచేశారు. 15న ఉదయం పోలీసులకు రిపోర్టు చేసేందుకు వెళ్లగా, స్థానికంగా వైద్య పరీక్షలు చేయించుకుని నివేదికలు ఇవ్వాలని పోలీసులు అడిగారు. దీంతో వైద్యపరీక్షల కోసం ఉత్తరప్రదేశ్కు చెందిన గైడ్తో పాటు ఇద్దరు స్థానికులతో కలసి కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. విదేశీయులు కావడంతో ఐసోలేషన్ వార్డుకు తరలించి పరీక్షలు నిర్వహించారు. దీంతో వారిలో ఒకరు జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వెంటనే వారిని గాంధీకి తరలించారు. వారికి పరీక్షలు నిర్వహించగా తొలుత ఒకరికి పాజిటివ్ అని తేలగా, బుధవారం మరో ఏడుగురికి కూడా కోవిడ్ సోకినట్లు నిర్ధారించడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వీరందరికీ గాంధీ ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. కాగా, వీరిని పర్యవేక్షించేందుకు పోలీస్ శాఖ స్పెషల్ బ్రాంచి కానిస్టేబుల్ను నియమించగా, అతడిలో కూడా కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఎంతమంది వచ్చారు.. ఇండొనేసియా బృందం ఢిల్లీ నుంచి రైలు మార్గంలో రామగుండం, అక్కడి నుంచి కరీంనగర్ చేరుకున్నారు. వీరితో పాటు మరో 20 మంది కూడా భారత్ వచ్చినట్లు తెలుస్తోంది. వారిలో మరో 10 మంది రామగుండం నుంచి జగిత్యాలకు వెళ్లినట్లు అనధికారిక సమాచారం. వీరు ఎక్కడున్నారనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. కాగా, ఇంకో పది మంది ఎక్కడున్నారనే విషయంపై కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల పోలీసులను అప్రమత్తం చేసినట్లు తెలిసింది. ఎక్కడెక్కడ తిరిగారు..? కరీంనగర్కు వచ్చిన ఇండొనేషియాకు చెందిన 10 మంది ఎక్కడ బస చేశారు.. ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరిని కలిశారనే అంశాలపై పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆరా తీస్తోంది. కలెక్టరేట్ సమీపంలోని ఓ ప్రాంతంలో బసచేసినట్లు తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతం చుట్టూ ఉన్న దుకాణాలను మూయించారు. వారు ఎవరెవరిని కలిశారనే దానిపై స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. కరీంనగర్లోని పలు ప్రార్థనా మందిరాలతో పాటు రేకుర్తికి కూడా వెళ్లినట్లు సమాచారం. పలు చోట్ల కరచాలనంతో పాటు ఆలింగనం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో అన్ని ప్రాంతాల ప్రజలను వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. ప్రాథమిక ఆరోగ్య సిబ్బందితో ఇంటింటి సర్వే చేయిస్తున్నారు. ఇండొనేషియన్లు బస చేసిన ప్రాంతాలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలందరికీ పరీక్షలు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించడం గమనార్హం. చదవండి: ఆ బ్లడ్ గ్రూపు వాళ్లు తస్మాత్ జాగ్రత్త! ప్లీజ్ .. పెళ్లికి అనుమతించండి..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement