-
పుర.. పాయే..
రూ.168 కోట్ల పథకం రద్దు పనులు ప్రారంభం కాకపోవడమే కారణం ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం నిధులు వెనక్కి పంపాలని కేంద్రం ఆదేశం వరంగల్ : గ్రామీణ ప్రాంతాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే లక్ష్యంతో మంజూరైన పుర (ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమినిటీస్ ఇన్ రూరల్ ఏరియా) పథకం... ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో రద్దయిపోయింది. నిధులు మంజూరై మూడేళ్లు గడుస్తున్నా పనులు మొదలుకాకపోవడంతో పథకాన్ని రద్దు చేస్తున్నామని.. నిధులను వెనక్కి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాకు మంజూరైన రూ.168 కోట్ల పథకం ఆగిపోయింది. పనులు మొదలుపెట్టని కారణంగా పుర పథకాన్ని రద్దు చేస్తున్నట్లు వరంగల్ లోక్సభ ఉప ఎన్నికకు ముందే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) అధికారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ వచ్చింది. పుర పథకం అమలు కోసం తొలి దశలో మంజూరు చేసిన రూ.25 కోట్లను వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో డీఆర్డీఏ వెంటనే చర్యలు చేపట్టింది. దాదాపు ఎనిమిది బ్యాంకుల్లో నుంచి ఈ నిధులను వెనక్కి తెప్పిస్తోంది. నాలుగేళ్లుగా వడ్డీ రూపంలో మరో ఆరు కోట్ల రూపాయలు జమ అయినట్లు తెలుస్తోంది. రెండుమూడు రోజుల్లో మొత్తం నిధులు వెనక్కి రానున్నాయి. నిధులు రాగానే కేంద్రానికి పంపించేందుకు వీలుగా డీఆర్డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్కు నివేదించేందుకు సిద్ధమైంది. పర్వతగిరి ఎంపిక పుర ప్రాజెక్టు అమలుకు జిల్లాలో పర్వతగిరి మండలంలోని గ్రామాలు ఎంపికయ్యాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) పద్ధతిలో పథకం అమలు చేయాలని నిర్ణయించారు. యుగాంతర్, ఎస్వీఈసీ సంస్థలకు టెండర్ల పనులు అప్పగించారు. పుర పథకం మొత్తం నిధులు రూ.168.52. దీంట్లో కేంద్ర ప్రభుత్వం రూ.123.34 కోట్లు(73శాతం), రాష్ట్ర ప్రభుత్వం రూ.25.80 (15 శాతం), భాగస్వామ్య సంస్థలు రూ.19.38కోట్లు (11శాతం) చొప్పున చెల్లించాలి. 13 ఏళ్లపాటు ప్రాజెక్టు నిర్వహణ చేయాల్సి ఉంటుంది. మొదటి మూడేళ్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. పదేళ్లపాటు పనులను నిర్వహణ బాధ్యతలు చేట్టిన సంస్థలు పర్యవేక్షిస్తాయి. తరువాత ఆ ప్రాంతంలోని స్థానిక సంస్థలకు నిర్వహణ భాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. ప్రణాళిక ప్రకారం 13 ఏళ్ల తర్వాత పథకం ఫలాలు సామాన్యులకు అందుతాయి. దానిపై వచ్చే లాభాల్లో కొంత మొత్తాన్ని గ్రామ పంచాయతీల ఆమోదంతో పన్నుల రూపంలో వసూలు చేసి తదుపరి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేసేలా దీన్ని రూపొందించారు. పుర పథకంతో గ్రామాల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తారు. నగరాల స్థాయిలో సాంకేతిక సేవలు అందుబాటులోకి వస్తాయి. సాగునీరు, తాగునీరు, రోడ్ల విస్తరణ, మురుగునీటి వ్యవస్థ, వీధి లైట్లు, వాటర్ షెడ్, టెలి కమ్యూనికేషన్స్, అపరల్ పార్క్, సోలార్, వైఫై, పర్యాటక, వ్యవసాయ సేవలు, శీతల గిడ్డంగులు, మార్కెట్ యార్డులు, ఫుడ్ ప్రాసెసింగ్, విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉపాధి కల్పన లక్ష్యాలతో పుర పథకం రూపొందించారు. 2012 ఆర్ధిక సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వరంగల్, కృష్ణా జిల్లాలకు ఈ పథకం మంజూరైంది. రెండు జిల్లాలకు రూ.25 కోట్ల చొప్పున తొలి దశ నిధులు విడుదలయ్యాయి. కృష్ణా జిల్లాలో పనులు వెంటనే ప్రారంభించారు. మన జిల్లాలో పుర పథకం పనులను యుగాంతర్ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. పర్వతగిరి మండలంలోని గ్రామాలన్నింటికీ పుర పథకంలో చేర్చారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ వచ్చే మందు రోజు జిల్లాలో హడావుడిగా ప్రారంభించారు. అప్పటికే ఆలస్యమైంది. ప్రారంభించి ఏడాదిన్నర గడిచినా పనులు మొదలుపెట్టలేదు. పుర పథకాన్ని కేంద్రంలోని గత ప్రభుత్వం (యూపీఏ) అమలు చేసింది. ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం ఉంది. అరుుతే గతంలో మొదలైన పనులకు దశలవారీగా నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. తొలి దశలో విడుదల చేసిన నిధులనే వెనక్కి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో గ్రామాల అభివృద్ధి ఆగిపోతోంది. -
బాబు వచ్చారు.. వీరి జాబు పోయింది
♦ డీఆర్డీఏలోని ఎన్పీఎం సీఎంఎస్ఏలకు తీవ్ర అన్యాయం ♦ కేవలం ఒక సెల్ఫోన్ మెసెజ్తో తొలగింపు ♦ రోడ్డున పడిన 812 మంది సిబ్బంది ♦ బకాయిలు కూడా చెల్లించని మొండిప్రభుత్వం ♦ న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్న బాధితులు కడప రూరల్ : బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఊదరగొట్టింది. తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కారు. జాబు వచ్చే సంగతి దేవుడెరుగు.. ఉన్న జాబులను ఊడగొట్టారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలోని ఎన్పీఎం సీఎంఎస్ఏ (పురుగు మందులు లేని వ్యవసాయం) విభాగంలో జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో 575 మంది వీఏలు, 115 మంది సీఏలు, కమిటీకి చెందిన115 మంది, ఏడుగురు ఆపరేటర్లు మొత్తం 812 మందికి తీవ్ర అన్యాయం జరిగింది. వీరంతా 2006 నుంచి పని చేస్తున్నారు. గడిచిన ఏప్రిల్ 22న సెర్ఫ్ సీఎంఎస్ డెరైక్టర్ సుధాకర్ సెల్ నుంచి ‘మీ సేవలు ఇక చాలు’ అని మెసెజ్ వచ్చింది. దీంతో వారంతా రోడ్డున పడ్డారు. వీరు శుక్రవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్కు వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. జి.రామయ్య, పి.ఓబులయ్య, సురేష్బాబు, డి.ఓబులేశు, ఇ.కృష్ణమూర్తి, ఎన్పీఎంసీఏలు, కంప్యూటర్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున వచ్చి తమ ఆవేదన వెళ్లగక్కారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమన్నారు. వీరంతా క్షేత్ర స్థాయిలో పంటలపై రైతులకు అవగాహన కల్పించడం, పొలంబడుల ద్వారా సూచనలు, సలహాలు ఇవ్వడం, అంతర పంట సాగుపై మెళుకువలు అందించడం, వ్యవసాయ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలిపి చైతన్యవంతులను చేయడం వంటి కీలక బాధ్యతలను నిర్వర్తించారు. అలాంటి వారిని నిర్దాక్షిణ్యంగా తొలగించడంతో.. వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఒక్కొక్కరికి వేలల్లో బకాయిలు వీరికి గడిచిన ఏడాది నుంచి ఎలాంటి బకాయిలు అందలేదు. అంటే వీరిని తొలగించక ముందు నుంచి ప్రభుత్వం బకాయిలను మంజూరు చేయలేదు. వారంతా నిరుపేదలు. చాలీచాలని జీతాలతో ఎలాగోలా ఈ ఉద్యోగాలనే నమ్ముకుని నెట్టుకొస్తున్నారు. అలాంటిది ఉన్న ఫళంగా తొలగించడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఒక్కొక్కరికి మొత్తం బకాయిలు రూ. 50 వేలకు పైగా రావాల్సి ఉంది. డీఆర్డీఏ పీడీకి వినతిపత్రాలు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఎలాంటి స్పందన కనిపించలేదు. తమకు ప్రత్యామ్నాయం చూపకపోవడంతోపాటు ఉన్న ఫళంగా తొలగించడం ఎంత వరకు సబబని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తమ సిబ్బందిని అక్కడ కొనసాగిస్తుంటే.. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వేటు వేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే న్యాయం చేయకపోతే కుటుంబాలు మొత్తం తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. -
వెలుగు ఉద్యోగుల్లో చీకట్లు!
విజయనగరం అర్బన్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చర్చనీయంగా మారింది. ఈ సంస్థను మూ సి వేయాలని ఇటీవల ప్రభుత్వానికి ఆర్థికశాఖ సిఫారసు చేయడం ఆ సంస్థలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. సెర్ప్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రధా న హామీగా ప్రకటించిన టీడీపీ, అధికారం చేతికొచ్చాక ఇలా వ్యవహరించడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘వెలుగు’(ప్రస్తుత సెర్ప్) పేరుతో రాష్ట్రంలో మహిళాభివృద్ధికి పునాదు లు వేసిన ఘనత తమదేనని, పార్టీ అధికారంలోకి వస్తే ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారం వచ్చా క ఇప్పుడు సెర్ప్ను మూసివేసేదిశగా అడుగు లు వేయడంపై ఈ సంస్థ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. 14 ఏళ్లుగా ఇదే సంస్థ ను నమ్ముకొని పనిచేస్తున్న తమను ఇలా నట్టేట ముంచడం దారుణమని వాపోతున్నారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థలో క్లర్క్ స్థాయి నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ స్థాయి వరకు జిల్లా వ్యాప్తం గా 270 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మంది ఉద్యోగులున్నారు. వీరేకాకుండా పంచాయతీకి ఒక్కరు చొప్పున జిల్లాలో మరో వేయిమంది వరకు విలేజ్ బుక్ కీపర్లు పనిచేస్తున్నారు. సంస్థ మూసివేస్తే వీరంతా వీధిన పడాల్సిందే. ఎందుకీ వివక్ష? మహిళా అభ్యున్నతి కోసం గ్రామస్థాయిలో ‘వెలుగు’ పేరుతో తొలుత 2000 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ సంస్థను ఏర్పాటుచేసింది. 14 ఏళ్లుగా ఈ సంస్థ ఉద్యోగులు అందించిన సేవలకు దేశవ్యాప్తంగా మంచిగుర్తింపు లభించింది. మహిళా స్వయం సహా యక సాధికారిత తీసుకురావడంలో ఉత్తమ ఫలితాలను సాధించడం వల్లే ఈ సంస్థను ఇతర రాష్ట్రాలకు రీసోర్స్ సెంటర్గా కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. గ్రామీణ ప్రాంతా ల మహిళాభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) ఆధ్వర్యంలో ఇతరరాష్ట్రాలకు అవగాహన కలిగించే రిసోర్స్సెంటర్గా మన రాష్ట్ర సెర్ప్సంస్థ తాజాగా వ్యహరిస్తోంది. జిల్లా నుంచి ఈ సంస్థ 40మంది మహి ళా గ్రూప్ సభ్యులను రిసోర్స్పర్సన్లగా ఎంపిక చేసి రాజస్థాన్, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు పంపింది. కేవలం 10వ తరగతి విద్యార్హత మాత్ర మే ఉన్న వీరు ప్రస్తుతం రోజుకు రూ.1,500 వరకు వేతనం పొందున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి సెర్ప్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ నేతలు ఎన్నికల సందర్భం గా ఇచ్చిన హామీని అమలు చేయాలని సెర్ప్ ఉద్యోగుల సంఘం జిల్లా కమి టీ అధ్యక్షుడు వై.హరేరాం కోరారు. సంస్థలో ఉద్యోగులను అవుట్ సోర్స్ విధానంలో భర్తీ చేసినప్పటికీ పక్కాగా అర్హత పరీక్షలు, రోస్టర్ విధానంతో ఎంపికయినట్టు చెప్పారు. శాశ్వతఉద్యోగానికి కూడా ఇలా పరీక్షలు నిర్వహంచరేమో అన్నట్లు నియామకాలు చేశారని పేర్కొన్నారు. అంతేస్థాయిలో సంస్థకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చామని చెప్పారు. జీతాలు మాత్రం అరకొరగానే అందుకుంటున్నామని, తాజాగా ఆర్థిక మంత్రి ప్రకటనతో ఉద్యోగుల్లో ఆందోళన ఏర్పడిం దని తెలిపారు. ఇటీవల ఏర్పాటు చేసిన మంత్రుల సబ్కమిటీకి పలుమార్లు వినతి పత్రాన్ని అందజేశామని హరేరాం తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement