-
ప్రజల జీవన విధానంపై అధ్యయనం చేయాలి.. కలెక్టర్
మహబూబ్నగర్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం, ఆర్థిక పరిస్థితులు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ ఏఎస్ఓలకు సూచించారు. సోమవారం 25 మంది కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి శిక్షణ నిమిత్తం నాగర్కర్నూల్ జిల్లాకు వచ్చిన ఏఎస్ఓ లతో వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో కలెక్టర్ ఉదయ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఏఎస్ఓలు 5 రోజుల పర్యటనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించాలని, రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు ఎలా ఉన్నాయో, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, వాటన్నిటిని డేటా రూపంలో సేకరించాలని అన్నారు. ప్రతి గ్రామంలో హరితహారం కింద నర్సరీలను ఏర్పాటు చేశామని, శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు, ప్రతి గ్రామానికి ట్రాక్టర్, డంపింగ్ యార్డ్ వంటివి ఏర్పాటు చేశామని, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎలా ఉన్నాయో చూడాలన్నారు. ముఖ్యంగా తాగునీటి కల్పనకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతు బీమా పథకాలు గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాలన్నారు. గ్రామస్థాయిలో సుమారు 40 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వారందరితో అన్ని వివరాలు తెలుసుకోవాలని సూచించారు. శిక్షణ నిమిత్తం వచ్చిన ఏఎస్ఓలకు ఐదు గ్రూపులుగా విభజించి నాగర్కర్నూల్, తాడూర్, తెలకపల్లి, కల్వకుర్తి నాలుగు మండలాలను కేటాయించి ఒక్కో ఏఎస్ఓకు ఒక ఇన్చార్జ్ అధికారితో పాటు, వారికి అవసరమైన సమాచారం ఇవ్వడం జరుగుతుందని వివరించారు. నేటి నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఢిల్లీ కేంద్ర సచివాలయానికి సంబంధించిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు గ్రామీణ ప్రాంత అధ్యయనంలో పాల్గొన్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీపీఓ కృష్ణ, మహబూబ్నగర్ ట్రైనింగ్ సెంటర్ ఇన్చార్జ్ గోపాల్, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు ఉన్నారు. -
ముంచుకొస్తున్న మరో ముప్పు, ఈ నల్లని మేఘాలు ప్రమాదకరం ఎందుకంటే?
ఆకాశంలో దట్టమైన నల్లటి మేఘాలు కమ్ముకుంటే? మామూలుగా అయితే వాన రాకడకు సూచిక. కానీ, జీవజలాన్ని కాక ప్రమాదకరమైన బ్యాక్టీరియాను మోసుకొచ్చే మేఘాలున్నాయని తెలుసా? నిజం. ఇలాంటి మేఘాలున్నాయని కెనడా, ఫ్రాన్స్ పరిశోధకులు చెబుతున్నారు. ఔషధాల శక్తిని తట్టుకొని మరీ నిక్షేపంగా జీవించే బ్యాక్టీరియా ఈ మేఘాల్లో నిండి ఉంటుందని, వాటితో పాటే అది సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తుందని తాజా అధ్యయనంలో గుర్తించారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచమంతటినీ చుట్టేస్తుందన్నమాట! ఈ అధ్యయనం వివరాలను సైన్స్ ఆఫ్ ద టోటల్ ఎన్విరాన్మెంట్ పత్రికలో ప్రచురించారు. ► కెనడాలో క్విబెక్ సిటీలోని లావల్ యూనివర్సిటీ, సెంట్రల్ ఫ్రాన్స్లోని క్లెర్మాంట్ అవెర్జిన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మేఘాల నమూనాలను సేకరించి పరీక్షించారు. ► 8,000 ఒక మిల్లీలీటర్ మేఘంలో సగటున ఉన్న బ్యాక్టీరియా సంఖ్య. ► మేఘాల్లోని ఈ బ్యాక్టీరియాలో 29 ఉపవర్గాలకు చెందిన యాంటీబయాటిక్ను తట్టుకునే జన్యువులు ఉన్నట్టు గుర్తించారు. ► ఈ మేఘాల్లో యాంటీబయాటిక్స్ను తట్టుకొనే జన్యువులతో కూడిన బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు. ► 2019 సెప్టెంబర్ నుంచి 2021 అక్టోబర్ దాకా ఈ పరిశోధన నిర్వహించారు. ► చెట్లపై, భూమిలో ఉన్న బ్యాక్టీరియా గట్టి గాలుల ద్వారా వాతావరణంలోకి, అటునుంచి మేఘాల్లోకి చేరుతుంది. వాటితో పాటు సుదూరాలకు పయనిస్తుంది. ► సముద్ర మట్టానికి 1,465 మీటర్ల(4,806 అడుగులు) ఎత్తులో ఉన్న మేఘాల నుంచి నమూనాలను సేకరించారు. ► మిల్లీలీటర్ పరిమాణంలో 330 నుంచి ఏకంగా 30,000కు పైగా బ్యాక్టీరియా ఉన్నట్టు తేలింది. ► వర్షంగా కురిసిన చోట మేఘాల నుంచి భూమిపైకి చేరుతుంది. ► మేఘాల ద్వారా ఇలా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాప్తి చెందే బ్యాక్టీరియాతో మానవళి ఆరోగ్యానికి ఉన్న ముప్పుపై పూర్తిస్థాయి పరిశోధనలు జరగాల్సి ఉంది. ► ఈ బ్యాక్టీరియాలో 5 నుంచి 50 శాతం దాకా మాత్రమే క్రియాశీలకంగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. మేఘాల బ్యాక్టీరియా వల్ల మనుషులకు ముప్పు స్వల్పమేనని పరిశోధకురాలు ఫ్లోరెంట్ రోసీ అభిప్రాయపడ్డారు. ‘వర్షంలో బయట నడవాలంటే భయపడాల్సిన అవసరం లేదన్నమాట’ అంటూ చమత్కరించారు! ► మేఘాల్లోని బ్యాక్టీరియా జన్యువులు ఇతర బ్యాక్టీరియాతో కలుస్తాయా, లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని రోసీ వెల్లడించారు. ► డ్రగ్–రెసిస్టెంట్ను కలిగిన బ్యాక్టీరియాల మూలాలను కనుగొనేందుకు ఈ పరిశోధన దోహదపడుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కరోనా వైరస్ను ఖతం చేసే ఎన్95 మాస్క్
వాషింగ్టన్: కోవిడ్–19 వ్యాప్తిని చాలావరకు తగ్గించడమే కాదు, తనతో కాంటాక్టు అయిన సార్స్–కోవ్–2 వైరస్ను చంపేసే సరికొత్త ఎన్95 మాస్క్ను అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ మాస్క్ను ఎక్కువ కాలం ధరించవచ్చని, తరచుగా మార్చాల్సిన అవసరం లేదని, దీనితో ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా తక్కువేనని పరిశోధకులు తెలియజేశారు. తనంతట తాను స్టెరిలైజ్ చేసుకొనే వ్యక్తిగత రక్షణ పరికరం తయారీలో ఇదొక మొదటి అడుగు అని భావిస్తున్నామని అమెరికాకు చెందిన రెన్సెలార్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి ఎడ్మండ్ పాలెర్మో చెప్పారు. ఈ ఎన్95 మాస్క్ను ధరిస్తే గాలిద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని అన్నారు. తాజా పరిశోధన వివరాలను ఇటీవలే ‘అప్లయిడ్ ఏసీఎస్ మెటీరియల్స్, ఇంటర్ఫేసేస్’ పత్రికలో ప్రచురించారు. కరోనా వైరస్ను అంతం చేసే ఎన్95 మాస్క్ తయారీ కోసం యాంటీమైక్రోబియల్ పాలిమర్స్, పాలిప్రొపైలీన్ పిల్టర్లు ఉపయోగించారు. ఒకదానిపై ఒకటి పొరలుగా అమర్చారు. ఈ పరిశోధనలో ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) పరిశోధకులు కూడా భాగస్వాములయ్యారు. మాస్క్ పైభాగంలో వైరస్లను, బ్యాక్టీరియాను చంపేపే నాన్–లీచింగ్ పాలిమర్ కోటింగ్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం అతినీలలోహిత కాంతి, అసిటోన్ కూడా ఉపయోగించారు. -
అరుదైన ఘనతను సాధించిన ఎన్ఐటీ వరంగల్..!
వరంగల్: రీసెర్చ్ అవుట్పుట్లో ఎన్ఐటీ వరంగల్ అరుదైన మైలురాయిని సాధించింది. ఇటీవల కాలంలో ఎన్ఐటీ వరంగల్ రీసెర్చ్ అవుట్పుట్లో గణనీయమైన అభివృద్ధిని కనబరిచింది. స్కోపస్ డేటాబేస్ ప్రకారం...ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ 2021లో ఎన్ఐటీ వరంగల్ అధ్యాపకులు, విద్యార్థుల ప్రచురణల సంఖ్య 1000కు చేరింది. 2017లో మొత్తం ప్రచురణల సంఖ్య 540. గత 4 సంవత్సరాలలో రీసెర్చ్ అవుట్పుట్లో దాదాపు రెండింతలు పెరిగింది. 2018, 2019లో గత రెండు రిక్రూట్మెంట్లలో దాదాపు 150 మంది కొత్త ఫ్యాకల్టీలను నియమించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎన్.వి.రమణారావు, డైరెక్టర్, రిజిస్ట్రార్ శ్రీ. ఎస్ గోవర్ధన్ రావు, డీన్లు, సలహాదారులు మొత్తం ఎన్ఐటీ వరంగల్ అధ్యాపకులు, విద్యార్థులను అభినందించారు. జాతీయ విద్యా విధానం-2020కు అనుగుణంగా అన్ని కోర్సుల పాఠ్యాంశాలను పూర్తిగా సవరించామని, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పీహెచ్డీ స్కాలర్లను తీసుకోవడం 150 నుంచి 250కి పెంచామని ప్రొఫెసర్ రమణారావు తెలిపారు. సైన్సెస్లో మరిన్ని కొత్త ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశపెట్టామని, మెరుగైన శక్తి, ఉత్సాహంతో ఇన్స్టిట్యూట్ మరిన్ని మైలురాళ్లను సాధించి ర్యాంకింగ్ను మెరుగుపరుస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: 6జీ టెక్నాలజీ..! ముందుగా భారత్లోనే.. -
కోవిడ్-19 ముప్పు : ఈ ఆహారం మేలు..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ మానవాళికి పెనుసవాల్ విసిరిన క్రమంలో మహమ్మారిని ఎదుర్కొనే మందు, వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో స్వీయ నియంత్రణే పరమౌషధంగా ముందుకొస్తోంది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు ఇమ్యూనిటీకి దోహదపడే జీర్ణవ్యవస్ధను మెరుగుపరిచే ఆహారం తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణసంబంధ వ్యాధులు, కాలేయ వ్యాధులతో బాధపడే వారిలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ ముప్పు అధికమని వీరు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ యురోప నివేదిక హెచ్చరించడం మన ప్రేవులను సురక్షితంగా ఉంచుకోవడం కీలకమని సూచిస్తోంది. కోవిడ్-19 ఊపిరితిత్తులనే కాకుండా జీర్ణవ్యవస్థ సహా కీలక అవయవాలపై పెనుప్రభావం చూపుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ కే పుష్కలంగా ఉండే ఆకుకూరలను అధికంగా తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇక ఫైబర్తో పాటు ప్రొటీన్, బీ విటమిన్, ఒమెగా 3 ఆమ్లాలు అధికంగా ఉండే తృణ ధాన్యాలు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయని చెబుతున్నారు. వీటితో బరువు తగ్గడంతో పాటు టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, ఒబెసిటీ, కొన్ని క్యాన్సర్ల ముప్పును నివారించవచ్చు. బెర్రీ పండ్లు, ఆరంజ్, ద్రాక్ష వంటి అధిక ఫైబర్, తక్కువ ఫ్రక్టోజ్ కలిగిన పండ్లను నిత్యం ఆహారంలో తీసుకుంటే ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడతాయి. జీవర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు అరటిపండ్లు కూడా తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇక తక్కువ కొవ్వుతో కూడిన చికెన్, చేపలు వంటి లీన్ మీట్నూ ఆహారంలో భాగం చేసుకోవాలని పేర్కొంటున్నారు. వీటన్నింటితో పాటు జీర్ణ సంబంధ సమస్యలకు దారితీసే డీహైడ్రేషన్ను నివారించేందుకు ప్రతిఒక్కరూ మంచినీటిని అధికంగా తీసుకోవాలని పరిశోధకులు పేర్కొన్నారు. అధికారులు సూచించే మార్గదర్శకాలను పాటిస్తూ ఈ ఆహారం తీసుకుంటూ కోవిడ్-19 వ్యాధికి గురయ్యే ముప్పును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చదవండి : కరోనా విజేతగా 80 ఏళ్ల వృద్ధురాలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement