-
ప్రభుత్వం మారితే.. విరామం సహజమే!
సాక్షి, హైదరాబాద్: ఎక్కడైనా సరే స్థిరాస్తి మార్కెట్లో ప్రభుత్వం మారితే విరామం సహజమే. బ్రేక్ తర్వాతే సినిమాలో అసలు కథ మొదలైనట్టే.. రియల్ ఎస్టేట్ మార్కెట్లోనూ తాత్కాలిక స్తబ్ధత తర్వాతే రెట్టింపు వేగంతో పరుగులు పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. పాత విధానాల సమీక్ష, కొత్త పాలసీల రూపకల్పనకు సమయం పడుతుందని అప్పటివరకు మార్కెట్ మందకొడిగా ఉండటం సాధారణమేనని అభిప్రాయపడ్డారు. ► అనుమతుల మంజూరులో కమిటీల నియామకం, మాస్టర్ ప్లాన్లో మార్పులు చేర్పులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థిరాస్తి రంగంపై ప్రభావం పడుతుంది ఇది సాధారణ ప్రక్రియే. దీంతో భూ లావాదేవీలలో స్తబ్ధత ఏర్పడుతుంది. గత 4 ఏళ్లలో హైదరాబాద్లో భూముల ధరలు అసహజంగా పెరిగిపోయాయి. స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), ప్రవాసులు, బడా వ్యాపారస్తుల భూముల కొనుగోళ్లు జరుపుతుంటారు. దీంతో సహజంగానే రేట్లు పెరుగుతాయి నగరంలో జరిగిందే. కొత్త లాంచింగ్లొద్దు.. ప్రతికూల సమయంలో కొత్త ప్రాజెక్ట్లను లాంచింగ్ చేసి పరిశ్రమ మీద భారం వేయకూడదు. వచ్చే 1–2 ఏళ్ల పాటు కొత్త యూనిట్లను ప్రారంభించడం కంటే పాత ప్రాజెక్ట్లలో విక్రయాలు చేపట్టడం, నిర్మాణాలను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. మా ర్కెట్ పరిస్థితులు, ధోరణులను సమగ్రంగా అధ్య యనం చేయకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వృథా ఖర్చులు తగ్గించుకుంటూ నిర్మాణ పనులకే నిధులను కేటాయించాలి. కొనేముందు జాగ్రత్తలివే.. ► రాత్రికి రాత్రే బిల్డర్లుగా అవతారం ఎత్తి, తక్కువ ధరకే ఫ్లాట్లను ఇస్తామని మాయ మాట లు చెప్పే డెవలపర్లకు దూరంగా ఉంటే బెటర్. ► అప్పటికప్పుడే నిర్ణయాలుకాకుండా 2–3 నెల లు ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించాలి. ► ప్రతికూల సమయంలోనూ గడువులోగా నిర్మాణాలను పూర్తి చేసే ఆరి్ధక స్థోమత ఉన్న బిల్డర్ల వద్ద కొనుగోలు చేయడమే సురక్షితం. ► అన్ని అనుమతులతో పాటు మార్కెట్లో పేరున్న నిర్మాణ సంస్థలోనే కొనడం ఉత్తమం. ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినవివే.. ► 111 జీ.ఓ రద్దు చేశారు కానీ విధి విధానాలపై స్పష్టత ఇవ్వలేదు. జోన్ల కేటాయింపు, నిర్మాణ పనులకు అనుమతి తదితరాలపై క్లారిటీ ఇవ్వాలి. మాస్టర్ ప్లాన్లో భూ వినియోగ మార్పు చాలా క్లిష్టతరంగా మారింది. బిల్డర్లకే కాదు సామాన్యులకు సైతం భూ మార్పిడి చేసుకునేందుకు వీలుండే విధంగా ప్రక్రియను సులభతరం చేయాలి. ► ధరణి లోటుపాట్లపై కమిటీ సమరి్పంచిన నివేదికను సాధ్యమైనంత తర్వగా అమలు చేయాలి. పర్యావరణ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలి. బేరసారాలకు ఇదే సమయం భౌగోళికంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ.. హైదరాబాద్లో ఇప్పటికీ స్థిరాస్తి పెట్టుబడులలో సింహభాగం వాటా తెలుగు ప్రజలవే ఉంటాయని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు. హైదరాబాద్ స్థిరమైన నగరం కావడంతో పాటు అధిక ఆదాయం, ఉద్యోగ కల్పన, మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో ఇక్కడ స్థిర నివాసానికి మొగ్గు చూపిస్తుంటారన్నారు. సాధారణంగా ఎన్నికల ఏడాదిలో మార్కెట్ స్తబ్దుగానే ఉంటుంది. అయితే వాస్తవానికి నిజమైన కొనుగోలుదారులకు గృహ కొనుగోళ్లకు ఇదే సరైన సమయం. ఎందుకంటే విక్రయాలు మందకొడిగా సాగే ఈసమయంలో బిల్డర్లతో బేరసారాలకు అవకాశం ఉంటుంది. రోజువారి కార్యకలాపాలు, నిర్మాణ పనులకు అవసరమైన వ్యయం కోసం రేటు కాస్త అటుఇటైనా డెవలపర్ ఒక మెట్టు దిగే ఛాన్స్ ఉంటుంది. -
షాకింగ్:హైదరాబాద్ మార్కెట్లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు
న్యూఢిల్లీ: హైదాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల ధరలు ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య 13 శాతం పెరిగాయి. చదరపు అడుగు రూ.10,410గా ఉంది. ఈ వివరాలను క్రెడాయ్, కొలియర్స్, లైసెస్ ఫొరాస్ సంయుక్తంగా విడుదల చేసిన ‘హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ రిపోర్ట్ క్యూ1 2023’ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు చదరపు అడుగుకు సగటున 8 శాతం మేర క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు పెరిగాయి. ► అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల ధరలు జనవరి-మార్చి కాలంలో 16 శాతం పెరగ్గా, కోల్కతాలో 15 శాతం, బెంగళూరులో 14 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఇళ్ల ధరలు పెరగడం వరుసగా 11వ త్రైమాసికంలోనూ నమోదైంది. చదరపు అడుగు ధర 16 శాతం వృద్ధి చెంది రూ.8,432కు చేరుకుంది. ► ద్వారకా ఎక్స్ప్రెస్వే ప్రాంతంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇళ్ల ధరలు 59 శాతం మేర పెరిగాయి. గురుగ్రామ్లోని గోల్ఫ్కోర్స్ రోడ్డులో 42 శాతం పెరిగాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఇళ్ల ధరలు అత్యధికంగా ఇక్కడే ఉన్నాయి. ►అహ్మదాబాద్ ప్రాంతంలో 11 శాతం వృద్ధి కనిపించింది. చదరపు అడుగు ధర రూ.6,324గా ఉంది. ►బెంగళూరులో చదరపు అడుగు ధర 14 శాతం పెరిగి రూ.8,748కి చేరుకుంది. చెన్నైలో చదరపు అడుగు ధర 4 శాతం వృద్ధితో రూ.7,395కు చేరింది. ► కోల్కతాలో 15 శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.7,211గా ఉంది. ► పుణెలో 11 శాతం పెరిగి రూ.8,352గా నమోదైంది. ► ముంబై మెట్రో పాలిటన్ రీజియన్లో మాత్రం 2 శాతం తగ్గి చదరపు అడుగు ధర రూ.19,219గా నమోదైంది. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!) వృద్ధి కొనసాగుతుంది.. రానున్న రోజుల్లో ధరల పెరుగుదల మోస్తరుగా ఉండొచ్చని లైసెస్ ఫొరాస్ ఎండీ పంకజ్ కపూర్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇళ్ల నిర్మాణంలో వినియోగించే మెటీరియల్ ధరల ఫలితంగా ఇళ్ల ధరలు కూడా పెరిగాయి. అయినా కానీ, స్థిరమైన డిమాండ్ నెలకొంది. ఈ బలమైన ధోరణి కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. కొత్త ఇల్లు కొనుగోలు పట్ల వినియోగదారులు స్పష్టమైన ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద ఇళ్లు, మెరుగైన సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ పేర్కొన్నారు. అంతర్జాతీయ అనిశ్చితులు, వడ్డీ రేట్ల రూపంలో ఎదురైన సవాళ్ల మధ్య హౌసింగ్ రంగం బలంగా నిలబడినట్టు కొలియర్స్ సర్వీసెస్ కు చెందిన అక్యుపయర్ సర్వీసెస్ ఎండీ పీయూష్ జైన్ అభిప్రాయపడ్డారు. సొంతిల్లు కలిగి ఉండేందుకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో అందుబాటు ధరలు, నాణ్యతో కూడిన ప్రాజెక్టులు ఈ రంగం వృద్ధికి తోడ్పడతాయన్నారు. (కేటీఎం తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది: ఫీచర్లు ఎలా ఉంటాయంటే!) -
స్పోర్ట్స్ థీమ్డ్ ప్రాజెక్ట్తో వస్తున్న జీ స్క్వేర్
దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ప్లాట్ ప్రమోటర్ జీ స్క్వేర్ హౌసింగ్ సంస్థ ఇప్పడు తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. రియాల్టీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాంపాదించిన జీ స్క్వేర్ హౌసింగ్ హైదరాబాద్లోనూ ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను చేపట్టింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బీఎన్ రెడ్డి నగర్లో మొట్టమొదటి స్పోర్ట్ థీమ్డ్ లగ్జరీ ప్లాట్ కమ్యూనిటీని ‘జీ స్క్వేర్ ఈడెన్ గార్డెన్’ (G Square Eden Garden) పేరుతో గ్రాండ్గా లాంచ్ చేసింది. విలాసవంతమైన సౌకర్యాలు, కస్టమర్లు కొరుకునే వసతులు వంటివి ప్రత్యేకతలుగా ఉన్న ఈ ప్రాజెక్ట్ మొత్తం 65 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కమ్యూనిటీలలో నివసించేందుకు ఇష్టపడే వారికి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పచ్చు. ఇంతవరకు జీ స్క్వేర్ చేపట్టిన ప్రాజెక్ట్లన్నీ కూడా పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, మెట్రోలు, మాల్స్ వంటి వాటికి సులభమైన యాక్సెస్ని అందించే గేటెడ్ కమ్యూనిటీలే. అంతేకాకుండా తక్షణమే నిర్మాణాలు చేపట్టడానికి అనువుగా కూడా ఉంటాయి. కస్టమర్ల సౌకర్యాల విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ప్రాజెక్ట్ల రూపకల్పన వీరి స్పెషాలిటీ. ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఇందులో 484 ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీ(GHMC), TS (RERA) ద్వారా పూర్తి స్థాయి అమోదం పొందింది. ఇక్కడి నుంచి 5 నిమిషాల ప్రయాణం చేస్తే చాలు ఎల్బీ నగర్ సర్కిల్ చేరుకుంటాం ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ హైవేకి పక్కనే ఉండడం ప్లాటెడ్ కమ్యూనిటీలోని సభ్యులందరూ ప్రపంచ శ్రేణి వసతులతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తుంది. హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ పార్కులలో ఒకటిగా ఉన్న ఆదిబట్లకు సమీపంలో ఉన్న బీఎన్ రెడ్డి నగర్ సౌకర్యాలు అదరహా.. బ్లాక్-టాప్ రోడ్లు, ప్రీమియం స్ట్రీట్ లైట్లు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అద్బతమైన నీటి సరఫరా వ్యవస్థ, అత్యుత్తమ డ్రైనేజీ అవుట్లెట్ సిస్టమ్తో పాటు 5 సంవత్సరాల ఫ్రీ మెయిన్టెనెన్స్ జీ స్క్వేర్ ఈడెన్ గార్డెన్ లగ్జరీతో పాటు ప్రశాంతమైన లివింగ్ స్టైల్ కోరుకునే వారి కోసం 100+ ప్రపంచ స్థాయి సౌకర్యాలు తన కస్టమర్లకు అందిస్తోంది. అందులో 40+ ప్రత్యేకమైన స్పోర్ట్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సరసమైన ధరతో కూడిన ఈ విల్లా ప్లాట్లు ప్రాజెక్ట్ సొంతం. జీ స్క్వేర్ హౌసింగ్ సీఈఓ ఈశ్వర్ ఎన్ మాట్లాడుతూ ..‘‘ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించడం చాలా సంతోషంగా ఉంది. నగరంలో జీ స్క్వేర్ ఈడెన్ గార్డెన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాము. ఇందులో కస్టమర్లు కోరుకునే సౌకర్యాలు, లగ్జరీ వసతులు, రవాణా సదుపాయం, క్రీడా సౌకర్యాలు వంటి ఈ ప్రాజెక్ట్కు ఆకర్షణగా నిలుస్తాయి. ప్లాట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, నగరంలో తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్న వ్యక్తులకు ఇది గొప్ప అవకాశమన్నారు’’ (అడ్వర్టోరియల్) -
తొమ్మిది నెలల్లో 3.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో 3.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చా యి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 18 శాతం వృద్ధి అని కొల్లియర్స్ సర్వే వెల్లడించింది. ఆయా పెట్టుబడులలో 53 శాతం కార్యాలయ సముదాయంలోకి, 1,802 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. గతేడాదితో పోలిస్తే 537శాతం వృద్ధి రేటుతో రిటైల్ విభాగంలోకి 491 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. గిడ్డంగులు, నివాస సముదాయాల పెట్టుబడులు ఈసారి క్షీణించాయి. క్రితం ఏడాది జనవరి-సెప్టెంబర్లో ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్లోకి 895 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. ఈసారి 78శాతం తగ్గి 199 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇక గృహ విభాగంలో 472 మిలియన్ డాలర్ల నుంచి 42 శాతం క్షీణించి 276 మిలియన్ డాలర్ల పెట్టుబడులకు చేరుకున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ మార్కెట్లో సంస్థాగత పెట్టుబడులు జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో సంవత్సరానికి 2.5 రెట్లు పెరిగి 754 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది గత ఏడాది 301 మిలియన్ల డాలర్లతో పోలిస్తే. మొదటి తొమ్మిది నెలల్లో ఈ సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించింది, బెంగళూరులో పెట్టుబడులు 18 శాతం పెరిగి 317 మిలియన్ డాలర్ల నుంచి 375 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. చెన్నైకి ఇన్ఫ్లోలు 98 మిలియన్ డాలర్ల నుంచి 345 మిలియన్ డాలర్లకు పెరిగాయి.ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత పెట్టుబడులు 5 శాతం పెరిగి 452 నుంచి 477 మిలియన్ డాలర్ల చేరాయి. అయితే పూణేలో 96 శాతం క్షీణించి 232 9 మిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. ఇక హైదరాబాద్, కోల్కతాలో ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్లో ఎలాంటి పెట్టుబడులు రాలేదు. గత ఏడాది హైదరాబాద్కు 486 మిలియన్ డాలర్లు, కోలకతాకు 105 మిలియన్ల డాలర్లు వచ్చాయి. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థల సెంటిమెంట్ గ్లోబల్ మందగమనం ఉన్నప్పటికీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనే భావన బలంగా ఉందనీ, ద్రవ్యోల్బణం ,వడ్డీ రేట్లకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక స్థితిపై దీర్ఘకాలిక ప్రభావం లేదని సర్వే తెలిపింది. -
కొత్త జిల్లా కేంద్రాల్లో స్థిరాస్తి విలువల సవరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడుతున్న జిల్లా కేంద్రాల్లో స్థిరాస్తి మార్కెట్ విలువల్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సవరించనుంది. జిల్లాల నోటిఫికేషన్ వెలువడి నూతన జిల్లా కేంద్రాలు ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ మార్కెట్ విలువలు మారేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాధారణంగా ఏటా రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టులో మార్కెట్ విలువల్ని సవరిస్తారు. గతేడాది కోవిడ్ నేపథ్యంలో సవరణను వాయిదా వేశారు. 2022 ఏప్రిల్ వరకు సవరణ ఉండదని అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు ఆ గడువు ముగుస్తుండడంతో సవరణ కోసం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి రెండు విడతలుగా మార్కెట్ విలువల సవరణపై కసరత్తు మొదలు పెట్టారు. మొదట కొత్తగా ఏర్పడుతున్న జిల్లా కేంద్రాల్లో మార్కెట్ విలువలపై కసరత్తు చేశారు. ఆ తర్వాత వెంటనే రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ విలువల సవరణపైనా కసరత్తు పూర్తి చేశారు. వృద్ధి ఆధారంగా మార్కెట్ విలువల సవరణ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏ ప్రాంతంలో ఎంత పెంచాలి? ఆ ప్రాంతాల్లో జరిగిన వృద్ధి, కొత్తగా వచ్చిన పరిశ్రమలు, పెరిగిన వ్యాపారం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కెట్ విలువల్ని ప్రతిపాదించారు. వాటికి జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలు తాత్కాలిక అనుమతులు ఇచ్చాయి. వాటిని రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో ఉంచి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఆ తర్వాత కొద్దిపాటి మార్పులు చేసి మార్కెట్ విలువల్ని నిర్ధారించారు. ఆ విలువలకు జేసీ కమిటీల నుంచి తుది ఆమోదం కూడా తీసుకున్నారు. ఏ క్షణమైనా మార్కెట్ విలువల్ని సవరించడానికి అనువుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డేటా ఎంట్రీ కూడా చేసుకుని అమలు చేయడానికి రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లా కేంద్రాల పరిధిలో స్థిరాస్తి మార్కెట్ విలువల సవరణ అమలవుతుందని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. కొత్త జిల్లా కేంద్రాలు ప్రకటించాక ఆ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, స్థిరాస్తి లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
తెలంగాణకు రేవంత్రెడ్డి శనిలా పట్టాడు: హరీష్ రావు
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
TS: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు
బీజేపీ కుట్రలు అడ్డుకుంటాం: సీఎం రేవంత్
విండీస్ క్రికెటర్కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.... ఐదేళ్ల పాటు నిషేధం
భర్తతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయమన్న కత్రినా!
ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
తప్పక చదవండి
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement