-
అమ్మ చంద్రబాబూ.. అది నిజమేనట!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయపాటి సాంబశివరావు నుంచి రూ.150 కోట్లు తీసుకున్నారా? అయినా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ వ్యవహారంలో వారిని నాశనం చేశారా? చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లు ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు వీరి నుంచి డబ్బులు వసూలు చేసుకున్నారా? మామూలుగా ఇలాంటి ఆరోపణ మరెవరిమీద అయినా వచ్చి ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి,తదితర ఎల్లో మీడియా ఎంత భీబత్సంగా ప్రచారం చేసి ఉండేవి! ఆంగ్ల మీడియా సైతం ఎంత ప్రాధాన్యం ఇచ్చి ఉండేవి. కాని ఆశ్చర్యం ఏమిటంటే సాక్షి తప్ప ఇతర మీడియా ఏది పెద్దగా ప్రాచుర్యం ఇవ్వలేదు. చివరికి ఆంగ్ల మీడియాను కూడా మేనేజ్ చేసినట్లు అనిపిస్తుంది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఏమి చెప్పారో గుర్తు చేసుకోండి. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎం మాదిరి వాడుకున్నారని ఆయన ఆయా సభలలో అన్నారు. కాని దానిపై తదుపరి ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అంతేకాదు. 2019 లో టిడిపి ఓటమి తర్వాత చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ ఇంటిలో ఐటి శాఖ దాడులు చేసి సుమారు రెండువేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని గుర్తించినట్లు సిబిటిడి ప్రకటించింది. అయినా చంద్రబాబుకు ఏమీ కాలేదు. ఐదేళ్లు గడిచిపోయినా మోడీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తలేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అదే టైమ్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వంద కోట్ల అవినీతి జరిగిందో లేదు తెలియదు కాని నెలల తరబడి ఢిల్లీ ఆప్ మంత్రులు జైలులో గడపవలసి వస్తోంది. మన దేశ వ్యవస్థలలో ఎందుకు ఇంత తేడా వస్తోంది? ఒకే తరహా కేసుల్లో ఒకరికేమో ఆయా వ్యవస్థలలో పూర్తి సానుకూల నిర్ణయాలు వస్తుంటాయి. ✍️కొందరికేమో బెయిల్ రావడమే గగనం అవుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోల్చితే చంద్రబాబునాయుడుపై వచ్చిన అవినీతి ఆరోపణలు చాలా పెద్దవాటి కింద లెక్క. నిజంగానే చంద్రబాబుకు అవినీతితో సంబంధం లేకుంటే కేంద్రం కాని, ప్రధాన మంత్రి మోదీ కాని ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం తప్పు అవుతుంది. వాటిలో నిజం ఉంటే అలా వదలివేయడం సరైనదేనా అన్న చర్చ వస్తుంది. అంటే పలుకుబడి, మేనేజ్ మెంట్ నైపుణ్యాన్ని బట్టి కేసుల నుంచి తేలికగా బయటపడవచ్చన్న అభిప్రాయం కలగదా! బీజేపీ నేతలు అవినీతికి వ్యతిరేకంగా గంభీరంగా ప్రకటనలు చేస్తుంటారు. కాని చంద్రబాబు వంటి కొంతమందిపై వచ్చిన ఆరోపణల గురించి మాత్రం నోరు విప్పరు. ఇంకో సంగతి చెప్పాలి. న్యాయ వ్యవస్థ సైతం ఆయన పట్ల ఉదారంగా వ్యవహరిస్తుందా అన్న భావన ప్రజలలో కలుగుతుంది. ✍️ఎందుకంటే ఓటుకు నోటు కేసు విషయంలో సుప్రీంకోర్టులో సైతం ఏళ్ల తరబడి విచారణకే రాలేదంటే అది చంద్రబాబు నైపుణ్యం అని ఎవరైనా అనుకునే అవకాశం ఉంది కదా! చంద్రబాబు నాయుడు తనపై ఏ కేసు వచ్చినా స్టే తెచ్చుకోవడం ఆయన స్పెషాలిటీగా అంతా భావిస్తారు.ఒక సందర్భంలో ఆయనే ఒక మాట అన్నారు. తాను ఏ విషయంలోను టెక్నికల్ గా, లీగల్ గా దొరకనని చెప్పారు. ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎవరూ ఏమీ చేయలేకపోవడంతో అది వాస్తవం అనిపిస్తుంది. అలాంటిది ఎపి సిఐడికి స్కిల్ కార్పొరేషన్ స్కామ్ కేసులో చిక్కి ఏభై మూడు రోజులు జైలులో ఉండవలసి వచ్చింది. ✍️ఆయనకు కింది కోర్టులో బెయిల్ నిరాకరణ జరిగినా హైకోర్టులో మాత్రం పొందగలిగారు. విశేషం ఏమిటంటే బెయిల్ కోసం ఆయన తనకు నానా రకాల జబ్బులు ఉన్నాయని ఒక ప్రైవేటు ఆస్పత్రివారు ఇచ్చిన సర్టిఫికెట్ ను గౌరవ న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవడం. సాధారణంగా ఎవరికైనా ప్రభుత్వ డాక్టర్లు ఇచ్చే రిపోర్టును చూస్తారు. మరి చంద్రబాబు విషయంలో బిన్నంగా జరిగిందంటే అది ఆయన లాయర్ల గొప్పదనం అనుకోవాలి. సు నుంచి బయటకు వచ్చాక మాత్రం చంద్రబాబు డాక్టర్ లు ఇచ్చిన రిపోర్టులన్నీ అబద్దాలే అన్నట్లుగా ఆయన టూర్లు చేస్తున్నారు. మంచి జోష్ గా అరుపులు,పెడబొబ్బలు పెడుతూ ప్రసంగాలు చేస్తున్నారు. నిజంగా అంత తీవ్రమైన గుండె జబ్జు ఉన్న వ్యక్తి అలా చేయగలుగుతారా? న్యాయ వ్యవస్థ ఆ విషయాలను పరిశీలించదా అంటే ఏమి చెబుదాం. ✍️స్కిల్ కేసులో ఆయన మాజీ పిఎస్ శ్రీనివాస్ అమెరికా పారిపోయినా ఏమీ కాలేదు. ఈడి అధికారులు నలుగురిని అరెస్టు చేసినా, అసలు కేసే లేదని చంద్రబాబు తరపున వాదించగలుగుతున్నారు. గవర్నర్ అనుమతి లేకుండా కేసులు పెట్టడం తప్పు అంటూ ఆయన సుప్రింకోర్టుకు వెళ్లారు.దానిపై కూడా గౌరవ కోర్టువారు నెలల తరబడి తీర్పు ఇవ్వకపోవడం కూడా గమనించదగ్గ అంశమే. ఒకప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండేవారు. ఆయనకు కోటి రూపాయలు ఇచ్చానని హర్షద్ మెహతా అని స్టాక్ బ్రోకర్ చేసిన ఆరోపణ తీవ్ర కలకలం సృష్టించింది. దేశంలోని మీడియా అంతా దానిపై చిలవలు, పలవలుగా కదనాలు ఇచ్చేవి. ✍️చివరికి కోర్టుకు కూడా పివి వెళ్లవలసి వచ్చింది. కాని చంద్రబాబును మాత్రం మూడు దశాబ్దాలలో ఎవరూ కదల్చలేకపోయారు. ఎన్ని అవినీతి అభియోగాలు వచ్చినా సేఫ్ గా బయటపడుతుంటారు. ఆయనకు ఉన్న పట్టు అటువంటిదని అంతా నమ్ముతుంటారు. ఈ నేపద్యంలో తాజాగా గుంటూరు మాజీ ఎమ్.పి.రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు చేసిన ఆరోపణ ఎలాంటి పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంటుందన్నది చర్చనీయాంశం. ఈనాడు, జ్యోతి తదితర ఎల్లో మీడియా ఈ ఆరోపణలకు సంబంధించి కుక్కిన పేల మాదిరి నోరు మూసుకుని కూర్చున్నాయి. అయినా సోషల్ మీడియా ఉంది కనుక జనానికి విషయం తెలిసింది. చంద్రబాబు, లోకేష్ లు తమ కుటుంబాన్ని నాశనం చేశారని అంటూ చంద్రబాబు ఫోటోను రంగారావు నేలకేసి పగలకొట్టిన వీడియో వైరల్ గా మారింది. రాయపాటికి కాంగ్రెస్ టైమ్ లో పోలవరం టెండర్ దక్కింది. దానిని ఆయన కొంతమేర ఎక్జిక్యూట్ చేశారు. ✍️ఈలోగా శాసనసభ ఎన్నికలు రావడం, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోవడంతో ఆ పార్టీ ప్రముఖులంతా టీడీపీ లేదా వైఎస్సార్సీపీలోకి వచ్చేశారు. రాయపాటి కూడా టీడీపీలో చేరి నరసరావుపేట టిక్కెట్ పొందారు. టీడీపీలో చేరినా పోలవరం కాంట్రాక్టును రాయపాటి నుంచి తప్పించి నవయుగ సంస్థకు చంద్రబాబు అప్పగించారు. ఎంపీ గా మరోసారి గెలిచారన్న భావన తప్పితే రాయపాటి ఆర్దికంగా బాగా దెబ్బతిన్నారని చెబుతారు.గత ఎన్నికల సమయంలో రూ. 150 కోట్లు ఇచ్చామని, చంద్రబాబు,లోకేష్ లు ఒకరికి తెలియకుండా డబ్బు వసూలు చేసుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.సోమవారం పోలవారం అంటూ చంద్రబాబు చేసిన ప్రచారం అంతా బోగస్ అని ఆయన లోగుట్టు విప్పేశారు.టిడిపి రాజకీయ పార్టీ కాదని, ఒక వ్యాపార సంస్థ అని కూడా రాయపాటి సూత్రీకరించారు. ✍️దీనికి తోడు సత్తెనపల్లి సీటును తమ ప్రత్యర్ధి అయిన కన్నా లక్ష్మీనారాయణకు ఇవ్వడం కూడా రాయపాటి వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అయినా ఇన్నాళ్లు భరిస్తూ వచ్చి, ఎన్నికల సమయంలో బయటపడ్డారు. కట్టలు తెగిన ఆవేశంతో ఆయన మాట్లాడిన తీరు, పార్టీకి గుడ్ బై చెప్పిన వైనం అందరిని ఆశ్చర్యపరచింది. ఎంతగా నష్టపోయి ఉండకపోతే ఆయన ఇంతలా ఆవేదన చెందుతారా అన్నభావన కలుగుతుంది.దీనికి చంద్రబాబుకాని, ఆయన పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ కాని స్పందించలేక పోయారు. ఇక మరో కీలక నేత ,విజయవాడ ఎమ్.పి కేశినేని నాని పార్టీని వీడి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిపోవడం కాదు. ✍️ఆ పార్టీ తరపున పోటీచేయబోతున్నారు. చంద్రబాబు ,లోకేష్ లు ఎలా తన పట్ల అనుచితంగా వ్యవహరించింది ఆయన తెలియచెప్పారు. చంద్రబాబు పెద్ద మోసగాడని కూడా నిర్మొహమాటంగా పేర్కొన్నారు.తమ కుటుంబంలో చిచ్చుపెట్టారని ఆయన ఆరోపించారు.గుంటూరు, కృష్ణా జిల్లాలలో సామాజికపరంగా కూడా బలమైన నేతలుగా ఉన్న ఇద్దరు ప్రముఖులు పార్టీని వీడడమే కాకుండా, సంచలనాత్మకమైన ఆరోపణలు చేయడం సహజంగానే వచ్చే ఎన్నికలలో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.ఈ క్రమంలో రంగారావు వేసిన మరో ప్రశ్న కూడా ఆసక్తికరంగా ఉంది. లోకేష్ రాయలసీమలో కాకుండా మంగళగిరి నుంచి ఎందుకు పోటీచేస్తున్నారని ప్రశ్నించారు.. ఈసారి కూడా గెలవనివ్వబోమని ఆయన అంటున్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఎవరైనా టీడీపీలో చేరితే అదేదో వైఎస్సార్సీపీకి తీవ్రమైన నష్టం కలిగినట్లు టీడీపీ నేతలు, వారికి మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంటారు.మరి ఇప్పుడు కమ్మ సామాజికవర్గం నేతలే పలువురు టీడీపీకి రాం రాం చెప్పడమే కాకుండా సంచలన విషయాలు బయటపెడుతుండడం పై మాత్రం కిమ్మనడం లేదు.దీనిని బట్టే అర్దం కావడం లేదూ తెలుగుదేశం ఎంత ఆత్మరక్షణలో పడింది! - కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ -
నా ప్రాణానికి ఏదైనా జరిగితే లోకేశ్దే బాధ్యత
నగరంపాలెం: తనను కిరాయి మూకలతో హతమార్చేందుకు టీడీపీ రూ.50 లక్షల చందాలు వసూలు చేసిందని, దీనిపై గుంటూరు ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేశానని టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు తెలిపారు. గుంటూరు లక్ష్మీపురంలోని నివాసంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 13న గుంటూరు రీజినల్ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు వచ్చిన క్రమంలో ఈ చందాలు వసూలు చేశారన్నారు. వైజాగ్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి , చంద్రబాబుపై విమర్శలు మానుకోవాలని, లేకపోతే అంతు చూస్తామని బెదిరించారని చెప్పారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే వాడిని కాదన్నారు. తన ప్రాణానికి ఏదైనా జరిగితే అందుకు నారా లోకేశ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకి కొత్తకాదని, అందులో భాగంగానే రాయపాటి శైలజతో మాట్లాడిస్తున్నారని ధ్వజమెత్తారు. లోకేశ్ ఎక్కడా గెలవడని జ్యోస్యం చెప్పారు. యువగళానికి ఒక్క రోజు కూడా తాను వెళ్ళలేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలిచి ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని పేర్కొన్నారు. -
చంద్రబాబు, లోకేష్ పెద్ద బేవర్స్ గాళ్ళు..రాయపాటి రంగ రావు ఫైర్
-
చంద్రబాబు, లోకేశ్ దొంగలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కొడుకు లోకేశ్ దొంగలని, ఆ పార్టీ ఓ దిక్కుమాలిన పార్టీ అని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రాయపాటి రంగారావు చెప్పారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేశ్ ధన దాహానికి తమ కుటుంబం సర్వనాశనం అయిపోయిందని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్కు డబ్బే ముఖ్యమని, మరేమీ అవసరం లేదని అన్నారు. ఇక టీడీపీలో ఉండలేనని స్పష్టం చేశారు. పార్టీ కీ, పదవికి రాజీనామ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే తన కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్కు రాజీనామా చేసి టీడీపీలో చేరిన తాము ఆ పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశామన్నారు. గత ఎన్నికలకు ముందు తమ నుంచి రూ. 150 కోట్లు తీసుకున్నారని తెలిపారు. లోకేశ్, చంద్రబాబునాయుడు ఎంతెంత తీసుకున్నారో తమ వద్ద లెక్కలున్నాయన్నారు. తండ్రి, కొడుకు ఒకరికి తెలియకుండా మరొకరు డబ్బులు తీసుకున్నారన్నారు. డబ్బులు తీసుకుని కూడా పోలవరం ప్రాజెక్టు విషయంలో తమను సర్వ నాశనం చేశారన్నారు. చంద్రబాబు కమీషన్ల కోసం పోలవరాన్ని వాడుకున్నారని చెప్పారు. సోమవారం పోలవారం అని చంద్రబాబు చెప్పడం ఉత్త బోగస్ అని అన్నారు. చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష చేసింది కేవలం లంచాల కోసమేనని చెప్పారు. ప్రతి వారం డబ్బులు వసూలు చేశారని తెలిపారు. తమని హింసించి మరీ డబ్బులు వసూలు చేశారన్నారు. తమ ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టుకున్నారని అన్నారు. డబ్బులు వాడుకుని మూడు సంవత్సరాల తర్వాత మమ్మల్ని ప్రాజెక్టు నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు 75 శాతం పూర్తి చేసినట్లుగా చంద్రబాబు చెబుతున్నది పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. పేదల కోసం పని చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల కోసం పనిచేస్తున్నారని రంగారావు చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని సీఎం జగన్ ఒక సంవత్సరం బడ్జెట్ మొత్తం ఖర్చు పెట్టారని చెప్పారు. ఆ రెండేళ్లు ఆంధ్రప్రదేశ్ జీడీపీ ఎక్కువగా ఉందని రిజర్వ్ బ్యాంక్ వెబ్సైటే చెబుతోందని తెలిపారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయన్నారు. జగన్ అంటే తమకు ఇష్టమని, ఆయన సీటు ఇస్తే పోటీ చేస్తానని చెప్పారు. టీడీపీ ఫక్తు వ్యాపార సంస్థ తెలుగుదేశం రాజకీయ పార్టీ యే కాదని, ఫక్తు వ్యాపార సంస్థ అని ఆరోపించారు. ఆ పార్టీ ఉంది ప్రజల కోసం కాదని, కేవలం వాళ్లు బాగుపడటం కోసమేనని చెప్పారు. లక్ష ఉద్యోగాలు తెచ్చామని, శ్రీసిటీ కట్టించామన్నారని, కియా కంపెనీ తెచ్చామని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. కియా కంపెనీ తెస్తే అనంతపురంలో ఎందుకు ఓడిపోయారని అన్నారు. లోకేశ్ రాయలసీమలో కాకుండా మంగళగిరి ఎందుకొచ్చాడని ప్రశ్నించారు. లోకేశ్కు ధైర్యం ఉంటే రాయలసీమలో పోటీ చేయాలని సవాల్ చేశారు. మంగళగిరిలో లోకేశ్ను ఓడిస్తానని చెప్పారు. గతంలో మంగళగిరిలో కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావులను తామే గెలిపించుకున్నామని అన్నారు. బాబు, లోకేశ్ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కులచిచ్చు లేపుతున్నారని ఆరోపించారు. టీడీపీని నమ్ముకున్న వాళ్లంతా అప్పుల్లో ఉన్నారు తమ కుటుంబం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని, ఎవరినీ మోసం చేయలేదని తెలిపారు. తాను సత్తెనపల్లి సీటు అడిగినా, కన్నా లక్ష్మీనారాయణను నియమించారన్నారు. కన్నా నియామకంతో 83 ఏళ్ల తమ తండ్రి రాయపాటి సాంబశివరావు ఆవేదన చెందారన్నారు. 2014లో రాయపాటి సాంబశివరావు ఎంపీగా గెలిచాక కూడా టీడీపీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారని తెలిపారు. వినుకొండలో మంచినీటి పథకం తెస్తామని ఇచి్చన హామీని నిలబెట్టుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగితే చినబాబును అడగాలని చెప్పారన్నారు. ఇదేం పద్ధతని, లోకేశ్ ఏమైనా డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచారా అని నిలదీశారు. తామే కాదని, పార్టీని నమ్ముకున్న అనేకమంది అప్పుల్లో ఉన్నారని తెలిపారు. చనిపోయిన వారికి ఇన్సూ్యరెన్స్ ఇస్తానని డబ్బులు వసూలు చేసిన లోకేశ్ ఎంతమందికి ఇచ్చారని నిలదీశారు. చంద్రబాబు జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్ర ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. రెండు, మూడు లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారని, ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
తమిళనాడులో మీ సంగీతం కెరీర్ విజయాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement