-
2.5 లక్షలు దాటిన డిపాజిట్ల స్క్రూటీనీ అసాధ్యం
-
2.5 లక్షలు దాటిన డిపాజిట్ల స్క్రూటీనీ అసాధ్యం
దేశంలో పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో రెండున్నర లక్షల రూపాయలు మించిన ప్రతి డిపాజిట్పై నిఘా కొనసాగుతుందని, ఆ మొత్తాలకు సరైన రాబడి మార్గాన్ని చూపించకపోతే వాటిపై 200 శాతం జరిమానా విధిస్తామని కేంద్రప్రభుత్వం చెబుతోంది. కానీ.. 125 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో బ్యాంకు డిపాజిట్లపై నిఘా వేసి, వాటిని పరిశీలించే శక్తిసామర్థ్యాలు మన ఆదాయపన్ను శాఖకు ఉన్నాయా? ప్రస్తుతం కొనసాగుతున్న విధానం ఏమిటి? 2014-2015 ఆర్థిక సంవత్సరాన్నే పరిగణనలోకి తీసుకుంటే దేశంలో 5.16 కోట్ల మంది మాత్రమే ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేశారు. అంటే మొత్తం జనాభాలో నాలుగు శాతం మంది మాత్రమే ఈ రిటర్న్స్ను సమర్పించారు. అమెరికాలోనైతే ఇది 45 శాతం ఉంటుంది. మన ఆదాయ పన్నుశాఖ అధికారులు మొత్తం ఐదు కోట్ల రిటర్న్స్లో కేవలం మూడున్నర లక్షల రిటర్న్స్ను మాత్రమే ర్యాండమ్గా స్క్రూటినీ చేయగలిగారు. ఎప్పుడైనా ఆదాయ పన్ను శాఖ అధికారులు 'కంప్యూటర్ యాడెడ్ స్క్రూటినీ సెలెక్షన్' ద్వారా వీటిని ర్యాండమ్గా పరిశీలిస్తారు. సరైన డేటా లేని రిటర్న్స్లో కొన్నింటిని మాత్రమే మాన్యువల్గా తనిఖీ చేస్తారు. ర్యాండమ్గా చెక్ చేసిన మూడున్నర లక్షల రిటర్న్స్లో భారీ అవకతవకలున్నట్లు అనుమానం వచ్చిన కేసుల్లోనే ఆదాయపన్ను శాఖ అధికారులు స్పందించి సదరు వ్యక్తులకు నోటీసులు జారీచేస్తారు. వాటికి వచ్చే వివరణలను పరిశీలించగా వారిపై తీసుకోవాల్సిన చర్యల గురించి సిఫార్సు చేస్తారు. ఆదాయపన్ను శాఖలో ప్రస్తుతమున్న సిబ్బంది ప్రకారం ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి దాదాపు రెండేళ్లు పడుతోంది. ఈ శాఖలో ప్రస్తుతం 70,000 పోస్టులుండగా, వాటిలో 30 శాతం ఖాళీలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెండున్నర లక్షల రూపాయలు దాటిన అన్ని డిపాజిట్లను స్క్రూటినీ చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదేశించింది. నవంబర్ తొమ్మిదో తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు రెండున్నర లక్షల రూపాయల డిపాజిట్ దాటిన ఖాతాలన్నింటినీ స్క్రూటినీ చేయడం, ఇప్పటికన్నా రెట్టింపు సిబ్బంది ఉన్నా కూడా అసాధ్యం. మళ్లీ పాత పద్ధతిలో కంప్యూటర్ ర్యాండమ్ తనిఖీలే శరణ్యం. గతంలో మూడున్నర లక్షల కేసులను స్క్రూటినీ చేయగా ఇప్పుడు ఓవర్ టైమ్ చేసినా గరిష్టంగా ఐదు లక్షల కేసులను స్క్రూటినీ చేయగలమని పేరు బహిర్గతం చేయడానకి ఇష్టపడని ఆదాయ పన్ను శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇది నిజంగా హిమాలయన్ టాస్క్ అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కేకేఎన్ కుట్టీ మీడియాతో వ్యాఖ్యానించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
టాలీవుడ్ యాంకర్ అరుదైన ఘనత
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)
ఆసీస్ యువ సంచలనానికి లక్కీ ఛాన్స్.. వరల్డ్కప్ జట్టులో చోటు!?
పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది
హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
తారక్ అభిమానుల మంచి మనసు.. 'రా ఎన్టీఆర్ 2.0' టీమ్ రక్తదానం
నా ఆల్టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అతడే: టీమిండియా స్టార్
సెంటరాఫ్ అట్రాక్షన్గా ఉండాలనే తపన ..!
తప్పక చదవండి
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement