-
అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యం
చిట్వేలి: సమాజంలో బడుగు, బలహీన అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతే తమ పార్టీ లక్ష్యమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అన్నారు. చిట్వేలి మండలం యన్.ఉప్పరపల్లెలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని, విలేకరులతో మాట్లాడారు. పార్టీ బలోపేతానికి పాటు పడుతున్న కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయక పోయినా పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు నాయకులు గణాంకాలతో గొప్పలు చెప్పుకుంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులురెడ్డి, నాయకులు చొప్పా వెంకటరెడ్డి, మహేష్రెడ్డి, సతీష్రెడ్డి, చంగల్రెడ్డి, రమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు గౌసియా, నరసింహులు, కరిముల్లాఖాన్, బషీరుద్దీన్, వెంకటరమణ, లోకేష్, పద్మాకర్ పాల్గొన్నారు. -
మిథున్రెడ్డిపై కేసు వెనుక రాజకీయ కుట్ర
తిరుపతి: రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, కొరముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. మంగళవారం తిరుపతిలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. దురుద్దేశపూర్వకంగానే మిథున్రెడ్డిపై కేసు పెట్టారని విమర్శించారు. ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని మిథున్రెడ్డిపై పెట్టిన కేసు ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు. -
ప్రభుత్వాన్ని కూల్చం: సాయిప్రతాప్
న్యూఢిల్లీ: తమ రాజీనామాలతో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం పడిపోదని రాజంపేట కాంగ్రెస్ ఎంపీ సాయిప్రతాప్ అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదన్నారు. తన రాజీనామా ఆమోదం కోసం ఆయన నేడు లోక్సభ స్పీకర్ మీరాకుమార్ కార్యాలయానికి వచ్చారు. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వెనుదిరిగారు. ఈ సందర్భంగా సాయిప్రతాప్ మాట్లాడుతూ రాజీనామా ఆమోదం కోసం స్పీకర్ను కలవాలని వచ్చినట్టు తెలిపారు. రాజీనామా ఆమోదంపై కోర్టుకు వెళ్లే ఉద్దేశం తనకు లేదన్నారు. స్పీకర్ అపాయింట్మెంట్ కోరామన్నారు. రాజీనామాల ఆమోదం కోసం ఉండవల్లి, లగడపాటి, అనంత, తాను ఒత్తిడి చేస్తున్నామని చెప్పారు. సమైక్యవాద పార్టీల నాయకులను తమ పార్టీ నేతలు కలిస్తే తప్పేందని ఆయన ప్రశ్నించారు. అంతకుముందు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా స్పీకర్ కార్యాలయానికి వచ్చారు. స్పీకర్ లేకపోవడంతో అక్కడి నుంచి ఆయన వెనుదిరిగారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తెలంగాణలో రైతుల్ని నిండా ముంచిన అకాల వర్షం
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
థియేటర్ కు వచ్చిన వారం రోజుల్లోనే..ఓటీటీలోకి కృష్ణమ్మ మూవీ..
‘డియర్ ఉమ’కు స్పెషల్ బర్త్డే విషెస్
ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
RCB vs CSK: ప్లే ఆఫ్స్ బెర్తుకై చావో రేవో
సన్రైజర్స్ ఫ్యాన్స్తో కలిసి బిర్యానీ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే?(ఫొటోలు)
లక్నో విజయం.. ఓటమితో ముగించిన ముంబై!అట్టడుగున
తప్పక చదవండి
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- మీటింగ్కు రమ్మనేవారు.. ఆడిషన్ మాత్రం కాదనేవారు!: నటి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- IPL 2025: ముంబైకి రోహిత్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్!
- BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
- టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
Advertisement