-
రాష్ట్రం భూమి ఇచ్చినా.. రైల్వేజోన్పై కేంద్రందే కిరికిరి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్, విభజన చట్టంలోని హామీ అయిన విశాఖపట్నం రైల్వేజోన్కు సంబంధించిన కూత ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ వినిపించలేదు. పైగా దీనిపై కేంద్రం మరోసారి కిరికిరీ పెడుతోంది. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఢిల్లీలో విలేకరుల సమా వేశంలో జోన్ అంశంపై నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెట్టేసేందుకు యత్నించారు. రైల్వేజోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాల్సి ఉందని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంది.కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కప్పిపుచ్చేందుకు సమాధానాన్ని దాటవేసే ఉద్దేశంతోనే ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై నెపం నెట్టేసేందుకు ప్రయత్నిస్తూ అసత్య ఆరోపణలు చేయడం విభ్రాంతి కల్గించింది. ఎందుకంటే.. కేంద్రమంత్రి చెప్పిన 52 ఎకరాలకు, రైల్వేజోన్ వ్యవ హారానికి అసలు ప్రత్యక్ష సంబంధమేలేదు. ఆయన చెబుతున్న 52 ఎకరాలను రైల్వేకు కేటాయించకుండా తాత్సారం చేసింది గత టీడీపీ ప్రభుత్వం. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఆ 52 ఎకరాలను రైల్వేకు అప్పగిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. గత నెల 2న జీవీఎంసీ కమిషనర్ రైల్వే అధికారులకు లేఖ రాశారు. వాస్తవాలిలా ఉంటే.. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఇందుకు విరుద్ధంగా రైల్వేజోన్పై అవాస్తవాలు వల్లెవేశారు. కేవలం ఒ డిశాలోని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ యన ఈ విధంగా మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ వ్యవహారాన్ని తాత్సారం చేస్తున్నట్లుగా స్పష్ట మవుతోంది. అసలు ఈ రైల్వేజోన్ అంశంపై వాస్తవాలు ఏమిటంటే.. ► విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ను రైల్వే శాఖ రూపొందించింది. భవనాలు, ఇతర అవసరాల కోసం విశాఖలో 950 ఎకరాలు అందుబాటులో ఉందని స్పష్టంగా పేర్కొంది. ► రాష్టప్రభుత్వ ఒత్తిడితో విశాఖపట్నంలో రైల్వే జోన్ కార్యాలయాల నిర్మాణానికి గతేడాది రూ.170 కోట్లు కూడా కేటాయించింది. ► రైల్వేజోన్ ఆచరణలోకి రావాలంటే సాంకేతికంగా కీలక అంశాలపై కేంద్రం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోంది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్, సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేజోన్లతో ఏపీ పరిధిలో ఆస్తుల పంపకం, కొత్త డివిజన్ల ఏర్పా టు, ఉద్యోగుల కేటాయింపు, కొత్త కార్యాలయా ల ఏర్పాటు తదితర అంశాలను ఓ కొలిక్కి తీసు కువచ్చి దక్షిణ కోస్తా రైల్వేజోన్ను ఆచర ణలోకి తీసుకురావాలి. కానీ.. కేంద్రం బడ్జెట్లో ఈ విషయాలేవీ కనీసం ప్రస్తావించలేదు. ► ఇక రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించనందునే రైల్వేజోన్ ఏర్పాటులో జాప్యం జరుగుతోందన డం హాస్యాస్పదం. ఎందుకంటే.. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రైల్వే భూమికి బదులుగా రైల్వేశాఖకు భూమి కేటాయించాలని ఆయన చెబుతున్నారు. కానీ, విశాఖలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2013లో రైల్వే భూములను తీసుకుంది. అందుకు ప్రత్యామ్నాయంగా రైల్వేశాఖకు 52 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖ మధ్య అంతకుముందే ఒప్పందం కుదిరింది. అంటే.. రాష్ట్ర విభజనకు ఏడాది ముందు సంగతి అది. ► 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించారు. విభజన చట్టంలో విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీకి అంతకుముందటి రైల్వే భూమి తీసుకున్న దానికి సంబంధమేలేదు. ఆ అంశంతో ముడిపెట్టకుండా విభజన చట్టం ప్రకారం రైల్వేజోన్ను ఏర్పాటుచేయాలి. అందుకోసం 950 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని కూడా డీపీఆర్లో కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా పేర్కొంది. ఆ విషయాన్ని కప్పిపుచ్చుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యకరం. ► వాస్తవానికి రైల్వేకు కేటాయించాలని 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన 52 ఎకరాలపై వివాదం ఏర్పడింది. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రైల్వేశాఖ అధికారులు ప్రయత్నిస్తే అక్కడి గిరిజనులు అడ్డుకున్నారు. సమస్య సున్నితంగా మారడంతో రైల్వేశాఖ వెనక్కి తగ్గింది. దీనిపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కూడా మౌనంగా ఉండిపోయింది. అప్పట్లో కూడా రైల్వేశాఖ ఆ విషయంపై పట్టుబట్టలేదు. ► ఇక భూమి సమస్యతోనే రైల్వేజోన్ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని రైల్వేశాఖ ఇప్పటివరకు చెప్పనేలేదు. రైల్వేజోన్ అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఈ నాలుగున్నరేళ్లలో ఎన్నోసార్లు సమావేశమయ్యారు. ఏ ఒక్క సమావేశంలో కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించనేలేదు. రెల్వేకు 52 ఎకరాలు అప్పగింత.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఇంకా అప్పగించలేదని చెబుతున్న 52 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైల్వేకు అప్పగించేసింది. ఈ మేరకు గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఆ భూముల్లో ఉన్న ఆక్రమణలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించారు. వాటిని పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్నారు. జీవీఎంసీ పరిధిలోని ముడసర్లోవ సర్వే నెంబర్లు 57, 58, 59, 61, 62, 63, 64, 65తో ఉన్న 52 ఎకరాలను రైల్వేశాఖకు అప్పగించారు. ఈ మేరకు జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ సీఎం శ్రీకాంత్ వర్మ ఈ ఏడాది జనవరి 2నే విశాఖలోని ఈస్ట్కోస్ట్ డీఆర్ఎంకు లేఖ ద్వారా తెలియజేశారు. వాస్తవం ఇలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం భూమిని అప్పగించలేదని రైల్వేమంత్రి వ్యాఖ్యానించడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు ఢిల్లీలోని పచ్చమీడియా ప్రతినిధులు ఉద్దేశపూర్వకంగా అడిగిన ప్రశ్నలకు ప్రభావితమైన ఆయన అవాస్తవాలు మాట్లాడడం కేంద్రమంత్రి స్థాయికి తగినట్లుగా లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఒడిశాలో రాజకీయ ప్రయోజనాల కోసమేనా? ఒడిశాలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నది స్పష్టమవుతోంది. ప్రధానంగా విశాఖ కేంద్రంగా వాల్తేర్ రైల్వే డివిజన్ను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తుండగా.. వాల్తేర్ రైల్వే డివిజన్ను రద్దుచేసి.. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్ల తోనే కొత్త జోన్ ఏర్పాటుపై డీపీఆర్లో ప్రస్తావించారు. దీనిపై రాష్ట్రంలో తీవ్ర విమర్శలు వ్యక్తమ య్యాయి. ఎందుకంటే.. విజయవాడ నుంచి విశాఖ 350 కి.మీ. దూరంలో ఉండగా.. రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఇచ్చాపురం 580 కి.మీ. దూరంలో ఉంది. అంతవరకు విజయవాడ రైల్వే డివిజన్గా ఏర్పాటుచేస్తే పరిపాలన నిర్వహణ సమస్యలు ఏర్పడతాయి. అందుకే వాల్తేర్ రైల్వే డివిజన్ను కొనసాగిస్తూనే విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తూర్పు కోస్తా జోన్లో అత్యధిక రాబడి ఉన్న వాల్తేర్ డివి జన్ను రద్దుచేయాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్ ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. ఒడిశాలో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే ఇలా వ్యవహరిస్తోంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశా కేడర్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కావడంతో ఆయన ఒడిశాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆర్థిక వృద్ధిలో ‘దూసుకుపోతున్న’ వాల్తేరు డివిజన్
సాక్షి, విశాఖపట్నం/ తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): కోవిడ్ మహమ్మారి వెంటాడుతున్న సమయంలోనూ వాల్తేరు రైల్వే డివిజన్ సాధించిన ఆర్థిక ప్రగతి అద్భుతమని రైల్వే బోర్డు మెంబర్ ఫైనాన్స్ (ఫైనాన్స్ కమిషనర్) నరేష్ సలేచా ప్రశంసించారు. విశాఖలోని డీఆర్ఎం కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. డివిజన్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు 2020–21లో కోవిడ్ సమయంలో వాల్తేర్ డివిజన్ ప్రగతి, ఆదాయ వనరులు, డివిజన్ పరిధిలో చేపట్టిన వినూత్న ప్రాజెక్టులు, ప్రయాణికుల సదుపాయాలు, భద్రతాపనులు, ఇతర అభివృద్ధి పనుల గురించి డీఆర్ఎం చేతన్కుమార్ శ్రీ వాస్తవ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రైల్వే స్థలాలు, స్టేషన్ పరిసరాల ద్వారా ఆదాయ వనరులను సమీకరించుకోవడంలో వాల్తేర్ డివిజన్ వినూత్న పద్ధతుల్ని అవలంభిస్తున్నదని నరేష్ సలేచా కొనియాడారు. అన్ని విభాగాల్లోనూ మిగిలిన త్రైమాసికాల్లో ఇదే తరహా వృద్ధి సాధించాలని సూచించారు. ఈస్ట్కోస్ట్ రైల్వే ప్రిన్సిపల్ ఫైనాన్స్ అడ్వయిజర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఆర్.ఎస్.మిత్రా, వాల్తేర్ డివిజన్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ రాజారామ్, ఏడీఆర్ఎం అక్షయ్ సక్సేనా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, విశాఖ డివిజన్ని కొనసాగిస్తూ.. తూర్పు కోస్తా రైల్వే జోన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు అందించేందుకు ఉద్యోగ సంఘాలు ప్రయత్నించగా.. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. -
రూ.వెయ్యితో ఏం చేయాలి..?
నలుగురు ఉన్న ఫ్యామిలీ సినిమాకి వెళ్తే కనీసం రూ.2 వేలు ఖర్చవుతుంది.ఇంట్లో చిన్న మరమ్మతు చేయాలన్నా వెయ్యికి పైగానే ఖర్చవుతుంది..చిన్న షాపులో మౌలిక వసతులు కల్పించాలంటే కనీసం 10 వేలు చేతిలో ఉండాల్సిందే..మరి.. ప్రపంచంలోని అతి పెద్ద వ్యవస్థల్లో ఒకటిగా చెప్పుకొంటున్న రైల్వేలో ఓ చిన్నపాటి ప్రాజెక్టు ప్రారంభించాలంటే..?కనీసం లక్షల నుంచి కోట్లలోనే అవసరమవుతాయి.. ఒక ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధం చేయాలంటేనే లక్ష రూపాయల వరకు వెచ్చించాల్సిందే..అలాంటిది.. దాని కోసం రూ.వెయ్యి మాత్రమే ఇస్తే..?!వాటితో ఏం చేస్తారు.?ఏమో..? సదరు రైల్వే మంత్రిత్వ శాఖకే తెలియాలి!ఆ వెయ్యి రూపాయలు కేటాయించిందీ.. ఏవో మిసిలేనియస్(చిల్లర) ఖర్చులకు కాదండోయ్..రూ.లక్షలు.. కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టులకు.. పెళ్లికి చదివించినట్లు వెయ్యి రూపాయలు చొప్పున కేటాయించారు.2020–21 బడ్జెట్లో చేసిన కేటాయింపులు చూస్తే.. ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు.ఆ ప్రాజెక్టులేంటో..? వెయ్యి రూపాయల విడ్డూరమేంటో.. ఓసారి చదివేద్దాం.. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పార్లమెంటులో ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో వాల్తేరు డివిజన్కు విదిల్చిన నిధుల వివరాలు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు రూ.170 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం.. బడ్జెట్లో మాత్రం రూ.3 కోట్లు విదిల్చిన వైనం చూస్తే.. జోన్ ఏర్పాటుకు ఇప్పట్లో కేంద్రం సిద్ధంగా లేదన్న విషయం అర్థమైపోతుంది. ప్రస్తుతం తూర్పుకోస్తా రైల్వే జోన్ పరిధిలో ఉన్న వాల్తేరు డివిజన్కు చేసిన కేటాయింపులూ ఏమంత ఆశాజనకంగా లేవు. మొత్తంగా డివిజన్కు రూ.878 కోట్లు మంజూరు చేశారు. ఇందులో 2, 3 లైన్ల నిర్మాణాలకు రూ.580.50 కోట్లు ఇవ్వగా.. ప్రాజెక్టులకు రూ.94.98 కోట్లు కేటాయించారు. అదేవిధంగా సిగ్నల్ వ్యవస్థ, వంతెనలు, సబ్వే నిర్మాణాలు, యార్డుల ఆధునికీకరణ, ట్రాక్ మరమ్మతులు సహా ఇతర పనులకు మొత్తం రూ.202.40 కోట్లు కేటాయించారు. ఇదంతా ఒకెత్తయితే.. కొన్ని ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులు మరీ హాస్యాస్పదంగా ఉన్నాయి. అబ్బో.. వెయ్యి రూపాయలా..?! బడ్జెట్కు సంబంధించి రైల్వే బోర్డు బుధవారం విడుదల చేసిన పింక్ బుక్లో వాల్తేరు డివిజన్, విశాఖపట్నం రైల్వే స్టేషన్ పేర్లు అనేక చోట్ల కనిపిస్తున్నాయి కానీ.. ఆయా ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల అంకెలు మాత్రం అవాక్కయ్యేలా చేస్తున్నాయి. నిర్మాణాలకు కావల్సిన మెట్రిక్ టన్ను ఐరన్ కొనుగోలుకే కనీసం రూ.40వేలు అవసరం. అలాంటిది ఒక రైల్వే యార్డు రీ మోడలింగ్కు రూ.1000 ఇస్తే.. అది దేనికి పనికొస్తుంది? అదే విధంగా రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు వెయ్యి రూపాయిలిస్తే ఏం చేసుకుంటారు..?? కానీ చాలా కేటాయింపులు అలాగే ఉన్నాయి. పోనీ అవేమైనా.. వేలు, లక్ష రూపాయతో పూర్తయ్యే పనులా అంటే.. అదీ కాదు.. కనీసం అర కోటి అయినా కేటాయించకపోతే.. పనులు పట్టాలెక్కని పరిస్థితి. అలాంటిది కేవలం వెయ్యి రూపాయిలిచ్చి.. పని చేపట్టమంటే ఏం చేయాలని వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు సైతం విస్తుపోతున్నారు. ఇంతకీ రూ.1000 అందుకున్న పనులు..వాటి వాస్తవ అంచనా వ్యయం చూద్దాం ♦ విజయనగరం–కొత్తవలస మధ్య 34.7 కిమీ మేర మూడోలైన్ అంచనా వ్యయం రూ. 288.37 కోట్లు.. గత రెండు బడ్జెట్లలో రూ.254 కోట్లు ఇచ్చినా.. ఈ బడ్జెట్లో వెయ్యి మాత్రమే ఇచ్చారు. ♦ ఉత్తర సింహాచలం–గోపాలపట్నం మధ్య 2.07 కిమీ బైపాస్ లైన్ డబ్లింగ్ పనుల అంచనా వ్యయం రూ.2.60 కోట్లు. దీనికి ఇప్పుడు వెయ్యి, గత బడ్జెట్ రూ.లక్ష కేటాయించారు. ♦ ఉత్తర సింహాచలం, గోపాలపట్నం యార్డు రీ మోడలింగ్ వ్యయ అంచనా రూ.11.27 కోట్లు ♦ డివిజన్ పరిధిలోని 36 ప్రాంతాల్లో ఇంటర్లాక్డ్ లెవల్ క్రాసింగ్ల వద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ సప్లై పనులు ♦ డివిజన్ పరిధిలోని మరో 10 మానవ రహిత లెవల్ క్రాసింగ్ల పనులు ♦ విశాఖ రైల్వే స్టేషన్ పరిధిలోని 15 లెవల్ క్రాసింగ్ల వద్ద పనులు ♦ 140 మానవ రహిత లెవల్ క్రాసింగ్ పనులు ♦ కొత్తవలస–పెందుర్తి మధ్య 484 మైలు రాయి వద్ద 2 లెవల్ క్రాస్ పనులు ♦ పలాస–విశాఖపట్నం మధ్య 20.28 కిమీ ట్రాక్ రెన్యువల్ పనులు ♦ పలాస– విశాఖపట్నం మధ్య 134 చోట్ల ట్రాక్ మరమ్మతులు ♦ కొత్తవలస– కిరండూల్ మధ్య 6 స్టేషన్లలో టెలికమ్యునికేషన్ పనులు ♦ పలాస–విశాఖపట్నం మధ్య 10 ఎలక్ట్రానిక్ ఇంటర్లాక్డ్ వ్యవస్థకు చెందిన గూమ్టీల వద్ద సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ పనులు ♦ విశాఖపట్నం సెంట్రల్ సిక్లైన్ అప్గ్రెడేషన్, ఓర్ ఎక్సే్ఛంజ్ సెంటర్ వ్యాగన్ డిపో పనులు ♦ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారాల్లో షెల్టర్ల నిర్మాణం ♦ విశాఖ రైల్వే స్టేషన్లో 7, 8 ప్లాట్ఫారాల్లో మౌలిక సదుపాయాలు కల్పన ♦ విశాఖ రైల్వే స్టేషన్లోని 6, 7, 8 ప్లాట్ఫారాల దక్షిణ భాగంలో మెట్లు, ర్యాంపుల నిర్మాణ పనులు ♦ విశాఖ రైల్వే స్టేషన్లో సెంట్రల్ ఫుట్ఓవర్ బ్రిడ్జి విస్తరణ పనులు ♦ ఎస్.కోట, అరకు రైల్వే స్టేషన్ల మధ్య పలు ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులు ♦ విశాఖ రైల్వే స్టేషన్ పరిధిలో మల్టీ డిసిప్లినరీ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం కొసమెరుపు.. పెళ్లిళ్లకు, పేరంటాలకు చదివించినట్లు.. పైన పేర్కొన్న వెయ్యి రూపాయలు చొప్పున జరిపిన విదిలింపులపై రైల్వే ఉద్యోగులు సైతం ఇది మా శాఖ చదివింపుల కార్యక్రమం అంటూ సెటైర్లు వేస్తున్నారంటే.. కేటాయింపులు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో వేరే చెప్పక్కర్లేదు. -
ఈ బంధం ఇంతేనా?!
శతాబ్దానికిపైగా మహోజ్వల చరిత్ర.. ఆదాయంలో బంగారు బాతు.. ఎన్నో ప్రతిష్టాత్మక వ్యవస్థలు.. ఇవన్నీ వాల్తేర్ రైల్వే డివిజన్ సొంతం. ఇప్పుడవన్నీ చరిత్రలో కలిసిపోక తప్పదా?.. వాల్తేర్ డివిజన్ ఉనికి ఇక చరిత్రగానే మిగిలిపోనుందా??.. విశాఖతో డివిజన్ బంధం తెగిపోక తప్పదా???.. రైల్వే బోర్డు నుంచి వస్తున్న ఆదేశాలు.. ఈ ప్రశ్నలన్నింటికీ అవననే సంకేతాలనే ఇస్తున్నాయి. వాల్తేర్ డివిజన్ విభజన తథ్యమని చెబుతున్నాయి. ఆంధ్రుల చిరకాల డిమాండ్, రాష్ట్ర విభజన చట్టంలోని కీలక హామీ అయిన విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపిన కేంద్ర ప్రభుత్వం.. అదే సమయంలో.. ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో మొట్టిన చందంగా.. వాల్తేర్ డివిజన్పై వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ డివిజన్ను రెండుగా విభజించి ఒక భాగాన్ని విజయవాడ డివిజన్లో కలపడం.. మరో భాగంతో ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయడం.. వంటి దురదృష్టకర నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ఆగస్టు 31లోగా రాయగడ డివిజన్ ఏర్పాటుకు అవసరమైన పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ దిశగా చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుదీర్ఘ చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ విచ్ఛిన్నాన్ని స్థానికులు, ప్రజాసంఘాలతోపాటు రైల్వే యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే జోన్ వచ్చిందన్న ఆనందం.. అదే ఉత్తర్వుల్లో కేంద్రం పెట్టిన మెలికతో నీరుగారిపోయింది. విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ను అడ్డంగా విడదీసి ఒక భాగాన్ని కొత్త జోన్ పరిధిలోకి వచ్చే విజయవాడ డివిజన్లో కలపాలని నిర్ణయించారు. మిగిలిన భాగాన్ని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్గా మార్చాలని నిర్ణయించడం ద్వారా వాల్తేర్ డివిజన్ ఉనికే లేకుండా చేస్తున్నారు. ఆగస్టు 31లోగా కొత్త డివిజన్ తూర్పు కోస్తా జోన్ పరిధిలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుకు రైల్వే బోర్డు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వాల్తేరు డివిజన్ విభజన, కొత్త డివిజన్ ఏర్పాటు, నిర్వహణకు విధివిధానాలు రూపొందించాలని రైల్వేబోర్డు నుంచి తూర్పు కోస్తా జోన్ జనరల్ మేనేజర్కు ఆదేశాలు అందాయి. కొత్త డివిజన్ డీపీఆర్తోపాటు ఇతర వ్యవహారాల పర్యవేక్షణకు వెంటనే ఒక నోడల్ అధికారిని నియమించాలని రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేంద్రసింగ్ ఆదేశించారు. వాల్తేరు డివిజన్ అధికారులు, దక్షిణ కోస్తా జోన్ ఓఎస్డీతో కొత్తగా నియమితులయ్యే నోడల్ అధికారిని సమన్వయం చేసుకుంటూ కొత్త డివిజన్కు రూపకల్పన చేయాలని సూచించారు. దీనికి సంబంధించి పూర్తి నివేదికను ఆగస్టు 31లోగా తమకు అందించాలని సూచించారు. ఈ పరిణామాలతో వాల్తేరు డివిజన్ విభజన ఖరారయినట్లే. సింహభాగం ఆదాయం వాల్తేరుదే.. తూర్పు కోస్తా రైల్వే జోన్కు వాల్తేరు డివిజన్ బంగారు బాతులాంటిది. అతిపెద్దదైన ఈ డివిజన్ పరిధిలో ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్కు ఏటా సుమారు రూ. 15 వేల కోట్ల ఆదాయం వస్తుండగా.. ఇందులో రూ.7 వేల కోట్లు ఒక్క వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది తూర్పుకోస్తా ప్రధాన కేంద్రం భువనేశ్వర్ (రూ.12–14 లక్షలు) కంటే ఎక్కువ. 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. డివిజన్ ఆదాయంలో సింహభాగం ఐరెన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. ఇదంతా ఇప్పుడు రాయగడ డివిజన్ సొంతమవుతుంది. ఉద్యోగులకూ తీవ్ర ఇబ్బందులు వాల్తేరు డివిజన్ ఉనికి కోల్పోతే దీని పరిధిలోని ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రస్తుతం డివిజన్లో 16,600 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే నివాసముంటున్నారు. డివిజన్ను విడదీసి అటో ముక్క.. ఇటో ముక్క కలిపేస్తే వీరికి డివిజన్ కేంద్రం ఉండది. జోనల్ హెడ్ క్వార్టర్స్తో పనీ ఉండదు. జీత భత్యాలు, అలవెన్సుల్లో తేడాలొచ్చినా, సెలవు పెట్టాలన్నా, ఇతర సమస్యలున్నా విజయవాడ డివిజన్కు పరుగులు తీయాల్సిందే. ఇక రాయగడ డివిజన్కు కేటాయించే ఉద్యోగులు కుటుంబాలతో సహా అక్కడికి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఉద్యోగులకు ఇబ్బందికరమైన పరి ణామాలేనని యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో అఖిల భారత ఓబీసీ రైల్వే ఎంప్లాయిస్ ఫెడరేషన్, ఈస్ట్కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్తో పాటు వివిధ యూనియన్లు.. వాల్తేర్ డివి జన్ను కొనసాగించాలంటూ ఉద్యమాలు నిర్వహించాయి. తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. డివిజన్ కొనసాగించాల్సిందే శతాబ్దానికిపైగా చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ను ఉనికి లేకుండా విడదీయాలనుకోవడం సరికాదు. దీనివల్ల ఉద్యోగుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ డివిజన్కు భారతీయ రైల్వే చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ విషయంలో రాజీలేని పోరాటం చేస్తాం. ప్రజలు, అన్ని యూనియన్లు, వివిధ ప్రజాసంఘాలు కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. – డా. పెదిరెడ్ల రాజశేఖర్, సంయుక్త కార్యదర్శి, ఆలిండియా ఓబీసీ రైల్వే ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఇది సరైన నిర్ణయం కాదు వాల్తేరు డివిజన్ రద్దును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదు. జోన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి.. ఆ సాకుతో చారిత్రక నేపథ్యం ఉన్న డివిజన్ను విడదీయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. వాల్తేరును విజయవాడలో విలీనం చెయ్యడం అవగాహన రాహిత్యం. దీని వల్ల వేల మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీనిపై మరోసారి ఉద్యమాన్ని ఉధ్ధృతం చేస్తున్నాం. డివిజన్ విభజనను వ్యతిరేకిస్తూ.. బుధవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నాం. – బమ్మిడి దామోదరరావు, కార్యదర్శి, ఈస్ట్కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ -
పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జ్ పీఆర్వో రాజశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్–నర్సాపూర్ ప్రత్యేక రైలు (07256) ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం 6.50 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.00కు నర్సాపూర్ చేరు కుంటుంది. నర్సాపూర్–హైదరాబాద్ రైలు (07255) ఏప్రిల్ 29న రాత్రి 7.30కు నర్సాపూర్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50కు హైదరాబాద్ చేరుకుంటుంది. లింగంపల్లి–విశాఖపట్నం రైలు (07148) ఏప్రిల్ 26న సాయంత్రం 5.00 గంటలకు లింగంపల్లిలో బయలు దేరి మరుసటి రోజు ఉదయం 8.00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం–లింగంపల్లి రైలు (07147) ఏప్రిల్ 27వ తేదీ ఉదయం 10.15కు విశాఖలో బయలుదేరి అదే రోజు రాత్రి 11.10కు లింగంపల్లి చేరుకుంటుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement