-
రాజధానిలోమలేరియా టెర్రర్!
సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో ఓ మురికివాడలో దోమలన్నీ వానాకాలం సమావేశాలు నిర్వహించాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని దోమలు ముక్కు కదిలించుకుంటూ తరలివచ్చాయి. సమావేశానికి డెంగీ లక్ష్మి అధ్యక్షత వహించగా.. ఈ ఏడాది ముఖ్యఅతిథిగా మలేరియా రాణిని ఆహ్వానించాయి. కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షలోనూ మలేరియా దోమ గురించే ప్రత్యేక ప్రస్తావన రావడంతో తనకు ఈ గౌరవం కట్టబెట్టాయి. ఈ సందర్భంగా మలేరియా రాణి మాట్లాడుతూ ‘గత ఐదేళ్లలో ప్రభుత్వం, అధికారుల సహకారంతో వందల మందిని మంచాన పడేశాం. ప్రతి ఏటా ఈ లక్ష్యాన్ని పెంచుకుంటూపోతున్నాం. ఈ ఏడాది కొత్త ప్రభుత్వమొచ్చాక మనపై దృష్టి సారించింది. ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయినా మనం వెనక్కి తగ్గకూడదు. మురుగు కాలువలను పట్టించుకోని అధికారులు ఉన్నంత కాలం మన లక్ష్యానికి ఢోకా లేదు. ఎంతైనా గత పాలనలో పరిశుభ్రతపై దృష్టి సారించని మున్సిపల్ అధికారులకు మనందరం సన్మానం చేయాలి. కొత్త ప్రభుత్వంలోనూ అలాంటి అధికారులుంటే వారినీ ఇదే విధంగా సత్కరించాలి. మరింత మంది రక్తాన్ని తాగి.. వారి ప్రాణాలు తీయాలి. ఈ ఏడాదికిగాను ఈ లక్ష్యాలను నేను ప్రతిపాదిస్తున్నాను’ అని మలేరియా రాణి ప్రసంగం ముగించింది. దీనికి గున్యా వాణి ఆమోదం తెలుపగా మిగిలిన దోమలన్నీ మద్దతు పలికాయి. చివరిగా మలేరియా రాణిని ఆదర్శంగా తీసుకుని ఇక ప్రజలను కుట్టేద్దాం కదలండంటూ సమావేశాన్ని ముగించాయి. మలేరియా జ్వరం.. ఈ పేరు చెబితేనే గ్రామాల్లో చాలా మంది వణికిపోతారు. నెలల తరబడి జ్వరం పీడిస్తూ ఉండటమే కారణం. వ్యాధి సోకిందంటే ఒక పట్టాన త్వరగా శరీరాన్ని వదిలిపోదు. మలేరియా వ్యాధి సోకి అనేక మంది చనిపోతున్నారు. గతేడాది 420 మంది మలేరియా బారిన పడగా, ఈ ఏడాది జనవరి నుంచి జూలై 15 వరకు 103 మంది మలేరియా బారిన పడ్డారు. మలేరియా వ్యాధి సోకకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజల్ని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అత్యధిక సంఖ్యలో తూర్పు గోదావరి జిల్లాలో మలేరియా కేసులు నమోదు అవ్వగా వైజాగ్ రెండో స్థానంలో, గుంటూరు జిల్లా మూడో స్థానంలో ఉంది. మలేరియా లక్షణాలు: మలేరియా వ్యాధి అనాఫిలిస్ అనే దోమకాటు వల్ల వస్తోంది. ఈ వ్యాధి వర్షాకాలంలో ఎక్కువగా ప్రబలుతుంది. చలి, వణుకుతో కూడిన విపరీతమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, మూత్రం మందగించటం, లివర్, కడుపులో నొప్పి, జ్వరం మూడు రోజులకొకసారి లేదా రెండు రోజులకొక సారి లేదా రోజుమార్చి రోజు వస్తూ ఉండటం ఈ వ్యాధి లక్షణాలు. నిర్ధారణ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ గంట వ్యవధిలోపు చేస్తారు. రక్తపు పూతలు సేకరించి వ్యాధి నిర్ధారణ జరిగితే క్లోరోక్విన్, ప్రైమాక్సిన్ అనే మాత్రలను ఇస్తారు. ఇవి 14 రోజులు ఆపకుండా తప్పని సరిగా వాడాలి. ఈ మందులన్నీ కూడా ఉచితంగా అందిస్తారు. న్యూడ్రగ్పాలసీ 2012 ప్రకారం తప్పని సరిగా 14 రోజులు మందులు వాడాలి. జిల్లాలో నమోదైన కేసులు.. జిల్లాలో మలేరియా జ్వరం 2014లో 428 మందికి, 2015లో 413 మందికి, 2016లో 369 మందికి, 2017లో 962 మందికి వచ్చింది. 2018లో 420 మందికి మలేరియా వచ్చింది. 2019లో జనవరిలో 47 మంది, ఫిబ్రవరిలో నలుగురు, మార్చిలో ఒకరు, ఏప్రిల్లో ఐదుగురు, జూన్లో 21 మంది, జూలైలో 25 మంది మొత్తం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 103 మలేరియా వ్యాధి బారిన పడ్డారు. మలేరియా కేసులు నమోదైన ప్రాంతాలు.. గుంటూరు నగరంలోని ఆర్టీసీ కాలనీ, బాలాజీనగర్, ఆలీనగర్, అంబేడ్కర్నగర్, పాతగుంటూరు, లాలాపేట, నల్లచెరువు, ఏటి అగ్రహారం, ఆర్. అగ్రహారం. బ్రాడీపేట, శారదాకాలనీ, శ్రీనివాసరావుపేట, గుంటూరువారితోట, పొత్తూరివారితోట, తారకరామనగర్, శాంతినగర్, వాసవినగర్, సంగడిగుంట, కృష్ణబాబుకాలనీ, కంకరగుంట, అడవితెక్కళ్లపాడు, లింగాయపాలెం, మోపిరివారిపాలెం, నరసరావుపేట, బొల్లాపలి, వినుకొండలో మలేరియా కేసులనమోదు అయ్యాయి. కచ్చితమైన నిర్ధారణ చేయాలి సరైన వ్యాధి నిర్ధారణ, చికిత్స చేయని పక్షంలో నెలల తరబడి మలేరియా వ్యాధి పీడిస్తోంది. కచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేయక ఏళ్ల తరబడి ఎందరో అవస్థలు పడిన సంఘటనలు ఉన్నాయి. కొందరిలో సెరిబ్రల్ మలేరియా, వైవ్యాక్స్ మలేరియాలు కూడా వస్తాయి. ఈ వ్యాధులు సోకిన వారిలో ప్లేట్లెట్స్ తగ్గిపోవటం, కామెర్లు పెరిగిపోవటం, నిమోనియా, ఫిట్స్, మూత్రపిండాలు చెడిపోవటం, స్ప్రుహకోల్పోవటం జరుగుతుంది. ఈ వ్యాధి మలేరియా ఉన్న వ్యక్తి రక్తం ఎక్కించటం ద్వారా, మలేరియా వ్యాధి ఉన్న వ్యక్తిని కుట్టిన దోమ మనల్ని కుట్టటం ద్వారా సోకుతోంది. –డాక్టర్ నరేంద్ర వెంకటరమణ, ఫిజీషియన్ నివారణ చర్యలు తీసుకుంటున్నాం మలేరియా నివారణ కోసం మే నెల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏప్రిల్లో మలేరియా నివారణ ప్రణాళిక సిద్ధం చేసి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. మలేరియా కేసులు నమోదైన గ్రామాల్లో మలాథిన్ఫాగింగ్ , పైరిత్రమ్ స్ప్రే, యాంటీలార్వా చర్యలు తీసుకున్నాం. మలేరియాను నోటిఫైడ్ డిసీజ్గా నిర్ధారణ చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులంతా తమ వద్దకు వచ్చిన వారికి మలేరియా వ్యాధి నిర్ధారణ చేసిన వెంటనే జిల్లా వైద్యాధికారులకు సమాచారం తప్పనిసరిగా ఇవ్వాలి. మలేరియాను 2027 కల్లా నిర్మూలించాలనే లక్ష్యంతో వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలి. –డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి -
పనిచేయని డాక్టర్లకు ఇంక్రిమెంట్లు ఆపండి
సంగారెడ్డి అర్బన్ : పనిచేయని డాక్టర్లకు ఇంటి అద్దెతో పాటు ఇంక్రిమెంట్లను ఆపాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని డాక్టర్లతో స్వైన్ఫ్లూతో పాటు పీహెచ్సీలలో నిర్వహిస్తున్న ప్రసవాలపై సమీ క్ష నిర్వహించారు. ప్రస్తుతం స్వైన్ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందుతున్నందున ప్రజల ను అప్రమత్తం చేయాలని కోరారు. అందులో భాగంగానే వ్యాధి కారకాలు, నివారణాలపై గోడపత్రికలు, కరపత్రా లు ఇతర పబ్లిసిటీ మెటీరియల్ను ప్రతి గ్రామ పంచాయతీ, మండల కార్యాలయాలు, కూడళ్ల వద్ద అతికించాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు చొరవ తీసుకుని ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ తమ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదన్నారు. జలుబు, దగ్గు, జ్వరం, తు మ్ములు, గొంతునొప్పి, ఒళ్లునొప్పు లు, శ్వాసలో ఇబ్బందులు ఉన్నట్లు అయి తే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని ప్రజలకు సూచించారు. ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటూ రోగులకు సేవలంచాలని సూచించారు. కొన్ని నెలలుగా కొన్ని కేంద్రాల్లో ఒక్క ప్రసవం కూడా జరుగక పోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అర్హత గల డాక్టరు, అధునాతన పరికరాలు అందుబాటులో ఉండి కూడా గర్భిణులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారంటే అందుకు కారణం డాక్టర్ నిర్లక్ష్యమేన్నారు. ఎస్పీహెచ్ఓలు ఇకపై ఎప్పటికప్పుడు పారామెడికల్ సిబ్బందితో సమీక్షలు నిర్వహించాలని ఏఎన్ఎమ్లకు ప్రతినెలా లక్ష్యాలను నిర్దేశించాలని, ల క్ష్యాలు సాధించని ఏఎన్ఎంల జీతాలను ఆపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డాక్టర్లు రిస్క్ ఉన్న కేసులను చేపట్టి, మిగితా వాటిని వదిలేయడం తగదన్నారు. హైరిస్క్ కేసులను ఎప్పటికప్పడు సమీక్షిస్తూ అవసరమైన ఏరియా ఆస్పత్రులకు, హెడ్ క్వార్టర్ ఆస్పత్రులకు పంపాలి కానీ ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించవద్దని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ బాలాజీ పవార్, పీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
షూటింగ్... పార్టీయింగ్...
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement