-
తెలంగాణ ఫలితాలపై మరో సర్వే.. 22 స్థానాలే కీలకం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ సమయం సమీపిస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థులందరూ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక, నేడు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరుగనుంది. మరోవైపు తెలంగాణ ఎన్నికలపై డెమోక్రసీ టైమ్స్ నెట్వర్క్ సర్వే సంస్థ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తెలంగాణలో 22 స్థానాలు కీలకం కానున్నట్టు సర్వేలో పేర్కొంది. సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. బీఆర్ఎస్-45 కాంగ్రెస్-42 బీజేపీ-4, ఎంఐఎం-6 స్థానాల్లో గెలుస్తుంది. అలాగే, తెలంగాణలోని 22 అసెంబ్లీ స్థానాల్లో మాత్రం హోరాహోరీ పోటీ తప్పదని పేర్కొంది. ఆ 22 స్థానాల్లో ఎక్కువ స్థానాలు ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో, సర్వే ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో హంగ్ ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. -
కర్ణాటకలో కాంగ్రెస్దే విజయం..! పీపుల్స్ పల్స్ సర్వేలో కీలక విషయాలు
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యత సాధిస్తుందని ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రంలో గత మూడున్నర దశాబ్దాల చరిత్రలో ఏ అధికార పార్టీ తిరిగి పగ్గాలు చేపట్టలేదు. చరిత్రను మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే, అధికారం చేపట్టి సంప్రదాయాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. కర్ణాటకలో పీపుల్స్పల్స్ చేపట్టిన ప్రీపోల్ సర్వేలో కాంగ్రెస్కు స్వల్ప ఆధిక్యత కనిపిస్తోంది. మహిళలు, పురుషులతో పాటు అన్ని వయస్సుల వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోగా.. ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం, సామాజిక అంశాలు, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇలా అన్ని రంగాలలో కాంగ్రెస్ ఇతర పార్టీల కంటే ముందుంది. కోస్తా కర్ణాటకను మినహాయించి అన్ని ప్రాంతాలలో హస్తం తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కంటే ముందంజలో ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 100 స్థానాలకు పైగ పొంది స్వల్ప మెజార్టీ సాధించే అవకాశాలున్నాయి. బీజేపీ 100 స్థానాలలోపే పరిమితం కావచ్చు. ఇదేసమయంలో జేడీ(ఎస్) తనకు పట్టున్న స్థానాల్లో ఆధిపత్యం కొనసాగిస్తూ 24 స్థానాలకుపైగా సాధించవచ్చు. సౌత్ఫస్ట్ న్యూస్ వెబ్సైట్ కోసం పీపుల్స్పల్స్ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ 105-117 స్థానాలు, బీజేపీ 81-93 స్థానాలు, జేడీ(ఎస్) 24-29, ఇతరులు 1-3 స్థానాలు పొందే అవకాశాలున్నాయి. 👉 2018లో 38.14 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ 41.4 శాతం పొందే అవకాశాలున్నాయి. 2018లో 36.35 ఓట్ల శాతం పొందిన అధికార బీజేపీ ఇప్పుడు స్వల్పంగా 0.3 శాతం కోల్పోయి 36 శాతం ఓట్లు సాధించవచ్చు. 2018లో కింగ్మేకర్ పాత్ర పోషించిన జేడీ(ఎస్) ఇప్పుడు 16 శాతం ఓట్లు సాధించే అవకాశాలున్నాయి. ఇది 2018 కంటే 2.3 శాతం తక్కువ. 👉 ఏ సర్వేలోనైనా రెండు శాతం ప్లస్ లేదా మైనస్ వ్యత్యాసాలు ఉండే అవకాశాలుంటాయి. చివరి రెండు రోజుల ప్రచారాన్ని సర్వే పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి చివరి నిమిషంలో ప్రధాన పార్టీలకు లభించే అనుకూల, వ్యతిరేక అంశాలను అంచనా వేయలేము. 👉 ‘‘సౌత్ ఫస్ట్’’ న్యూస్ వెబ్సైట్ కోసం పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ ఆర్.దిలీప్రెడ్డి నేతృత్వంలో 1 మే నుండి 5 మే వరకు ఈ సర్వే నిర్వహించారు. ‘ప్రాబబులిటీ ప్రొఫెషనల్ మెథడాలజీ’ (పీపీఎస్) పద్ధతి ద్వారా ఎంపిక చేసిన 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో మూడు పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో 20 శాంపిల్స్ తీసుకున్నారు. ప్రాంతం, కులం, వయస్సు, పురుషులు, స్త్రీలు, పేద`సంపన్నులు ఇలా తగు నిష్పత్తిలో ఉండేలా చూసుకుంటూ మొత్తం 3360 శాంపిల్స్ సేకరించడం జరిగింది. 👉 కర్ణాటకలో పీపుల్స్ పల్స్ సంస్థ మొదటి ప్రీ పోల్ సర్వేను 2022 డిసెంబర్ 22వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించగా, రెండో ప్రీ పోల్స్ సర్వేను 2023 మార్చి 25 నుండి 10 ఏప్రిల్ వరకు చేపట్టారు. చివరిదైన మూడవ ప్రీ పోల్ సర్వేను 2023 మే 1వ తేదీ నుండి 5 మే వరకు నిర్వహించారు. 👉 పీపుల్స్పల్స్ ప్రతినిధులు ప్రీపోల్ సర్వే కోసం 25 ఏప్రిల్ నుండి మే 5వ తేదీ వరకు రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రధాన పార్టీలపై ఓటర్ల నాడిని అంచనా వేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లను ముఖాముఖిగా కలుసుకోవడంతోపాటు అక్కడ వివిధ వర్గాలతో చర్చించి అక్కడ ఏ పార్టీకి అనుకూలంగా ఉందో తెలుసుకుంది. 👉 ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తున్నారని ఓటర్ల అభిప్రాయాన్ని కోరగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పక్షాన 42 శాతం మంది నిలిచారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైకి 24 శాతం, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి 17 శాతం, మాజీ సీఎం బి.యడియూరప్పకు 14 శాతం మంది, డి.కె.శివకుమార్కు 3 శాతం మంది ప్రాధాన్యతిచ్చారు. 👉 కర్ణాటక రాష్ట్రం అభివృద్ధికి ఏ పార్టీ మెరుగైనది అని ప్రశ్నిస్తే కాంగ్రెస్కు 46 శాతం, బీజేపీకి 34 శాతం, జేడీ(ఎస్)కు 14 శాతం ప్రాధాన్యతిచ్చారు. బీజేపీ ప్రభుత్వానికి మరో అవకాశం ఇస్తారా అని ప్రశ్నించగా 53 శాతం ఇవ్వమని, 41 శాతం ఇస్తామని చెప్పగా 6 శాతం మంది ఏమీ చెప్పలేమని తెలిపారు. కర్ణాటకలో పీపుల్స్పల్స్ ఏప్రిల్ నుండి నిర్వహిస్తున్న ప్రీపోల్ సర్వేలో రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 👉 టికెట్లను ప్రకటించాకా ప్రధాన మూడు పార్టీలలో అసంతృప్తి, తిరుగుబాటులు భారీగా ఉన్నాయి. 👉 పార్టీలు విడుదల చేసిన మ్యానిఫెస్టోలలో అనేక వివాదాస్పద అంశాలున్నాయి. 👉 ప్రధాన పార్టీల ప్రచారంలో అధినాయకత్వంతో ప్రధాన నేతలు పాల్గొన్న సందర్భాలలో అనేక వివాదాస్పద ప్రకటనలు, అంశాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటుచేసుకున్నాయి. 👉 ప్రధాన సామాజిక వర్గాల్లో ఓటింగ్ ప్రాధాన్యతలో మార్పులు : ప్రీ పోల్ సర్వే అంచనా ప్రకారం ప్రధాన పార్టీలన్నీ ఆయా సామాజిక వర్గాల్లో స్వల్ప మార్పులతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. బీజేపీ లింగాయత్లలో, ఎస్టీ నాయక్, ఎస్సీ లెఫ్ట్ వర్గాల్లో ఆధిపత్యం కొససాగిస్తుండగా, జేడీ(ఎస్) వొక్కలిగ సామాజిక వర్గంలో, కాంగ్రెస్ కురుబాలు, ఇతర ఓబీసీలు, ఎస్సీ రైట్, ముస్లిం వర్గాల్లో ఆధిపత్యం కొనసాగిస్తోంది. అయితే అభ్యర్థులు, స్థానిక అంశాల ఆధారంగా ఈ సామాజిక వర్గాల నిర్ణయాలలో స్వల్పమార్పులున్నాయి. ఎస్సీలోని బోవీ వర్గం ఇంతకాలం బీజేపీ వైపుండగా, ఇప్పుడు కాంగ్రెస్వైపు మళ్లారు. అలాగే, దక్షిణ కర్ణాటకలో ముస్లింలు జేడీ(ఎస్)ను కాదని కాంగ్రెస్ వైపు సానుకూలంగా ఉన్నారు. దిగువ తెలిపిన విధంగా కీలకమైన రాజకీయ అంశాలు పీపుల్స్పల్స్ సర్వే దృష్టికి వచ్చాయి : 👉 మతప్రాతిపదికన విభజన: బజరంగ్ దళ్పై నిషేధం అంశంపై బీజేపీ దృష్టి కేంద్రీకరించి మతప్రాతిపదికన విభజనకు ప్రయత్నించడంతోపాటు ఇటీవల విడుదలైన కేరళా స్టోరీ చిత్రంపై ప్రచారం చేస్తోంది. వీటిపై బీజేపీ నేతలు ప్రధానంగా దృష్టి పెట్టి పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా కోస్తా కర్ణాటక మినహా ఇతర చోట్ల ప్రభావం స్వల్పమే. అయితే ఇదేసమయంలో బజరంగ్దళ్పై నిషేధం అంశాన్ని బీజేపీ విజయవంతంగా ఓటర్ల వద్దకు చేర్చగలిగింది. 👉 ధరల పెరుగుదల అంశం : గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల అంశం ఓటర్లపై బాగానే ప్రభావం చూపుతోంది. 👉 నిరుద్యోగత : యువతలో నిరుద్యోగ అంశం ప్రాధాన్యతున్నా, వారు సామాజికంగా విడిపోయారు. లింగాయత్, మరాఠా, ఎస్టీ`నాయక్ యువత బీజేపీ పక్షాన ఉండగా, ముస్లింలు, ఎస్టీ(రైట్) యువత కాంగ్రెస్ పక్షాన, వొక్కలింగా యువత జేడీ(ఎస్)కు మద్దతుగా ఉండడం ఇక్కడ గమనార్హం. 👉 అవినీతి: కాంగ్రెస్ ఎన్నికల్లో అవినీతి అంశాన్ని పెద్దఎత్తున లేవనెత్తుతోంది. రాష్ట్రంలో ‘40% కమిషన్ సర్కార్’’ అంశాన్ని లేవనెత్తుతున్నా, ఓటర్లు అవినీతి అంశం ఆధారంగా ఎన్నికలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. 👉 వ్యవసాయ అంశాలు: పంటకు కనీస మద్దతు ధరపై, పంట నష్టం పరిహారంపై ప్రభుత్వ పనితీరుపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ తమకేమి చేయలేదనే అసంతృప్తితో వారు కాంగ్రస్, జేడీ(ఎస్)కు మద్దతుగా ఓటు వేయవచ్చు. 👉 కన్నడ గౌరవం: దక్షిణ కర్ణాటకలో కన్నడ గౌరవం ప్రభావం ఉండగా, ఉత్తర కర్ణాటకలో లేదు. అయితే ఓటింగ్పై ప్రభావం చూపకపోవచ్చు. 👉 పార్టీలలో తిరుగుబాటు: రాష్ట్ర ఎన్నికల్లో ఇది కీలకాంశం. పార్టీ అభ్యర్థులపై తిరుగుబాటుతో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు నష్టపోనున్నాయి. 👉 కాంగ్రెస్ హామీలు: ఎన్నికల్లో కాంగ్రెస్ హామీల ప్రభావం కనిపిస్తోంది. గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్న భాగ్య, యువ నిధి, మహిళలకు ఉచిత బస్సు సర్వీసు హామీల ప్రభావం పేదలు, మహిళలు, గ్రామీణ ప్రజలపై బాగానే ఉంది. వివిధ వర్గాలలో ఓటింగ్ ప్రాధాన్యతలో మార్పులు చేర్పులు: సామాజికంగా, మహిళలు, పురుషుల ఆధారంగా ఓటింగ్ ప్రాధాన్యతను ప్రీ పోల్ సర్వేలో గమనించాం. అనేక అంశాలపై వివిధ సామాజిక వర్గాలలో, పేదలలో, మహిళల్లో ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం వలే కర్ణాటక బీజేపీ సంక్షేమ పథకాలను ప్రకటించడంలో విఫలమైంది. ఈ అంశాలు బీజేపీకి నష్టం చేకూరుస్తున్నాయి. కుమారస్వామి ఎన్నికల ముందు చేపట్టిన చర్యలు ఆయనకు మేలు చేకూర్చవచ్చు. ఈ వర్గాలలో చాలా మంది కాంగ్రెస్పట్ల సానుకూలంగా ఉన్నారు. 👉పార్టీ ప్రాధాన్యతలో మార్పులు: దీనికి సంబంధించి సర్వేలో మూడు ప్రధాన మార్పులను గుర్తించాం. ► సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయని అధికంగా భావిస్తున్నా, కాంగ్రెస్కు మెజార్టీ వచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయ పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదేసమయంలో బీజేపీ మెజార్టీ సాధించవచ్చని అభిప్రాయపడుతున్న వారి సంఖ్య తగ్గుతోంది. ► కాంగ్రెస్కు ఓటు వేసే వారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు, బీజేపీ, జేడీ(ఎస్)కు ఓటు వేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. ► ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కేఆర్పిపి (జనార్థన్రెడ్డి నేతృత్వంలో పార్టీ) వంటి చిన్న పార్టీలతో ఇతర ఇండిపెండెంట్ల ప్రభావం తక్కువగా ఉంది. వారు 1 నుండి 3 సీట్లు మాత్రమే పొందే అవకాశాలున్నాయి. పై కారణాల వలన కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో మెజార్టీ పొందే అవకాశాలున్నాయి. మరోవైపు చాలా మంది హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందనే అభిప్రాయపడుతున్నారు. ► వివిధ పార్టీల ప్రచార ప్రభావం: కర్ణాటకలో ప్రస్తుత పరిస్థితి ప్రకారం కాంగ్రెస్ ప్రచారంలో ముందంజలో ఉంది. రాష్ట్రంలో గాంధీ కుటుంబంతో సహా అగ్ర నేతలందరూ ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ అవినీతి, అభివృద్ధి లేకపోవడం, నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాలను కాంగ్రెస్ ప్రధానంగా ప్రచారం చేస్తోంది. మరోవైపు బీజేపీ ప్రచారంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది. ప్రజాకర్షణ ఉన్న ప్రధాన మంత్రి ఉత్సాహంగా రికార్డు స్థాయిలో ర్యాలీలలో పాల్గొన్నారు. ఇతర బీజేపీ అగ్రనేతలు అలిసిపోయినట్టు కనిపించారు. బీజేపీ ప్రచారంలో అనేక మార్పుచేర్పులు కనిపించాయి. ఆ పార్టీ మొదట జాతీయ అంశాలకు ప్రాధాన్యతివ్వగా, ప్రజల నుండి సానుకూలత కన్పించకపోవడంతో పిమ్మట స్థానిక అంశాలకు ప్రాధాన్యతిచ్చింది. తనపై దూషణలు చేస్తుందని ప్రధాన మంత్రి కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేశారు. చివరగా బీజేపీ మతప్రాతిపదిక ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చింది, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో బజరంగ్ దళ్పై నిషేధంపై భారీగా ప్రచారం చేసింది. ‘కేరళా స్టోరీ’ లవ్జిహాద్పై దృష్టి పెట్టింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలవలే ఇక్కడ కూడా జాతీయ అంశాల కంటే స్థానిక అంశాలే ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. జేడీ(ఎస్) దక్షిణ కర్ణాటకపైనే దృష్టి పెట్టి స్థానిక అంశాల ప్రచారానికే ప్రాధాన్యతిచ్చింది. ఈ వ్యూహం పార్టీకి ప్రయోజనం చేకూర్చే అవకాశాలున్నాయి. చదవండి: Karnataka Assembly elections 2023: తుమకూరులో రెబెల్స్ హోరు -
మణిపూర్లో ఆ పార్టీదే గెలుపు.. ఎందుకంటే?
ఇంఫాల్: మణిపూర్లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని రిపబ్లిక్ టీవీ- పీఎంఏఆర్క్యూ ప్రిపోల్ సర్వే అంచనా వేసింది. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ 31-37 సీట్లు (39.2 శాతం ఓట్లు) గెల్చుకునే అవకాశం ఉందని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి ఈసారి 13-19 సీట్లు (28.7 శాతం ఓట్లు) దక్కుతాయని తెలిపింది. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 3 నుంచి 9, నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) ఒకటి నుంచి 5 స్థానాలను కైవసం చేసుకుంటాయని సర్వేలో వెల్లడైంది. ఎన్పీపీకి 14.2, ఎన్పీఎఫ్ 6.4, ఇతరులు 11.5 శాతం ఓట్లు దక్కించుకుంటారని అంచనా కట్టింది. 2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపులు ప్రోత్సహించి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలు మాత్రమే నెగ్గిన బీజేపీ బలం ఈ ఐదేళ్ల కాలంలో 29కి పెరిగింది. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. (చదవండి: పశ్చిమ యూపీ బీజేపీకి కత్తిమీద సామే!) నిరుద్యోగమే అతిపెద్ద సమస్య మణిపూర్లో బీజేపీ ప్రభుత్వ పనితీరు బాగుందని 59 శాతం మంది, ఫర్వాలేదని 29 శాతం, బాలేదని 12 శాతం మంది సర్వేలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద సమస్య ఉపాధిలేమి అని ఎక్కుమంది(29 శాతం) తెలిపారు. తాగునీటి కొరత(24 శాతం), అస్తవ్యస్థ రహదారులు(17 శాతం), అవినీతి(5 శాతం) వంటి సమస్యలు కూడా ఉన్నాయని వాపోయారు. తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు ఎన్ బైరాన్ సింగ్ పేరును ఎక్కువ మంది(36 శాతం) చెప్పారు. ఇబోబి సింగ్(17 శాతం), యుమ్నం జోయ్కుమార్ సింగ్(11 శాతం), గైఖేంగమ్(10 శాతం), బిశ్వజిత్(5 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. (చదవండి: ఆ రోజు వద్దు.. మరో రోజు పోలింగ్ పెట్టండి ప్లీజ్) మార్చి 10న ఎన్నికల ఫలితాలు మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరగనున్నాయి. ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 27, మార్చి 3న పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, తొలి విడత పోలింగ్ తేదీని మార్చాలని ఆల్ మణిపూర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ (ఏఎంసీఓ) కోరుతోంది. (చదవండి: ఎన్నికల రాష్ట్రంలో వరుస గ్రెనేడ్ దాడులు.. కలకలం) -
సర్వే : పురపోరులో కారు హవా..!
హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయ దుందుభి మోగిస్తుందని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వే కూడా ఇదే అంశం స్పష్టం చేసింది. జనవరి 17 నుంచి 19 వరకు 20 శాతం మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్ల పరిధిలో ప్రీ పోల్ సర్వేను చేపట్టినట్టు ఆ సంస్థ తెలిపింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో భారీ సంఖ్యలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని పేర్కొంది. పార్టీలు విజయం సాధించే స్థానాలు(ప్లస్ ఆర్ మైనస్ 3 శాతం) పార్టీ వార్డులు (మున్సిపాలిటీలు) డివిజన్లు(కార్పొరేషన్లు) టీఆర్ఎస్ 1950-2000 180-205 కాంగ్రెస్ 375-415 40-60 బీజేపీ 150-180 60-75 ఎంఐఎం 25-30 8-10 అలాగే కార్పొరేషన్లలో టీఆర్ఎస్కు 49.1 శాతం, కాంగ్రెస్కు 21 శాతం, బీజేపీకి 23.8 శాతం, ఎంఐఎంకు 3.3 శాతం ఓట్లు వస్తాయని ఆ సంస్థ అంచనా వేసింది. అలాగే 120 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్కు 52.3 శాతం, కాంగ్రెస్కు 23.3 శాతం, బీజేపీకి 16.1 శాతం, ఎంఐఎంకు 1.6 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. కార్పొరేషన్లలో, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ స్పష్టమైన అధిక్యం కనబరుస్తుందని వెల్లడించింది. టీఆర్ఎస్తో పొల్చితే బీజేపీ, కాంగ్రెస్లు చాలా తక్కువ స్థానాల్లో విజయం సాధిస్తాయని పేర్కొంది. అలాగే కార్పొరేషన్లలో కాంగ్రెస్ కన్న బీజేపీ ఎక్కువ డివిజన్లను, అలాగే మున్సిపాలిటీల్లో బీజేపీ కన్న కాంగ్రెస్ ఎక్కువ వార్డులను కైవసం చేసుకుంటుందని ఆ సంస్థ చెప్పింది. కార్పొరేషన్లలో ఓట్ల శాతం.. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం ఎన్నికలు జరగగా మొత్తం 70.26 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు పలు కారణాల వల్ల కరీంనగర్ కార్పొరేషన్కు మాత్రం శుక్రవారం పోలింగ్ జరుగుతోంది. అలాగే కామారెడ్డి, భోదన్, మహబూబ్నగర్లలోని ఒక్కో కేంద్రంలో నేడు అధికారులు రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీల్లో ఓట్ల శాతం.. -
‘ముందస్తు సర్వేలు’ నిజమయ్యేనా?
సాక్షి, న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పనితీరులపై నిర్విహించిన ముందస్తు సర్వేల్లో మెజారిటీ రాష్ట్రాల ప్రజలు ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాల పనితీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రమే ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో కేంద్ర పాలన పట్ల కన్నా రాష్ట్ర ప్రభుత్వం పాలన పట్ల ఎక్కువ అసంతృప్తి వ్యక్తం కావడం గమనార్హం. సీఎస్డీఎస్ గత మార్చిలో విడుదల చేసిన ముందస్తు సర్వే నివేదిక ప్రకారం కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, చత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలు కేంద్రంలోని బీజేపీ పాలనకన్నా తమ రాష్ట్ర ప్రభుత్వాల పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక తమిళనాడు, కేరళ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కేంద్రంలోని బీజేపీ పాలన పట్ల ఎక్కువ అసంతృప్తి వ్యక్తం అయింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కేంద్రంలోని బీజేపీ పాలన పట్ల ఎక్కువ సంతృప్తి వ్యక్తం అయింది. సీ ఓటర్ సర్వే అంశాలు ఇందుకు కాస్త భిన్నంగా ఉన్నాయి. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకన్నా కేంద్రం పాలన పట్లనే ఎక్కువ మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. చత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకన్నా కేంద్ర ప్రభుత్వం పనితీరు పట్ల సంతృప్తి ఎక్కువ వ్యక్తం చేశారు. తెలంగాణలో కేంద్రం పాలనకన్నా రాష్ట్రం పాలన పట్ల ఎక్కువ మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడులో బీజేపీతో చేతులు కలిపి లోక్సభకు పోటీ చేస్తున్న అన్నా ఏఐడిఎంకే రాష్ట్ర పాలనపట్ల, అటు కేంద్రం పాలనపట్ల ఎక్కువ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకేనేమో రాష్ట్ర పాలన పట్ల ఎక్కువ సంతృప్తి వ్యక్తం అయిన తెలంగాణలో పాలకపక్ష టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ప్రజల సంతృప్తి, అసంతృప్తిల ప్రకారమే లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయా ? అన్న అంశాన్ని అధ్యయనం చేయాలి. లోక్సభకు ఇప్పటికే ఐదు విడతల పోలింగ్లు ముగియగా, మరో రెండు విడతల పోలింగ్లు మిగిలి ఉన్నాయి. ప్రజలు ముందస్తుగా వ్యక్తం చేసిన అభిప్రాయలకే కట్టుబడి ఓటు వేస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి కేంద్రం కన్నా రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్లనే ప్రజలు సంతృప్తి అయినా అసంతృప్తయినా ఎక్కువ వ్యక్తం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement