-
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవహక్కులను ఉల్లంఘిస్తూ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. శుక్రవారం 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీభవన్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు భట్టివిక్రమార్క, నర్సారెడ్డి, వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మధు యాష్కీ, సర్వే సత్యనారాయణ, దానం నాగేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఇక్కడి పాలకులు అవమానపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబేడ్కర్ పేరు మీద ఉన్న ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంగా చేశారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు కేవలం పేరు మార్చడం ద్వారా రూ.50 వేలకోట్ల అంచనా వ్యయాన్ని పెంచారన్నారు. దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందన్నారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు వస్తాయన్నారు. -
కేసీఆర్కు ముక్కు కూడా మిగలదు: జీవన్ రెడ్డి
జగిత్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు పట్టిన శని అని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జీవన్రెడ్డి విమర్శించారు. ఆయనకు చట్టాలపై అవగాహన ఉందో లేదో తెలియదని, న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో అంతర్గత విభేదాలతో సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలపై కోర్టుకు వెళ్లి కాంగ్రెస్ను బాధ్యులను చేస్తున్నారని అన్నారు. ఆయనేమీ రాజ్యాంగానికి అతీతుడు కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఇప్పటివరకు కేంద్రానికి డీపీఆర్ సమర్పించలేదని విమర్శించారు. కేసీఆర్ అబద్ధాలతో ప్రజల్ని మోసం చేస్తున్నారని.. చెప్పే అబద్ధాలకు, చేసే మోసాలకు ముక్కు నేలకు రాయాల్సి వస్తే కేసీఆర్కు ముక్కు కూడా మిగలదని ఎద్దేవా చేశారు. ప్రాణహిత- చేవెళ్ల తో తెలంగాణ సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉన్నా, రీడిజైన్ పేరుతో కాలయాపన చేస్తున్నారని, ప్రాజెక్టుల నిర్మాణ జాప్యానికి కేసీఆర్ కారణమని ఆరోపించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విధి లేని పరిస్థితుల్లోనే కరీంనగర్ మెడికల్ కాలేజ్ కోసం ఆమరణ దీక్షకు దిగుతున్నారని చెప్పారు. ఈ రాష్ట్రంలో పౌరహక్కులకు విలువ లేదన్నారు. అహంకారమే కేసీఆర్ను గద్దె దించుతుందని జీవన్రెడ్డి తెలిపారు. -
'డిజైన్ మార్చితే తీవ్ర పరిణామాలే'
హైదరాబాద్ : ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును యథావిధిగా నిర్మించాలని, డిజైన్ మార్చితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నగరంలో మీడియాతో శుక్రవారం ఆమె మాట్లాడుతూ... రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు తాగు, సాగునీరు అందించడం సీఎం కె.చంద్రశేఖర్రావుకు ఇష్టం లేనట్టుగా ఉందన్నారు. అందుకోసమే ప్రాణహిత-చేవెళ్లను మెదక్ వరకు పరిమితం చేస్తానని కేసీఆర్ అంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్ ను కేసీఆర్ మరిచారా అని ఈ సందర్భంగా సబిత ప్రశ్నించారు. వాటర్ గ్రిడ్ కోసమే ప్రాణహిత - చేవెళ్లను రీ డిజైన్ చేస్తున్నారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ రంగారెడ్డి ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టును చేవెళ్ల వరకు చేపట్టాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ప్రాణహిత పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే కేసీఆర్ ఈ ప్రాజెక్టుపై వివాదం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. -
గోదారికి రాంరాం.. జూరాలకు సలాం!
- ప్రాణ హిత- చేవెళ్ల ప్రాజెక్టు కుదింపు యత్నం - పక్కజిల్లాల వరకే పరిమితం - ప్రత్యామ్నాయంగా జూరాల నుంచి కృష్ణాజలాలు - మూడో దశలో మన జిల్లాకు సాగునీరు - రూ.32వేల కోట్ల అంచనా వ్యయం - ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి దశాబ్ధకాలం అన్నదాతలకు ఆదరువు అవుతుందనుకున్న ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టు కథ.. కంచికి చేరుతుంది. నెర్రెలు విచ్చుకున్న నేలలను సస్యశ్యామలం చేసి హరితతోరణం సృష్టిస్తుందని భావించిన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కుదించే యత్నం చేస్తోంది. గోదావరి జలాలను రంగారెడ్డి జిల్లాకు తరలించాలని కలలుగన్న జనహృదయ నేత, స్వర్గీయ డాక్టర్ రాజశేఖరరెడ్డి ఆశయానికి గండికొడుతూ.. ప్రాజెక్టులో అటు ప్రాణహిత.. ఇటు చేవెళ్లకు కోత పెట్టడం ద్వారా ైరె తాంగం ఆశలపై నీళ్లు జల్లుతోంది. ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టుతో హరితవిప్లవం ఖాయమని భావించిన కర్షకులను ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల’ పథకంతో ఏమారుస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :భూగర్భజలాలపై ఆధారపడుతున్న తెలంగాణ జిల్లాలో హరితసిరులు పండించాలనే సంకల్పంతో ప్రాణహితకు డిజైన్ చేసిన ప్రభుత్వం.. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.38,500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. దీంట్లో భాగంగా రంగారెడ్డి జిల్లాలో రూ.1.40 లక్షల ఆయకట్టును స్థిరీకరించవచ్చని అంచనా వేయడమేకాకుండా.. పంప్హౌజ్, సొరంగం, భూసేకరణ, ఇతర పనులకు రూ.1,500 కో ట్లను కూడా ఖర్చు చేసింది. అయితే, ప్రస్తుతం కేసీఆర్ సర్కారు చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ను మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ నుంచి చేవెళ్లకు గోదారి నీటిని తరలించడం భగీరథ ప్రయత్నమే అవుతుందని భావిస్తున్న సర్కారు ప్రాజెక్టును పక్క జిల్లాల వరకే పరిమితం చేసి రంగారెడ్డిని తప్పించే యత్నం చేస్తోంది. ప్రాణహితకు ప్రత్యామ్నాయంగా పక్కనే ఉన్న జూరాల నుంచి కృష్ణా జలాలను ఎత్తిపోతల ద్వారా తీసుకొచ్చి జిల్లాలోని బీడు భూములను సాగులోకి తీసుకురావడం ఉత్తమమనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పట్లో కష్టమే..! ‘పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల’ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. వరద సమయాల్లో వృధాగా పోతున్న 70 టీఎంసీల నీటిని వినియోగించుకోవడం ద్వారా కృష్ణా బేసిన్లోని రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలు.. అందులో రంగారెడ్డి జిల్లాలో 2.70 లక్షల ఎకరాలకు సస్యశ్యామలం చేయవచ్చని అంచనా వేసింది. అయితే, నిర్మాణ వ్యయం తడిసిమోపెడు కానుండడం.. ముంపు బారిన పడే గ్రామాల సంఖ్య గణనీయంగా ఉండడంతో పునరాలోచనలో పడింది. తొలిదశలో జూరాల నుంచి కోయిల్కొండ వరకు కృష్ణా జలాలను తీసుకురావాలనే ప్రతిపాదనపై ఇంజినీరింగ్ నిపుణుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రూ.32 వేల కోట్లు ఖర్చుచేసి కేవలం రిజర్వాయర్లలో నీటిని నింపుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటని.. ఆయకట్టు స్థిరీకరణ జరిగితే తప్ప ప్రాజెక్టు లక్ష్యం నెరవేరదని అంటున్నారు. భారీ వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టు మొదటి రెండు దశలు దాటి మూడో దశలో పనులు కార్యరూపం దాల్చాలంటే దాదాపు దశాబ్ధకాలం పట్టే అవకాశం ఉందని విశ్లేషిస్తున్న నిపుణులు.. రంగారెడ్డి జిల్లాకు ఇప్పట్లో జూరాల జ లాలు రావడం కల్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. -
పాత డిజైనే ప్రాణ‘హితం’!
రాష్ట్ర ప్రభుత్వానికి రిటైర్డ్ ఇంజనీర్ల బృందం సూచన {పాజెక్టుపై రూపొందించిన నివేదికలో వెల్లడి మహారాష్ట్ర కోరినట్లు మీటర్ ఎత్తు తగ్గించి తుమ్మిడిహెట్టి నుంచే నీటి మళ్లింపు చేయాలని సూచన 20-30 టీఎంసీలు తగ్గితే.. వేమనపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి వాడుకోవచ్చని ప్రతిపాదన ఇలాచేస్తేనే ఇప్పటిదాకా జరిగిన పనులు వృథా కావని హితవు హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పాత డిజైనే శ్రేయస్కరమని గోదావరి ప్రాజెక్టుల పరిశీలనకు ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఇంజనీర్ల బృందం తేల్చింది. కావాలంటే మహారాష్ట్ర కోరుతున్నట్లుగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును ఒక మీటరు మేర తగ్గించి.. నీటిని మళ్లించుకోవడమే మేలని స్పష్టం చేసింది. ఎత్తు తగ్గింపుతో నిర్ణీత స్థాయిలో నీటిని తీసుకోలేకపోతే... మిగ తా నీటిని ప్రాణహితకు దిగువన ఉన్న వేమనపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి మళ్లించుకోవచ్చని సూచించింది. ఇలాచేస్తే ఇప్పటివరకు జరిగిన దాదాపు రూ. 4 వేల కోట్ల విలువైన పనులు వృథా కావని రిటైర్డ్ ఇంజనీర్ల బృందం తమ నివేదికలో తేల్చిచెప్పినట్లు సమాచారం. ఘనమైన ప్రాజెక్టు.. గోదావరి నది నుంచి 160 టీఎంసీల నీటిని మళ్లించి.. సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు పథకం పొడవునా గ్రామాలకు, రాజధానికి తాగునీరు అందించడం కోసం రూ. 38,500 కోట్ల అంచనా వ్యయంతో ‘ప్రాణహిత-చేవెళ్ల’ భారీ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించి.. అక్కడి నుంచి ఎల్లంపల్లికి, మిడ్మానేరుకు నీటిని మళ్లించి, ఆ తర్వాత హైదరాబాద్ మీదుగా చేవెళ్ల వరకూ నీటిని తరలించనున్నారు. అయితే తుమ్మిడిహెట్టి బ్యారేజీతో తమ ప్రాంతంలో ముంపు ఎక్కువగా ఉంటుందని, ఎత్తు తగ్గించాలని మహారాష్ట్ర కోరడంతో... ప్రాజెక్టు డిజైన్ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నుంచి కాకుండా.. 110 కిలోమీటర్ల దిగువన ఉన్న కాళేశ్వరం సమీపంలోని మేటిగడ్డ వద్ద నీటిని మళ్లించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ డిజైన్ మార్పుపై అధ్యయనం చేసే పనిని వ్యాప్కోస్ సంస్థకు అప్పగించింది. ఇక మరోవైపు గోదావరిలో లభ్యత నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా అదనపు బ్యారేజీల నిర్మాణం, ప్రాజెక్టుల పరిధిలో చేయాల్సిన రీ డిజైనింగ్ తదితర అంశాల పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు రిటైర్డ్ ఇంజనీర్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవలే ఈ బృందం సభ్యులు అనంతరాములు, వెంకట్రామారావు, చంద్రమౌళి, దామోదర్రెడ్డి, శ్యాంప్రసాద్రెడ్డి, సాంబయ్య, జగదీశ్వర్ ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రాణహిత ప్రాజెక్టు పనులను పరిశీలించారు. దీనిపై తమ ప్రతిపాద నలు, సూచనలతో కూడిన 14 పేజీల నివేదికను గురువారం నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులకు అందజేశారు. పాత డిజైన్కే మొగ్గు! దుమ్ముగూడెం నుంచి ప్రాణహిత వరకు ఎక్కడెక్కడ అదనపు బ్యారేజీల నిర్మాణం చేపట్టాలనే దానిపై తమ 14 పేజీల నివేదికలో స్పష్టంగా వివరించిన కమిటీ... చివరి రెండు పేజీల్లో మాత్రం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించింది. కొత్త ప్రతిపాదన అయిన కాళేశ్వరం వద్ద నీటి మళ్లింపునకు పూనుకుంటే.. విద్యుత్ అవసరం మరో 400 మెగావాట్ల మేర పెరుగుతుందని స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేగాకుండా ఇప్పటివరకు బ్యారేజీ 152 మీటర్ల ఎత్తును పరిగణనలోకి తీసుకుని జరిగిన రూ. నాలుగు వేల కోట్ల విలువైన కాలువల పనుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర కోరుతున్నట్లుగా బ్యారేజీ ఎత్తును ఒక మీటరు తగ్గించి, 151 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్రను ఒప్పించాలని రిటైర్డ్ ఇంజనీర్ల బృందం సూచించింది. ఎత్తు తగ్గింపు వల్ల నిర్ణీత 160 టీఎంసీల నీటి మళ్లింపు సాధ్యంకాకుంటే... 130 టీఎంసీల వరకు తరలించి, మరో 30 టీఎంసీలను బ్యారేజీకి 70 కిలోమీటర్ల దిగువన ఉన్న వేమనపల్లి వద్ద మళ్లించవచ్చని తెలిపింది. దీనికోసం వేమనపల్లి వద్ద మరో బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని పేర్కొంది. ఇలా చేస్తే ఎల్లంపల్లి తర్వాతి మూడు ప్యాకేజీలు యథావిధిగా ఉంటాయని బృందం పేర్కొన్నట్లుగా తెలిసింది. వ్యాప్కోస్ నివేదిక వచ్చాకే.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ బాధ్యతలను ప్రస్తుతం వ్యాప్కోస్కు అప్పగించినందున.. రిటైర్డ్ ఇంజనీర్ల బృందం నివేదికపై ప్రభుత్వం వెంటనే ఏ నిర్ణయానికీ రాలేదని నీటి పారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యాప్కోస్ నివేదిక అందాక.. రెండు నివేదికలను పరిశీలించి ప్రాజెక్టుపై ముందుకెళ్లే అవకాశం ఉందని తెలిపాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement